Melinda French Gates: ఈ ఎన్నికల్లో నా ఓటు ఆయనకే: మిలిందా గెేట్స్

ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి తన ఓటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కే అని బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిందా గెేట్స్ స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వంలో మహిళల ఆరోగ్యం, స్వేచ్ఛ, భద్రత ప్రమాదంలో పడిందని విమర్శించారు.

New Update
Melinda French Gates: ఈ ఎన్నికల్లో నా ఓటు ఆయనకే: మిలిందా గెేట్స్

Melinda French Gates: ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో లాగే ఈసారి కూడా డెమోక్రాటిక్ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) మధ్యే గట్టి పోటీ ఉంది. అయితే తాజాగా బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్‌ స్పందించారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో తాను ఎవరికి ఓటు వేస్తాననే విషయాన్ని ఎక్స్‌ వేదికగా చెప్పేశారు. ఈసారి తన ఓటు జో బైడెన్‌కే అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది.

Also Read: దేశవ్యాప్తంగా 157 యూనివర్సిటీల్లో లోపాలు.. యూజీసీ సంచలన ప్రకటన

ఇంతకుముందు ఇలా అధ్యక్ష అభ్యర్థికి ఎప్పుడూ మద్దతు ప్రకటించలేదని.. ఈసారి జరగపోయే ఎన్నికలు మహిళలు, కుటుంబాలకు చాలా కీలకమైనవని అన్నారు. మహిళల భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక శక్తి, వ్యక్తిగత హక్కులను కాపాడే నాయకుడు కావాలని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలు పూర్తిగా భాగమయ్యే స్వేచ్ఛను కల్పించాలన్నారు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో డొనాల్డ్ ట్రంప్.. మహిళల ఆరోగ్యం, స్వేచ్ఛ, భద్రతను ప్రమాదంలో పడేసిందని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈసారి తన ఓటు జో బైడెన్‌కే అని చెప్పారు.

Also Read: ప్రపంచవ్యాప్తంగా యోగా డే వేడుకలు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో ..ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పై 34 శాతం అదనపు సుంకం విధించాలని చైనా నిర్ణయించింది.దీని పై భగ్గుమన్న అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ ...ఏప్రిల్‌ 8 లోగా డ్రాగన్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.

New Update
Trump

Trump

అమెరికా ,చైనా ల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో ..ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పై 34 శాతం అదనపు సుంకం విధించాలని చైనా ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే.దీని పై భగ్గుమన్న అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ ...ఏప్రిల్‌ 8 లోగా డ్రాగన్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు.

Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

లేదంటే ఏప్రిల్‌ 9 నుంచి 50 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఆ దేశంతో చర్చలు కూడా నిలిపివేస్తామని తేల్చి  చెప్పారు.అమెరికా పై చైనా 34 శాతం అదనపు సుంకాలను ప్రకటించింది.ఆ దేశం ఇప్పటికే పెద్ద ఎత్తున టారిఫ్‌ లు విధిస్తోంది.కంపెనీలకు అక్రమ రాయితీలు,దీర్ఘకాలికంగా కరెన్సీ అవకతవకలకు పాల్పడుతోంది.

Also Read: Maoists surrender : పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

నేను హెచ్చరించినప్పటికీ..అదనపు సుంకాల ద్వారా అమెరికా పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఏ దేశమైనా యత్నిస్తే వెంటనే మరిన్ని టారిఫ్‌ లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ముందు ప్రకటించిన దానికంటే పెద్ద ఎత్తున్న విధిస్తాం. అందువల్ల ..ఏప్రిల్‌ 8 నాటికి చైనా తన 34 శాతం అదనపు సుంకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.

లేకపోతే..ఏప్రిల 9 నుంచే ఆ దేశం పై 50 శాతం అదనపు టారిఫ్‌ లు విధిస్తాం.  ఆ దేశంతో అన్ని చర్చలూ రద్దు చేస్తాం అని సామాజిక మాధ్యమాల వేదికగా ట్రంప్‌ హెచ్చరించారు.అంతకు ముందు ట్రంప్‌ చైనాపై 34 శాతం ప్రతీకార సుంకాలను ప్రకటించారు. దీనికి డ్రాగన్‌ సైతం దీటుగా స్పందించింది.

రెండువిధాలా వాడుకునేందుకు అవకాశం ఉన్న వస్తువులను అమెరికాకు చెందిన 16 సంస్థలకు ఎగుమతి చేయడం పై నిషేధం విధించాలని నిర్ణయించింది. అమెరికాలోని రక్షణ, కంప్యూటర్‌,స్మార్ట్‌ ఫోన్ల పరిశ్రమలను దెబ్బతీసే రీతిలో కొన్ని రకాల అరుదైన ఖనిజాల ఎగుమతుల పై నియంత్రణలు ప్రకటించింది. దీంతో పాటు ప్రతీకార సుంకాల పై ప్రపంచ వాణిజ్య సంస్థలో వ్యాజ్యం దాఖలు చేసింది.

ఈ  విషయంలో ఇప్పటికే బీజింగ్‌ తీరుఉ,తప్పుపట్టిన ట్రంప్‌..తాజాగా ప్రతీకార సుంకాలను మరింత పెంచతానంటూ స్పష్టం చేశారు.

Also Read: Delhi: ఢిల్లీలో భానుడి భగభగ.. సీజన్‌లో ఆల్ టైం రికార్డు స్థాయి టెంపరేచర్

Also Read: TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!

china | america | tarriffs | beijing | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment