Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. రాజ్‌బాగ్ సమీపంలోని ఘాటి జుథానాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ కాల్పుల్లో మరో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా ఎన్‌కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.

New Update
2 militants killed, 5 policemen injured in gunbattle

2 militants killed, 5 policemen injured in gunbattle

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. రాజ్‌బాగ్ సమీపంలోని ఘాటి జుథానాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ కాల్పుల్లో మరో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా ఎన్‌కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఆదివారం హిరానగర్‌ సెక్టార్‌లో యాంటి టెర్రరెస్టు ఆపరేషన్‌లో తప్పించుకున్న తీవ్రవాదులనే గురువారం భద్రత బలగాలు మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. అయితే గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఎరివేత ఆపరేషన్ కొనసాగుతోంది. 

Also Read:  పోలీసులు కాదు రాక్షసులు.. పసివాడిపై థర్డ్ డిగ్రీ.. ప్రాణం పోయేలా కొట్టి!

ఇదిలాఉండగా గత నెలలో జమ్మూకశ్మీర్‌లోని అఖ్‌నూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఐఈడీ బాంబు పేలడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబు దాడిని భారత సైనిక దళానికి చెందిన వైట్‌ నైట్‌ కార్ప్స్ నిర్ధరించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది. 

Also Read: వినియోగదారులకు షాక్.. పెరిగిన పాల ధరలు.. ఎంతంటే ?

ఈ ఘటన తర్వాత మళ్లీ జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు మరోసారి కాల్పులు జరిపారు. రాజౌరిలోని సుందర్‌బాని ప్రాంతంలో సైనికులు వాహనంపై వెళ్తుండగా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. మొత్తం నాలుగు రౌండ్లు వాహనంపై విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. దీంతో సైనికులు వెంటనే అలర్ట్ అయ్యి ఎదురు కాల్పులకు దిగారు. 

Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్‌ కామెడీ అంటూ!

Also Read: ఈసారి చార్‌ధామ్ యాత్రలో వీరికి నో ఎంట్రీ.. అలా చేస్తే వెనక్కి పంపిస్తామంటున్న అధికారులు

 rtv-news | terrorist | jammu-and-kashmir

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి

15ఏళ్ల కుర్రాడు కారు డ్రైవింగ్ కారణంగా ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి చనిపోయింది. ఈ ఘటన రంజాన్ రోజే ఢిల్లీలోని పహర్‌గంజ్‌లో చోటుచేసుకుంది. కారు నడిపిన బాలుడి పేరు పంకజ్‌ అగర్వాల్‌, అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
minor boy driving car

రంజాన్ సంబరాలు జరుపుకుంటున్న టైంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. వైనర్ బాలుడు కారు నడపడంతో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపైకి కారు దూసుకెళ్లింది. దేశ రాజధాని ఢిల్లీలోని పహర్‌గంజ్‌లో ఈ దుర్ఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పిల్లలతో ఇళ్లంతా సందడిగా ఉంది. కానీ కొన్ని గంటల్లోనే ఆ ఆనందం ఆవిరైంది. మైనర్‌ కారు డ్రైవింగ్‌ ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది.

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పహర్‌గంజ్‌ ఏరియాకు చెందిన ముస్లిం కుటుంబం రంజాన్‌ సంబురాల్లో ఉంది. వారి రెండేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటోంది. వారి పొరుగింటి వ్యక్తి పంకజ్‌ అగర్వాల్‌ 15 ఏళ్ల కుమారుడు తండ్రి కారును తీసుకుని బయటికి వెళ్లాడు. పంకజ్ నడుపుతున్న కారు కంట్రోల్ కాక ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Also read: BREAKING: ఒకేరోజు ఇండియా, పాకిస్థాన్‌లో భూకంపాలు

దాంతో అప్పటిదాకా సంబురంగా ఉన్న కుటుంబంలో ఏడుపులు మొదలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా కారు నడిపినందుకు బాలుడి తండ్రి పంకజ్‌ అగర్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన మైనర్‌లకు వాహనం ఇవ్వకుండా కఠిన చట్టం చేయాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది.

Also read: PM Modi: ‘మరో 5 నెలల్లో ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. తర్వాత ఎవరో RSS నిర్ణయం’

Advertisment
Advertisment
Advertisment