Jadavpur University: ఆ యూనివర్సిటీలో ఆగని నిరసనలు.. రాష్ట్ర మంత్రిపై కేసు నమోదు

పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పుర్‌ యూనివర్సిటీలో నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి భ్రత్య బసుపై కేసు నమోదైంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Case against Bengal minister, his driver in Jadavpur University clashes

Case against Bengal minister, his driver in Jadavpur University clashes

Jadavpur University: పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పుర్‌ యూనివర్సిటీలో నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి భ్రత్య బసుపై కేసు నమోదైంది. ఇటీవల ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో ఇద్దరు విద్యా్ర్థులు గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆ విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ మంత్రిపై కేసు నమోదు చేశారు. 


యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులను రక్షించడంలో విఫలమైందని విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేశాయి. దీంతో మంత్రి భ్రత్య బసు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అలాగే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ అంశంపై గత కొన్ని రోజులుగా విద్యార్థుల నుంచి తీవ్రంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మంత్రి కాన్వాయ్‌ను కూడా ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన సీపీఐ (M) విద్యార్థి సంఘం చుట్టుముట్టింది.  

Also Read: పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌కు అమెరికా బిగ్ షాక్.. ప్రయాణాలు నిషేధం !

మంత్రికి స్వల్ప గాయాలు

కాన్వాయ్ ముందుకు వెళ్లడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. విద్యార్థులు  మంత్రి కారు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు. మంత్రికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన విద్యార్థుల్లో ఒకరు మంత్రిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మంత్రితో పాటు కాన్వాయ్ డ్రైవర్, టీఎంసీ నేత ఓం ప్రకాశ్ మిశ్రా, అలాగే ఓ ప్రొఫెసర్‌పై కేసు నమోదైంది.  

ఇదిలాఉండగా.. యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికల తేదీలను వెంటనే ప్రకటించాలనే డిమాండ్‌తో ఈ నిరసనలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఇది హింసాత్మకంగా మారింది. ఉపాధ్యాయ సంఘం కార్యాలయానికి కూడా పలువురు నిప్పంటితారు. దీంతో వర్సిటీలో పరిస్థితులు అదుపుతప్పాయి. 

Also Read: ఇండియాపై ట్రంప్ విధించే టారిఫ్‌తో ఈ రంగాలు కుదేలు

విద్యార్థి సంఘం ఎన్నికల తేదీలను వెంటనే ప్రకటించాలని స్టూడెంట్స్ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల నిరసన హింసాత్మకంగా మారింది. ఉపాధ్యాయ సంఘం కార్యాలయాన్ని వారు ముట్టడించి నిప్పంటించారు. దీంతో యూనివర్సిటీలో పరిస్థితులు అదుపుతప్పాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

హర్యానాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని కాల్వలో పడేశారు. చివరికీ పోలీసుల మహిళా యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

New Update
Haryana YouTuber Strangles Husband with Lover

Haryana YouTuber Strangles Husband with Lover

ఈ మధ్య భార్యాభర్తల మధ్య హత్యలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం లేదా ప్రియురాలి కోసం భార్యను చంపేయడం లాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని భివానీలో యూట్యూబర్ రవీనా, ప్రవీణ్ దంపతులు ఉంటున్నారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

2017లో వీళ్లకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం రవీనాకు ఇన్‌స్టా్గ్రామ్‌లో ప్రేమ్‌నగర్‌కు చెందిన మరో యూట్యూబర్‌ సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే మార్చి 25 వాళ్లిద్దరిని అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రవీణ్‌ చూశాడు. దీంతో అతడు నిలదీయగా.. వాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రవీనా, సురేశ్‌.. ప్రవీణ్‌ గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు వారు ఆ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్‌ ఎక్కడున్నాడని అతడి కుటంబ సభ్యులు అడిగినా కూడా రవీనా తనకేమి తెలియదని చెప్పింది.  

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

చివరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల తర్వాత వాళ్లకి కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. దీంతో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించగా.. రవీనా బండారం బయటపడింది. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లు రవీనా ఒప్పుకుంది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అలాగే యూట్యూబర్ సురేశ్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఉన్నాకూడా రవీనా సోషల్ మీడియాలో వీడియోలు చేసేదని విచారణలో తేలింది. అంతేకాదు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తేలింది. 

 

Advertisment
Advertisment
Advertisment