Nitin Gadkari: రూ.10లక్షల కోట్లతో.. 25వేల కి.మీ రోడ్లు : నితిన్ గడ్కరీ

దేశంలో 25 వేల కిలోమీటర్ల రహదారులను రెండు లేన్ల నుంచి నాలుగు లేన్లుగా మారుస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రూ.10 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడతామని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయన్నారు.

New Update
Union Minister Nitin Gadkari

Union Minister Nitin Gadkari

కేంద్ర రవాణాశాఖ మంత్రి నితన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో 25 వేల కిలోమీటర్ల రహదారులను రెండు లేన్ల నుంచి నాలుగు లేన్లుగా మారుస్తామని వెల్లడించారు. మొత్తం రూ.10 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడతామని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని లోక్‌సభలో ఆయన తెలిపారు. అలాగే రూ.6 లక్షల కోట్లతో 16 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను ఆరు లేన్లుగా మార్చుతామని స్పష్టం చేశారు. 

Also Read:  పోలీసులు కాదు రాక్షసులు.. పసివాడిపై థర్డ్ డిగ్రీ.. ప్రాణం పోయేలా కొట్టి!

'' దేశంలో 25 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను రెండు లేన్ల నుంచి నాలుగు లేన్లుగా మార్చనున్నాం. రూ.10 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నాం. దీనికి సంబంధించి డీపీఆర్‌లు కూడా సిద్ధమవుతున్నాయి. రెండేళ్లలో ఈ రోడ్ల పనులు పూర్తవుతాయని భావిస్తున్నాం. ఈ పనులు పూర్తయిన తర్వాత దేశంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని'' నితిన్ గడ్కరీ అన్నారు.  

Also Read: వినియోగదారులకు షాక్.. పెరిగిన పాల ధరలు.. ఎంతంటే ?

అంతేకాదు దేశంలో ప్రతీ సంవత్సరం 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదాల్లో 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవారు 1.88 లక్షల మంది చనిపోతున్నారని పేర్కొన్నారు. అలాగే ఈ రోడ్డు ప్రమాదాల వల్ల దేశ జీడీపీకి ప్రతీ సంవత్సరం 3 శాతం నష్టం వాటిల్లుతోందని తెలిపారు. 2030 నాటికి రోడ్డు ప్రమాదాల సంఖ్యను సగానికి తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గడ్కరీ అన్నారు. 

Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్‌ కామెడీ అంటూ!

Also Read: ఈసారి చార్‌ధామ్ యాత్రలో వీరికి నో ఎంట్రీ.. అలా చేస్తే వెనక్కి పంపిస్తామంటున్న అధికారులు

nitin-gadkari | roads | national-highways | national-news

Advertisment
Advertisment
Advertisment