BJP: జాతీయ పార్టీలకు విరాళాలు.. బీజేపీకే అత్యధిక ఫండ్స్‌

అసోసియేషన్ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలను విడుదల చేసింది. బీజేపీకే అత్యధికంగా విరాళాలు అందినట్లు తెలిపింది. ఈ పార్టీకి రూ.2,243 కోట్లు సమకూరినట్లు పేర్కొంది.

New Update
BJP tops list of national parties in Donations

BJP tops list of national parties in Donations

అసోసియేషన్ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) కీలక విషయాన్ని వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలను విడుదల చేసింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే అత్యధికంగా విరాళాలు అందినట్లు తమ నివేదికలో తెలిపింది. ఈ పార్టీకి మొత్తం రూ.2,243 కోట్లు సమకూరినట్లు పేర్కొంది.  

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం.. అన్ని పార్టీలకు వచ్చిన విరాళాల మొత్తం రూ.2,544.28 కోట్లుగా ఉంది. గత ఏడాది ఈ సంఖ్య 12,547 కోట్లుగా ఉంది. ఈ ఏడాది వచ్చిన మొత్తం విరాళాల్లో ఒక్క బీజేపీయే 88 శాతం వాటా దక్కించుకుంది. ఈ విరాళాల్లో 211 శాతం పెరుగుద కనిపించింది. బీజేపీ తర్వాత అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీగా మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ నిలిచింది. 

Also Read: అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ లాంటి పార్టీలకు తక్కువగా విరాళాలు వచ్చాయి. తమకు రూ.20 వేలకు మించి విరాళాలు రాలేదని బీఎస్పీ మరోసారి చెప్పింది. 2022-2023 ఆర్థిక ఏడాదితో పోలిస్తే 2023-24లో జాతీయ పార్టీలకు 199 శాతం పెరిగింది. 2023-24లో జాతీయ పార్టీలకు  వచ్చిన మొత్తం విరాళాల్లో 88 శాతం బీజేపీ ఖాతాలోకే చేరాయి. 

Also Read: రేపు ఇందిరా పార్క్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష.. దేనికోసమంటే....

Also Read: HCU వివాదం.. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్!

rtv-news | bjp | congress | party-funds

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment