Satellite: ఆ రాష్ట్రానికి సొంత శాటిలైట్‌..! ఇస్రోతో చర్చలు

అస్సాం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా శాటిలైన్‌ను ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపింది. సరిహద్దులపై నిఘా ఉంచడంతో సహా సామాజిక ఆర్థిక ప్రాజెక్టులు అమలు చేసేందుకు, అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.

New Update
Assam to have its own satellite, talks with ISRO on

Assam to have its own satellite, talks with ISRO on

అస్సాం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా శాటిలైన్‌ను ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపింది. సరిహద్దులపై నిఘా ఉంచడంతో సహా సామాజిక ఆర్థిక ప్రాజెక్టులు అమలు చేసేందుకు, అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పింది. దీంతో దేశంలోనే సొంత శాటిలైట్‌ కలిగిన మొదటి దేశంగా అస్సాం నిలిచిపోనుంది.  ''ఇండియన్ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ అథరైజేషన్‌ సెంటర్‌ (INSPACe) సహకారంతో రాష్ట్రం కోసం ప్రత్యేకంగా ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నాం. 

Also Read: పన్నులు తగ్గించాలని అడగొద్దు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

కీలకమైన ప్రాజెక్టులు అమలు చేసేందుకు, అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఈ శాటిలైట్‌ ఎంతగానో దోహదపడుతుందని'' అస్సాం ఆర్థికశాఖ మంత్రి అజంతా నియాగ్‌ తెలిపారు. 2025-2026 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను తాజాగా ఆమె ప్రవేశపెట్టారు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయ అభివృద్ధి, సరిహద్దు నిర్వహణ, పోలీస్‌ ఆపరేషన్లలో శాటిలైట్ కీలక సేవలు అందిస్తుందని వివరించారు.       

Also Read: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్‌ట్విస్ట్.. ప్రముఖ వ్యాపార వేత్త అరెస్ట్

మరోవైపు దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా మాట్లాడారు. '' రాష్ట్రానికి సొంతగా ఉపగ్రహం ఉంటే విదేశీయుల అక్రమ చొరబాట్లను అడ్డుకోవచ్చు. వాతావరణ రిపోర్టుల ద్వారా వరదలు, విపత్తు గురించి ముందుగానే తెలుసుకోవచ్చు. ఇటీవల ఉమ్రాంగ్సోలో బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి శాటిలైట్ సమాచారాన్ని పొందేందుకు దాదాపు నెలన్నర సమయం పట్టింది. సొంతగా ఉపగ్రహం ఉన్నట్లయితే అది మన ప్రాంతంపైనే పూర్తిగా నిఘా ఉంచుతుంది. శాటిలైట్‌ ఏర్పాటుపై ఇప్పటికే ఇస్రోతో చర్చలు మొదలుపెట్టామని'' హిమంత బిశ్వ శర్మ అన్నారు. 

Also Read: కొండచిలువతో స్కిప్పింగ్ ఆడుతున్న చిన్నారులు.. వీడియో చూశారా?

Also Read: H1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లకి బిగ్‌ షాక్.. రావడం కష్టమే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

వెస్ట్ బెంగాల్ సీఎంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, యూపీ సీఎం యోగి ఆథిత్య నాథ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రే రాష్ట్రంలో హింస ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని ఆమె ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు.

New Update
Union Minister Kiren Rijiju

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారడంపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల పేరుతో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జినే హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ఏప్రిల్ 12 నుంచి  బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందారు. మొత్తం 110 మంది నిరసనకారులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి హింసలో ఉగ్ర సంస్థల కుట్ర ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also read: Toll charges: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

మమతా బెనర్జిపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మండిపడ్డారు. వక్ఫ్‌ సవరణ చట్టానికి నిరసనగా రాష్ట్రంలో హింస చెలరేగుతుంటే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకేమి పట్టనట్టుగా ఉన్నారని ఆయన విమర్శించారు. వారం రోజులుగా ముర్షిదాబాద్‌ మంటల్లో రగులుతుంటే సీఎం మాత్రం మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. లౌకికవాదం పేరుతో రాష్ట్రంలో అల్లర్లను లేపేవారికి ఆమె పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని యోగీ అన్నారు. 

Also read: Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 వల్ల లాభాలు ఇవే..

Advertisment
Advertisment
Advertisment