/rtv/media/media_files/2025/04/15/71loup9y3DmU1BPKT0XS.jpg)
fishing
ఏపీలో గత అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి జూన్ 15 వరకు అంటే సుమారు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. మత్స్య సంపదను కాపాడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు నెలల పాటూ చేపల వేటపై నిషేధం విధిస్తారు. ఈ రెండు నెలల సమయంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి వాటి సంతాన్నాన్ని అభివృద్ది చేస్తాయి. అందుకే రెండు నెలల పాటు వేటను ఆపేస్తారు.. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లరాదు. అయితే స్థానికంగా కర్ర తెప్పలకు మాత్రం అనుమతి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటారు.
Also Read:ap: హమ్మయ్యా ఆంధ్ర రొయ్య అమెరికాకు.. కాకపోతే..!
ఈ రెండు నెలల పాటూ అధికారులు మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించకుండా చూస్తారు. మత్స్యకారులు నిబంధనలు తప్పితే వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు ప్రభుత్వ పథకాలకు కూడా దూరం అవుతారు. కాబట్టి మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలో మత్స్యకారులు వేట నిషేధం సమయంలో ఉపాధి కోల్పోతున్నందుకు ప్రభుత్వం వారికి అండగా నిలిచింది.
Also Read:Bangladesh: నిప్పుతో గేమ్స్ వద్దు.. యూనస్కు హసీనా వార్నింగ్
గతంలో చేపల వేట నిషేధం 40 రోజులు ఉంటే.. దానిని 60 రోజులకు పెంచారు. గతంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు బియ్యం ఉచితంగా అందించేవారు. ఆ తర్వాత ఆ స్థానంలో మత్స్యకార భరోసా వచ్చింది. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ఆ తర్వాత బియ్యానికి బదులు రూ.2 వేల చొప్పున సాయం అందించింది.. దానిని రూ.4 వేలుకు పెంచారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం మత్స్యకార భరోసాను రూ.10 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం.. తాము అధికారంలోకి వస్తే చేపల వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకారునికి రూ.20 వేల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపింది.
అందుకు తగిన విధంగా ఈ ఏడాది బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు.. ఈ నెల కానీ, మే నెలల ో కానీ మత్స్యకారులకు భరోసా అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉంది.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సర్వే నిర్వహించి లబ్ధిదారుల్ని గుర్తిస్తామని చెబుతున్నారు అధికారులు.
Also Read: America-South Korea: అమెరికా పొమ్మంటుంది... దక్షిణ కొరియా రమ్మంటోంది!
Also Read: America Earth Quake: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం
fishing-boat | fishing | 2 months | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates
Mopidevi Venkata ramana: తండ్రికి అన్యాయం జరుగుతుంటే విప్పని నోరు..ఇప్పుడేందుకు!
రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి మాట్లాడుతున్నారా లేక తన బావ చంద్రబాబు ఉనికిని కాపాడాటానికి ఆమె మాట్లాడుతున్నారా అంటూ బాపట్ల ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు ప్రశ్నించారు.
గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వం (AP Government) పై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె చేస్తున్న విమర్శలు గురించి బాపట్ల ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు స్పందించారు. ఏపీలో జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాల వారు తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ , చంద్రబాబు కలిసి కొన్ని సంవత్సరాల క్రితమే జగన్ మీద తప్పుడు కేసులు పెట్టారు. నిజనిజాలు ఏంటి అనేది న్యాయ స్థానాల్లోనే తేలుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి మాట్లాడుతున్నారా లేక తన బావ చంద్రబాబు ఉనికిని కాపాడాటానికి ఆమె మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నించారు.
ఆమె ఏమి మాట్లాడిన నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి. గతంలో ఆమె తండ్రి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైన వాళ్లలో ప్రధాన వ్యక్తి చంద్రబాబు. ఈ విషయం పురందేశ్వరికి తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వారిలో ప్రధానమైన వ్యక్తి చంద్రబాబు .
ఆ విషయం గురించి ఆమె ఏనాడు కూడా మాట్లాడింది లేదు. ఎన్టీఆర్ ని దెబ్బ తీసే సమయంలో చంద్రబాబుకి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. తండ్రికి అన్యాయం జరుగుతుంటే ఆనాడు పురందేశ్వరి కనీసం నోరు మెదపలేదు. ఇన్ని సంవత్సరాలకు చంద్రబాబు అన్యాయాల పుట్ట బద్దలై సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయాడు. అరెస్ట్ అయ్యాడు.
వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన అన్నారు. నిజాలను దాయడం. వాస్తవాలను వక్రీకరించడం..నమ్ముకున్న వారిని నట్టేట ముంచటం చంద్రబాబుకు అలవాటే అని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పడం దానికి సంకేతం. ఎప్పటి నుంచో తెలంగాణలో పార్టీని నమ్ముకున్న వారి భవిష్యత్ ఏం కావాలి అని ఆయన అన్నారు.
స్వయనా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఙానేశ్వర్ చంద్రబాబు తమను మోసం చేశారని చెప్పాడు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలనేది చంద్రబాబు ఆలోచన అంటూ ఆయన ఆరోపించారు.
Also read: దీపావళి గిఫ్ట్స్ గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు..ఉద్యోగులకు సర్ప్రైజ్ ఇచ్చిన యజమాని!
Ap News: ఏపీలో 2 నెలల పాటూ చేపల వేటపై నిషేధం..
ఆంధ్రప్రదేశ్లో చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఇది 61 రోజుల పాటు కొనసాగుతుంది. మత్స్య సంపదను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లకూడదు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
పవన్ కల్యాణ్ ఇంటికి అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లినట్లు తెలుస్తోంది. short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్
ap: హమ్మయ్యా ఆంధ్ర రొయ్య అమెరికాకు.. కాకపోతే..!
ట్రంప్ సుంకాలను వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు ఊపిరి వచ్చింది. నిలిచిపోయిన రొయ్యల కంటైనర్లు అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. రైతులు ధరలు పెంచాలని కోరుతున్నారు.Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్
🔴Live News Updates: నేడే కేబినెట్ భేటీ
Stay updated with the latest live news Updates క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Aghori: మహిళా నిర్మాతకు యో*ని పూజ.. రూ.10 లక్షలు దొబ్బేసిన అఘోరీ!
లేడీ అఘోరీ మరోమోసం బయటపడింది. యోని పూజ పేరుతో రూ.10లక్షలు దోచేసినట్లు. నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Aghori: ఘనంగా జరిగిన అఘోరీ-వర్షిణిల పెళ్లి.. వేదమంత్రాల సాక్షిగా తాళికట్టిన శీనుగాడు!
లేడీ అఘోరీగా తిరుగుతున్న శ్రీనివాస్, వర్షిణిలు ఎట్టకేలకు అనుకున్నంత పనిచేశారు. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Mouni Roy: వాళ్లను అస్సలు పట్టించుకోను.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిపడేసిన మౌనీ రాయ్
Visakhapatnam Delivery Women Incident | 24గంటల్లో డెలివరీ.. భర్త చేతిలో హ*త్య | RTV
Trump-Iran: ఇరాన్ కు మరోసారి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే వారికి అలర్ట్.. ఆ 6 ప్లాట్ ప్లాట్ఫామ్లు మూసివేత!
TGSRTC: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీ