Black Magic: చేతబడి అనుమానం.. వృద్ధురాలికి మూత్రం తాగించి, చెప్పులతో ఊరేగించిన స్థానికులు

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేస్తుందనే అనుమానంతో ఓ వృద్ధురాలను గ్రామస్థులు దారుణంగా కొట్టి హింసించారు. బలవంతంగా మూత్రం తాగించారు. ఆఖరికీ కుక్క మలాన్ని కూడా తినిపించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Balck Magic

Black Magic

మహారాష్ట్ర (Maharashtra) లోని అమరావతి జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి (Black Magic) చేస్తుందనే అనుమానంతో ఓ వృద్ధురాలను గ్రామస్థులు దారుణంగా కొట్టి హింసించారు. బలవంతంగా మూత్రం తాగించారు. ఆఖరికీ కుక్క మలాన్ని కూడా తినిపించారు. ఆ తర్వాత మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. దీంతో వృద్ధురాలి కొడుకు, కోడలు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Also Read :  Mohammed Siraj: పాపం సిరాజ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో దక్కని చోటు

BLACK MAGIC IN AMARAVATI

ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని రెత్యాఖేడ అనే గ్రామంలో 77 ఏళ్ల వృద్ధురాలు జీవిస్తోంది. అయితే డిసెంబర్ 30న ఆమె కొడుకు, కోడలు బయటకు వెళ్లారు. ఇంట్లో ఆ వృద్ధురాలు ఒంటరిగా ఉంది. దీంతో ఆమె చేతబడి చేస్తున్నట్లు అనుమానించిన స్థానికులు కర్రలతో కొట్టారు. కాళ్లపై వాతలు పెట్టారు. బలవంతంగా మూత్రం తాగించి, కుక్క మలాన్ని తినిపించారు. మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఈ దారుణం గురించి జనవరి 5న వృద్ధురాలి కొడుకు, కోడలుకు తెలిసింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు.   

Also Read :  డెలివరీ తర్వాత ఆడవారి ప్రైవేట్ భాగంలో ఆవిరి పట్టడం కరెక్టేనా?

చివరికి పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. ఆ గ్రామానికి పోలీసులను పంపిస్తున్నట్లు అమరావత జిల్లా ఎస్పీ విశాల్ ఆనంద్ చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఒకవేళ స్థానిక పోలీసులు ఈ కేసును దాచిపెట్టాలని చూసినట్లు తేలితే వాళ్లపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

Also Read: మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారం చేసింది అతడే.. కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు!

Also Read :  కాపురం ఖరీదు రూ. కోటి.. డిమాండ్ చేసిన భార్య

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Agniveers

Agniveers

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్‌ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

 telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs

Advertisment
Advertisment
Advertisment