విజయ్ మాల్యా, నీరవ్‌ మోదీలను అప్పగించండి.. బ్రిటన్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి

భారత్‌ నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్‌ మోదీని అప్పగించాలని ప్రధాని మోదీ.. బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ను కోరారు. బ్రెజిల్‌లో జీ20 దేశాల సదస్సుకు వెళ్లిన ఆయన ఈ సందర్భంగా బ్రిటన్‌ ప్రధానికి ఈ అంశంపై విజ్ఞప్తి చేశారు.

New Update
modii

ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బ్రెజిల్‌లో పర్యటిస్తున్నారు. బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో వేదికగా జరుగుతున్న జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. అలాగే ఇతర దేశాధినేతలతో కూడా ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో భేటీ అయ్యారు. భారత్‌లో బ్యాంకులకు టొకరా వేసి బ్రిటన్‌కు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్‌ మోదీని అప్పగించాలని ప్రధాని మోదీ.. కీర్‌ స్టార్మర్‌ను కోరారు.  

Also Read: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!

Vijay Mallya - Nirav Modi 

భారత్‌లో రూ.9 వేల కోట్ల వరకు బ్యాంకు రుణాలను ఎగవేసిన విజయ్‌ మాల్యా 2016లో లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పంజాబ్ నేషనల్‌ బ్యాంకుకు నీరవ్‌ మోదీ దాదాపు రూ.14 వేల కోట్ల రుణం ఎగవేసిన వ్యవహారం 2018లో బయటపడింది. ఆ తర్వాత అతడు కూడా లండన్‌కు పారిపోయారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ, ఈడీ సంస్థలు విచారిస్తూనే ఉన్నాయి.  ఇప్పటికే నీరవ్‌ మోదీ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ ఇద్దరు ఆర్థికనేరగాళ్లను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. 

Also Read: CBSCలో ఓపెన్‌ బుక్‌ పరీక్షల విధానం.. క్లారిటీ ఇచ్చిన బోర్డు

అయితే నీరవ్‌ మోదీ తమ దేశంలోనే ఉన్నట్లు బ్రిటన్‌ సర్కార్‌ 2018 డిసెంబర్‌లో ప్రకటన చేసింది. అయితే తమకు అప్పగించాలని భారత్‌ విజ్ఞప్తి చేయగా.. 2019లో అక్కడి పోలీసులే అరెస్టు చేశారు. అతడిని భారత్‌కు అప్పజెప్పేందుకు బ్రిటన్ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. దీంతో నీరవ్‌ మోదీ అక్కడి న్యాయస్థానంలో పిటిషన్ వేసారు. కానీ కోర్టు దీన్ని కొట్టేసింది. అయితే తాజాగా ఈ ఇద్దరు ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ ప్రధానికి మోదీ విజ్ఞప్తి చేశారు. అలాగే వీళ్లతో పాటు పన్ను ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యవర్తి సంజయ్‌ భండారీని కూడా భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.   

Also Read: త్వరలో భారత్‌కు రష్యా అధ్యక్షుడు

Also Read :  వైసీపీ నుంచి పోటీ చేయను.. కీలక నేత సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

హర్యానాలోని జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటన గురించి తెలిసిందే. తాజాగా దీనిపై వర్సిటీ యాజమాన్యం స్పందించింది. విద్యార్థినులు సరదాగా ప్రాంక్ చేశారని స్పష్టం చేసింది.

New Update
Jindal university responds after girl caught sneaking into boys' hostel in suitcase

Jindal university responds after girl caught sneaking into boys' hostel in suitcase

హర్యానాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటన గురించి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై యూనివర్సిటీ అధికారులు స్పందించారు. అమ్మాయిని బాయ్స్‌ హాస్టల్‌కు తీసుకొచ్చారని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. యూనివర్సిటీ హాస్టల్‌లో కొందరు విద్యార్థినులు సరదాగా ప్రాంక్ చేసినట్లు చెప్పారు. 

Also Read: మూడే మూడు పెగ్గులు.. సైకిల్‌తో రోడ్‌రోలర్‌ను ఈడ్చుకుంటూ- రయ్ రయ్

దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణ చేశారని.. కొందరు విద్యార్థినులు సరదాగా ఈ పని చేసినట్లు తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. తోటి స్నేహితులు ఒక అమ్మాయిని సూట్‌కేసులో కూర్చోబెట్టి క్యాంపస్‌లో గ్రౌండ్‌కి, మేడ మీదకి తీసుకెళ్లారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వాళ్లని గమనించి ఆపారు. సూట్‌కేస్ తెరవగా అందులో నుంచి అమ్మాయి వచ్చింది. ఈ వీడియో బయటకు వెళ్లడంతో దీన్ని తప్పుగా చిత్రీకరించారు. ఇలా చేసిన విద్యార్థులకు వర్సిటీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసిందని'' తెలిపారు.

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ఇదిలాఉండగా.. జిందాల్ వర్సిటీకి చెందిన ఓ విద్యార్థి సూట్‌కేసులో ఓ అమ్మాయిని కూర్చోబెట్టి బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. అక్కడున్న సిబ్బంది ఆ సూట్‌కేస్ తెరవగా అందులో నుంచి అమ్మాయి బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో దీనిపై నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేశారు. దీంతో తాజాగా దీనిపై స్పందించిన వర్సిటీ యాజమాన్యం ఇదంతా ప్రాంక్ అని స్పష్టం చేసింది. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

 telugu-news | rtv-news | haryana | national-news 

 

 

Advertisment
Advertisment
Advertisment