Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ సంచలన నిర్ణయం

టీవీకే అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పాటు మరికొందరు పిటిషన్ వేసిన సంగతి తెలసిందే.

New Update
TVK Chief Vijay

TVK Chief Vijay

క్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ముస్లింలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పాటు మరికొందరు పిటిషన్ వేసిన సంగతి తెలసిందే. తాజాగా విజయ్ కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

 ఇదిలాఉండగా.. వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలలైన పిటిషన్లపై ఏప్రిల్ 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై ఇప్పటిదాకా 10 పిటిషన్లు దాఖలయ్యాయి. మరికొన్ని త్రిసభ్య ధర్మాసనం ముందు జాబితా కావాల్సి ఉంది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన బెంచ్ విచారణ చేయనుంది. 

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ముందుగా ఏప్రిల్ 15న విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం చెప్పగా.. కేంద్రం గత మంగళవారం కేవియట్ దాఖలు చేసింది. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని తెలిపింది. ఈ క్రమంలోనే వక్ఫ్ సవరణ చట్టంపై వచ్చిన పిటిషన్లను ఏప్రిల్ 16న విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇటీవల లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ సవరణ చట్టం 2025 ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమ్మతితో ఈ చట్టం అమల్లోకి కూడా వచ్చింది.  

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ

rtv-news | waqf-amendment-bill | national-news | telugu-news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నిర్లక్ష్య డ్రైవింగ్‌.. వాహన యజమానికి రూ.1.41 కోట్ల జరిమానా

కర్ణాటకలో ఓ బాలుడు నిర్లక్ష్యంగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమయ్యాడు. 2021లో ఈ ఘటన జరిగింది. అయితే తాజాగా దీనిపై విచారించిన ఓ తాలుకా కోర్టు.. వాహన యజమానికి రూ.1.41 కోట్ల జరిమానా విధించింది.

New Update
Karnataka Civil Court

Karnataka Civil Court

కర్ణాటకలో ఓ బాలుడు నిర్లక్ష్యంగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమయ్యాడు. 2021లో ఈ ఘటన జరిగింది. అయితే తాజాగా దీనిపై విచారించిన ఓ తాలుకా కోర్టు.. వాహన యజమానికి రూ.1.41 కోట్ల జరిమానా విధించింది. మరోసారి పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదనే హెచ్చరికలు చేస్తూ ఈ తీర్పునిచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కొప్పళ జిల్లా యలబుర్గలో 2021లో ఓ 17 ఏళ్ల బాలుడు నిర్లక్ష్యంగా ఆటో నడిపాడు. 

Also Read:  ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

దీంతో రోడ్డు పక్కన వెళ్తున్న వాళ్లని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గంగావతిలోని జయనగర ప్రాంతానికి చెందిన రాజశేఖర్ అయ్యనగౌడ(48) అనే ఉద్యోగి.. మరికొందరు వ్యక్తులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీళ్లని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే రాజశేఖర్ పరిస్థితి విషమించడంతో అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.   

Also Read: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

దీంతో ఈ ఘటనపై మృతుడి భార్య చెనమ్మ గంగావతి.. తాలుక న్యాయ సేవా సమితిలో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ కేసును జడ్జి రమేశ్ ఎస్‌.గాణిగెరె విచారించారు. బాలుడు నడిపిన ఆటో యజమానికి ఏకంగా రూ.1,41,61,580 జరిమానా విధించారు. బాలుడని తెలిసినా కూడా ఆటో ఎలా ఇస్తారని.. ఆ ఆటో యజమానిపై మండిపడ్డారు. రాజశేఖర్ కుటుంబంలో ముగ్గురికి సమానంగా ఈ డబ్బును పంచాలని అధికారులకు సూచనలు చేశారు.  

Also Read: టిఆర్‌ఎఫ్ ముసుగులో లష్కర్ ఈ తోయిబా దాడులు.. ఆన్‌లైన్‌లో యువకుల రిక్రూట్‌మెంట్!

Also Read: పహల్గాంలో ఉగ్రదాడి.. తాలిబన్ల సంచలన ప్రకటన!

rtv-news | national-news | karnataka

Advertisment
Advertisment
Advertisment