ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..ఒడిశా గవర్నర్‌‌గా కంభంపాటి హరిబాబు

పలు రాష్ట్రాల గవర్నర్ల బదిలీ, నియామకాలను చేసింది కేద్రం. దీని ప్రకారం ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా నియమించారు.

author-image
By Manogna alamuru
New Update
governor

Kambhampati Haribabu

ఒడిశా, మిజోరంతో సహా మరో మూడు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ, నియామకాలను చేసింది కేంద్రం. మిజోరం నూతన గవర్నర్‌గా ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌; కేరళ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌, ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా ఉన్న ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ను బిహార్‌ గవర్నర్‌గా నియమించారు. అలాగే, మణిపుర్‌ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్‌ కుమార్ భల్లాను నియమించారు. అలాగే ప్రస్తుతం మిజోరం గవర్నర్‌‌గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌‌గా బదిలీ చేశారు. వీటికి సంబంధించిని ఉత్తర్వులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేశారు. 

Also Read: CBI: ఇంటర్ పోల్ తరహాలో భారత్ పోల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

VIRAL VIDEO: బెంగళూరులో సినిమా రేంజ్ లో రోడ్డు ప్రమాదం.. చూస్తే షాక్ అవుతారు!

బెంగళూరులో పట్టపగలే సినిమా రేంజ్‌ రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంలో ఉన్న వాటర్ ట్యాంకర్‌ మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో అదుపు తప్పింది. దీంతో నడి రోడ్డు పై మూడు పల్టీలు కొట్టింది.

New Update
bengalore

bengalore

బెంగళూరు నగరంలో పట్టపగలే సినిమా రేంజ్‌ రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. అతి వేగంలో ఉన్న వాటర్ ట్యాంకర్‌ మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో అదుపు తప్పింది. దీంతో నడి రోడ్డు పై మూడు పల్టీలు కొట్టింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Also Read: Ram Mandir: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

వివరాల ప్రకారం..వాటర్‌ ట్యాంకర్‌ వర్తూర్‌ వైపు నుంచి దొమ్మసాంద్రకు నీటిని తీసుకుని వెళ్తోంది.ఈ క్రమంలో సదరు వాటర్ ట్యాంకర్‌ డ్రైవర్‌ ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్‌ టేక్‌ చేశాడు. ఒక్కసారిగా వేగం పెరగడంతో ట్యాంకర్‌ వాహనం అదుపు తప్పింది.

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

దీంతో వాహనం ప్రమాదానికి గురైంది. సినిమా రేంజ్‌ లో పల్టీలు కొడుతూ..రోడ్డు పై పడిపోయింది.  ట్యాంకర్‌ లో ఉన్న నీళ్లు ఎగిరిపడ్డాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ఇక ఈ ప్రమాదం కారణంగా ట్యాంకర్‌ డ్రైవర్‌, వాహనంలో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రోడ్డు పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

Also Read: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 18 వేల ఉద్యోగాలు.. ఈ నెలలోనే నోటిఫికేషన్!

Also Read: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి అలర్ట్.. ఆ 6 ప్లాట్ ప్లాట్‌ఫామ్‌లు మూసివేత!

bengalore | latest-news | latest-telugu-news | latest telugu news updates | Water Tanker Crash | national-news | national news in Telugu | telugu-news-national-news 

Advertisment
Advertisment
Advertisment