Amit Shah:మహారాష్ట్రలో జోరుగా ఎన్నికల తనిఖీ..అమిత్ షా హెలికాప్టర్ కూడా

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఎంత జోరుగా సాగుతోందో...అక్కడ డబ్బులు కూడా అంతే వేగంగా పంపిణీ అవుతున్నాయి. దీంతో ఈసీ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెలికాప్టర్‌‌ను కూడా ఈరోజు తనిఖీ చేశారు. 

New Update
m

మహారాష్ట్ర ఎన్నికల వేళ ప్రచారంలో పాల్గొంటున్న నేతల బ్యాగులు, హెలీకాప్టర్లతో సహా మొత్తం అన్నీ తనిఖీలు చేస్తోంది ఎన్నికల కమిషన్. పెద్దా, చిన్నా అని కూడా చూడడం లేదు. దీనికి కారణం ఇటీవల మహారాష్ట్రలో పెద్ద ఎత్తున డబ్బులు, ఇతరత్రా దొరకడమే కారణం. ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెలికాఫ్టర్‌‌ను కూడా తనిఖీ చేశారు అధికారులు. ఈ విషయాన్ని స్వయంగా అమిత్ షా నే తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

Also Read :  లెబనాన్‌, గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌.. వీడియోలు చూస్తే హడలిపోవాల్సిందే

Amith Shah - Election Commission

ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడకు వచ్చిన నా హెలికాప్టర్‌ను అధికారులు తనిఖీ చేశారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ నమ్ముతుంది, ఆదరిస్తుంది అని అమి షా పోస్ట్‌లో రావారు. ఈసీకి మనమంతా సహకరించాలని ఆయన అన్నారు. ప్రపంచంలో శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్‌ను కొనసాగించడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలి అని అమిత్‌ షా ఎక్స్‌లో రాసుకొచ్చారు. 

Also Read :  Snakes: ఆ దీవిలో అడుగడుగునా మనిషిని మింగేసే పాములు.. కళ్లు మూశారో ఖతం!

ఇక రీసెంట్‌గా మహారాష్ట్ర ఆజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠక్రే బ్యాగును పదేపదే ఈసీ అధికారులు తనిఖీ చేయడం చర్చనీయంగా మారింది. కావాలనే విక్ష నేతల వస్తువులను తనిఖీఉ చేస్తున్నారంటూ విమర్శించారు. అయితే ఈసీ మాత్రం ఎవరేమన్నా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతోంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌,  కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బ్యాగులను కూడా అధికారులు తనిఖీ చేశారు. మహారాష్ట్రలో నవంబర్‌ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Also Read :   పవన్‌పై బన్నీ సంచలన వ్యాఖ్యలు.. అన్‌స్టాపబుల్‌ షోలో బాలకృష్ణతో అల్లు అర్జున్ రచ్చ రచ్చ!

Also Read :  Crime: టేపుతో కట్టేసి.. క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి.. ఎముకలు విరగొట్టి.. వెలుగులోకి సంచలన నిజాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అనుమతించింది. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బిరిపోర్ట్ విభేదిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

Advertisment
Advertisment
Advertisment