Adani: లక్ష కోట్లు పోగొట్టుకున్న అదానీ..అధిక సంపద కోల్పోయిన వారిలో సెకండ్

2025 మొదలయ్యాక రెండు నెలల్లోనే ప్రపంచ కుబేరులు కుదేలవుతున్నారు. స్టాక్ మార్కెట్లు పడిపోతుండడంతో భారత బిలియనీర్ గౌతమ్ అదానీ ఇప్పటివరకు దాదాపు 1 లక్షా 25 వేల కోట్లను నష్టపోయారు. అత్యంత ఎక్కువ సంపద కోల్పోయిన వారిలో అదానీ రెండవ స్థానంలో ఉన్నారు. 

author-image
By Manogna alamuru
New Update
Adani Group companies

మామూలు ప్రజల సంగతి ఏమో కానీ అంతర్జాతీయంగా బిలియనీర్లు మాత్రం భారీగా నష్టపోతున్నారు. స్టాక్ మార్కెట్లు రోజుర్జుకూ దిగజారుతుండడంతో వారి సంపద మంచులా కరిగిపోతోంది. భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడా ఈ ఏడాదిలో ఇప్పటికే భారీగా పతనం అయ్యాయి. వరుస సెషన్లలో పెద్ద మొత్తంలో నష్టపోతూ ఇన్వెస్టర్లకు తీరని నష్టాల్ని మిగులుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత బిలియనీర్ గౌతమ్ అదానీ కూడా భారీగా నష్టపోయారు. ఈయన సంపదలోని 1 లక్షా 25 వేల కోట్లు ఆవిరి అయిపోయాయి. అది కూడా కువలం 50 రోజుల వ్యవధిలోనే. అదానీ మొత్తం సంపద విలువ 11.9 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1 లక్ష కోట్లు) తగ్గి 66.8 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. 

Also Read: TS: చనిపోయారు,ఎలా విచారించాలి..రాజలింగమూర్తి పిటిషన్ పై హైకోర్టు

రెండవ స్థానంలో అదానీ..

2025 సంవత్సరంలో అత్యంత ఎక్కువ సంపద కోల్పోయిన వారిలో అదానీ రెండవ స్థానంలో ఉన్నారు. బ్లూమ్ బెర్గ్ బిలయనీర్ ఇండెక్స్ ప్రకారం మొదటి స్థానంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఉన్నారు. ఈయన అయితే ఏకంగా 3 లక్షల కోట్లను పోగొట్టుకున్నారు.  దీంతో మస్క్‌ మొత్తం సంపద విలువ 397 బి. డాలర్లకు దిగివచ్చింది. గౌతమ్ అదానీ 23వ స్థానంలో ఉన్నారు.  బ్లూమ్ బర్గ్ బిలయనీయర్స్ ఇండెక్స్ లో ప్రస్తుతం గౌతమ్ అదానీ 23 వస్థానంలో ఉన్నారు. అలాగే భారత మరో కుబేరుడు ముకేశ్ అంబానీ ఈ జాబితా 17వ స్థానంలో నిలిచారు. ఈయన సంపద ప్రస్తుత విలువ 2.9 బిలియన్ డాలర్లు తగ్గి 87.7 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. హెచ్‌సీఎల్‌ టెక్‌కు చెందిన శివ్‌నాడార్‌ సంపద 4.53 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.39,000 కోట్లు) తగ్గి 38.6 బిలియన్‌ డాలర్లు (రూ.3,32,000 కోట్లు)గా నమోదైంది. మొత్తానికి అందరి సంపదా ఎంతో కొంత అయితే పోయింది. 

Also Read: Champions Trophy: అదరగొట్టిన సౌత్ ఆఫ్రికా...తేలిపోయిన ఆఫ్ఘాన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indian Railways: గుడ్‌న్యూస్‌.. ఇకనుంచి రైళ్లలో కూడా ATM సేవలు

ఇకనుంచి రైళ్లలో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు.త్వరలో మిగతా రైళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు.

New Update
India's first train ATM installed on board Panchavati Express

India's first train ATM installed on board Panchavati Express

రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి రైళ్లలో కూడా ఏటీఎం (ATM) సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రైవేట్‌ బ్యాంకుకు చెందిన ఎటీఎంను ఏసీ ఛైర్‌కార్‌ కోచ్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. 

Also Read: HCU భూముల వివాదంలో రేవంత్ సర్కార్‌కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు

త్వరలో పూర్తిస్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేశామని.. సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫిసర్‌ స్వప్నిల్‌ నీలా తెలిపారు. కోచ్‌లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా వినిగించిన స్థలంలోనే ఏటీఎం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రైలు ముందుకు వెళేటప్పుడు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా షట్టర్‌ డోర్‌ అమర్చినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కోచ్‌లో కూడా అవసరమైన మార్పులు మన్మాడ్‌ వర్క్‌షాప్‌లో చేశామని స్పష్టం చేశారు.

Also Read: రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!

 అయితే ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినల్ నుంచి మన్మాడ్‌ జంక్షన్ వరకు ప్రతిరోజూ పంచవటి ఎక్స్‌ప్రెస్‌ వెళ్తుంది. దాదాపు 4.30 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే ఈ రైలు ఆ మార్గంలో కీలకంగా ఉంది. అందుకే ముందుగా ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే మిగతా మార్గాల్లో కూడా రైళ్లలో ఏటీఎం సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

telugu-news | national-news | trains

Advertisment
Advertisment
Advertisment