/rtv/media/media_files/2026/02/16/karnataka-2026-02-16-18-25-11.jpg)
3 Sentenced To Death For Gang Rape Of Israeli Tourist, Murder Near Hampi in Karnataka
గతేడాది కర్ణాటకలోని ఇజ్రాయెల్కు చెందిన టూరిస్టుతో పాటు మరో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఓ పర్యాటకుడు ప్రాణాలు కూడా కోల్పోయాడు. ఈ దారుణానికి కారణమైన ముగ్గురు నిందితులకు మరణశిక్ష పడింది. సోమవారం కొప్పళ జిల్లా కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2025 మార్చిలో కొప్పళ జిల్లాలో తుంగభద్ర ఎడమ కాలువ దగ్గర ఈ దారుణం జరిగింది. ఇజ్రాయెల్కు చెందిన ఓ టూరిస్టు యువతి (27), అమెరికాకు చెందిన డేనియల్(23), నాసిక్కు చెందిన పంకజ్(43), ఒడిశాకు చెందిన డిబాస్(46) కలిసి అక్కడ ఓ హోంస్టేలో బస చేశారు.
Also Read: కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. స్పాట్ లో 8 మంది కార్మికులు
ఆ సమయంలో రాత్రిపూట హోంస్టే నిర్వాహకురాలితో పాటు ఈ టూరిస్టులందరూ కలిసి రంగాపుర గంగమ్మ గుడివద్ద సంగీత కార్యక్రమం నిర్వహించారు. వీళ్ల దగ్గరకు మద్యంమత్తులో మల్లేశ్, సాయి,శరణప్ప అనే ముగ్గురు వ్యక్తులు వచ్చారు. తమకు డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వాళ్లు నిరాకరించడంతో ఇద్దరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో డేనియల్, పంకజ్, డిబాస్ ఆ ముగ్గురిని అడ్డుకోగా వీళ్లను ఆ ముగ్గురు నిందితులు తుంగభద్ర ఎడమ కాల్వలోకి తోసేశారు. ఆ తర్వాత అక్కడున్న ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం చేశారు.
Also Read: ఢిల్లీ పేలుళ్ల కేసులో కొత్త కోణం‘అన్సార్ ఇంటీరియం’ పేరుతో టెర్రరిస్టు గ్రూపు
కాల్వలో పడ్డ డేనియల్, పంకజ్ కొంతసేపటి తర్వాత ఈదుకుంటూ బయటికి వచ్చారు. డిబాస్ మాత్రం నీటిలోనే మునిగి ప్రాణాలు కోల్పోయాడు. గతేడాది ఈ ఘటన సంచలనం రేపింది. హత్యా, అత్యాచారాలకు కారణమైన ఈ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాజాగా జిల్లా కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
Follow Us