Shocking News: 'బెంగళూరులో బతకడం కష్టమే'

జీవన ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూర్ లాంటి నగరాల్లో మాత్రం రూ.10 వేలతో కూడా బతకడం కష్టమైపోయింది. బెంగళూరులో ఖర్చులపై ఓ టెకీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
Bengaluru

Bengaluru


జీవన ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయి. పల్లె, పట్టణాల్లో చూసుకుంటే మనిషి బతికేందుకు నెలకు కనీసం రూ.5 వేల రూపాయలు ఖర్చవుతోంది. ఇక హైదరాబాద్, బెంగళూర్ లాంటి నగరాల్లో మాత్రం రూ.10 వేలతో కూడా బతకడం కష్టమైపోయింది. ముఖ్యంగా బెంగళూరు నగరంలో జీవన వ్యయం విపరీతంగా పెరిగిందన్న వార్తలు వస్తున్నాయి. ఇంటి రెంట్ నుంచి, సరకుల వరకు అన్ని ధరలు కూడా పెరిగిపోయాయని బెంగళూరు వాసులు వాపోతున్నారు. 

Also Read: ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు!

అయితే లింక్డ్‌ ఇన్‌లో హరీశ్ అనే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చేసిన పోస్ట్‌ చూస్తే బెంగళూరులో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతోంది. '' రోజురోజుకి బెంగళూరులో ఖర్చులు పెరిగిపోతున్నాయి. మీకు అలాగే అనిపిస్తోంది కదా. పెరిగిన నిత్యావసర ధరలు సామాన్యుడిపై భారం మోపుతున్నాయి. దీనివల్ల మధ్య తరగతి ప్రజలపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. మార్చి 7న నందిని పాల ధర లీటర్‌కి రూ.4 పెరిగింది. దీనివల్ల లీటర్ పాల ధర రూ.47కి చేరింది. 1050 ml ఉండాల్సిన పరిణామం కూడా 1000 mlకి పడిపోయింది. పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరిగాయి. 

ప్రజా రవాణా, కరెంట్ బిల్లు, గార్బేజ్ ట్యాక్స్, కాఫీ పౌడర్ ఇలా ప్రతీదాని ధరలు పెరిగిపోయాయి. ఇప్పటిదాకా మెట్రో గరిష్ఠ ధర రూ.60 ఉంటే ఇప్పుడు రూ.90కి పెరిగింది. వైట్‌ఫీల్డ్, కోరమంగళ లాంటి ప్రాంతాల్లో ఒక కుటుంబం ఉండాలంటే కనీసం రూ.40 వేలు ఖర్చవుతుంది. గతేడాది ఈ ఫ్యామికి సగటు ఖర్చు రూ.25 వేలు ఉండేది. పెరుగుతున్న ధరలు, చాలీచాలని జీతం వల్ల మధ్యతరగతి మనిషి నలిగిపోతున్నాడని'' హరీశ్ రాసుకొచ్చారు.       

Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!

హరీశ్ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్న కామెంట్లు చేస్తున్నారు. ఇంటి మెయింటెనెన్స్‌ కోసమే కేవలం రూ.11 వేలు ఖర్చవుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పని మనిషికి కూడా కనీసం రూ.11 వేలు ఇవ్వాల్సి వస్తోందని మనో నెటిజన్ చెప్పుకొచ్చారు. జీవన వ్యయం విషయంలో ముంబైని బెంగళూరు మించిపోయేలా ఉందని మరో నెటిజెన్ కామెంట్ చేశాడు. 

 rtv-news | bengaluru | national-news

#national-news #bengaluru #rtv-news #telugu-news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది...

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment