Himachal Pradesh: పెళ్లి కోసం ఆరాటంగా వెళ్లిన వరుడు..తీరా అక్కడ ట్విస్ట్‌ మామూలుగా లేదుగా!

ఎంతో ఉత్సాహంతో ఊరేగింపుగా పెళ్లి చేసుకుందామని వధువు ఊరికి వెళ్లిన వరుడికి పెద్ద షాక్ తగిలింది. ఇంతకీ ఏం జరిగింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

New Update
Karthika masam: ఎంత ట్రై చేసినా పెళ్లి కావడం లేదా..అయితే కార్తీక మాసం లో ఇలా చేయండి మరీ!

up

పెళ్లి కల వచ్చేసిందని ఆ పెళ్లి కొడుకు బంధు మిత్ర పరివారంతో కలిసి ముస్తాబై వధువు ఇంటికి చేరుకున్నాడు. కానీ తీరా అక్కడికి వెళ్లాక విషయం తెలుసుకుని వరుడు కుటుంబానికి దిమ్మ తిరిగిపోయింది. అసలు ఏం జరిగింది..ఎక్కడ జరిగింది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

Also Read: 27 ఏళ్ల క్రితం మిస్సింగ్.. కుంభమేళాలో అఘోరిగా కనిపించిన భర్త .. చివరకి ట్విస్ట్ ఏంటంటే!

హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh) లో  ఓ వ్యక్తికి మధ్యవర్తి ద్వారా పెళ్లి సంబంధం కుదిరింది. ఫోన్‌లోనే ఫోటోలు పంపించుకుని.. మాట్లాడుకుని పెళ్లి ఖాయపరిచేసుకున్నారు. తీరా పెళ్లి రోజు ఆ వధువు గ్రామానికి వెళ్లగా.. అక్కడ ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ఈనెల 28వ తేదీన జరిగిన ఈ సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నారి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది.

Also Read: DeepSeek: ప్లే స్టోర్ లో డీప్‌ సీక్‌ దూకుడు..కానీ ఆ ప్రశ్నలకు మాత్రం!

వాట్సాప్‌లో పిక్‌ చూసి..

తన ఇంటి పక్కనే ఉండే రాజీవ్, మను దంపతులు.. తమకు తెలిసిన వారి కుటుంబానికి చెందిన ఓ యువతితో పెళ్లి (Marriage) నిశ్చయం చేశారు. అందుకు ప్రతిఫలంగా వారికి రూ.50 వేలు కూడా ఆ వరుడు ఇచ్చాడు. అయితే పెళ్లి కొడుకు నేరుగా పెళ్లి కుమార్తెను డైరెక్ట్‌ గా చూడకుండా.. వాట్సాప్‌లో పిక్‌ చూసి, ఆ వధువుతో మాట్లాడి పెళ్లి కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఫోన్‌లోనే అన్నీ మాట్లాడేసుకున్న ఆ రెండు కుటుంబాలు ఈనెల 28వ తేదీన పెళ్లి జరిపించాలని అనుకున్నారు.

ఈ క్రమంలోనే ఈనెల 28వ తేదీనవరుడు.. తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి కుమార్తె ఊరు అయిన సింగా గ్రామానికి చేరుకున్నాడు. అయితే.. ఆ గ్రామంలో ఎక్కడా పెళ్లికి ఏర్పాట్లు లేకపోవడం చూసి వారంతా ఖంగు తిన్నారు. ఏ ఇంటి వద్ద కూడా పెళ్లి సందడి కనిపించకపోవడంతో వధువు ఫోటోను సింగ్రా గ్రామంలోని వారికి చూపించి వారి ఇల్లు ఎక్కడో అడిగాడు. అయితే ఆ ఫోటోలో ఉన్న యువతి ఎవరో తమకు తెలియదని.. అలాంటి అమ్మాయే తమ గ్రామంలో లేదని గ్రామస్తులు చెప్పడంతో వరుడు, అతడి కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

అయితే పెళ్లి కుమార్తెను తీసుకొస్తానంటూ మధ్యవర్తిగా వ్యవహించిన మను అనే మహిళ కారులో అక్కడి నుంచి పారిపోయింది. తర్వాత విషయం అర్థం అయిన వరుడు పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా అక్కడికి చేరుకున్నారు. అమ్మాయిని నేరుగా చూపించకుండా.. వరుడి ఇంటి పొరుగున ఉండే రాజీవ్‌, మను దంపతులు తమ వద్ద డబ్బులు తీసుకుని.. మోసం చేశారని వివరించారు. ఈ క్రమంలోనే రాజీవ్‌కు ఫోన్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందని ప్రశ్నించారు.

అయితే వధువు ఏదో పురుగుల మందు తాగిందని.. అందుకే ఆమెను పంజాబ్‌లోని నవాన్‌షహర్ హాస్పిటల్‌కు తీసుకుని వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు.దీంతో వరుడి కుటుంబానికి అనుమానం వచ్చింది. మను కోసం వెతికి ఆమెను పట్టుకుని ఆ గ్రామానికి తీసుకువచ్చి ప్రశ్నించారు. దీంతో మోసపోయామని గ్రహించి.. వరుడు, అతని కుటుంబం తిరిగి తమ గ్రామానికి వచ్చేసింది.

ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని లేదా పెళ్లికి మధ్యవర్తులుగా ఉన్నవారిపై ఉనా సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని వరుడి కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్పారు.

Also Read: Hyderabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

Also Read: TG News: ఇందిర‌మ్మ ఇండ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..AI సహాయంతో పంపిణీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Agniveers

Agniveers

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్‌ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

 telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs

Advertisment
Advertisment
Advertisment