/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
Earthquake
ఈమధ్య వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఆదివారం ఒకే గంటల వ్యవధిలో భారత్, మయన్మార్, తజికిస్తాన్లో నాలుగు భూకంపాలు వచ్చాయి. దీంతో జనం భయాందోళనలో ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. మొదటి భూకంపం తజికిస్తాన్లోని ఫైజాబాద్కు సమీపంలో రాగా.. ఆ తర్వాత మయన్మార్లో మీక్టిలాలో వచ్చింది. అనంతరం భారత్లోని జమ్ముకశ్మీర్లోని కిష్ట్వార్లో, ఉత్తరాఖండ్లోని ఉత్తరకశీలో భూకంపాలు వచ్చాయి.
Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?
అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు. తజికిస్తాన్లో భూకంప తీవ్రత 6.0 గా నమోదయ్యింది. భారత్లో ఫైజాబాద్లో ఉదయం 9 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. కేవలం ఒక గంట వ్యవధిలోనే నాలుగు భూకంపాలు వచ్చాయి. మయన్మార్లో 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. మార్చి 28న అక్కడ 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ బలమైన భూకంపం సంభవించడం కలకలం రేపింది. జనం ఇళ్ల నుంచి భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు.
Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!
జమ్ముకశ్మీర్లో హిమాలయన్ ప్రాంతంలో 4.2 తీవ్రతో భూకంపం రావడంతో అక్కడి స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ భూకంపాలు భారత్ ప్లేట్ యూరేషియన్ ప్లేట్తో ఢీకోనడం వల్ల సంభవించే టెక్టోనిక్ కదలికల వల్ల సంభవిస్తున్నాయి. ఇదిలాఉడంగా మార్చి 28న మయన్మార్ వచ్చిన భూకంప ధాటికి 3600 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
telugu-news | rtv-news | earthquake | national-news