వేసవిలో కూరగాయలు తింటున్నారా.. మీరు డేంజర్‌లో ఉన్నట్లే

వేసవిలో కూరగాయలను ఇంటికి తీసుకొచ్చాక వెనిగర్, ఉప్పు నీటితో క్లీన్ చేశాకే వండాలని నిపుణులు చెబుతున్నారు. మిగతా సీజన్‌లతో పోలిస్తే వేసవిలో ఎక్కువగా రసాయనాలతో పండిస్తారు. వీటిని తీసుకోవడం వల్ల మధుమేమహం, గుండె పోటు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.

New Update
Green vegetables

vegetables

వేసవిలో చాలా మంది ఎక్కువగా ఆకుకూరలు తింటారు. ఆకుకూరలు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. వేసవిలో చాలా మంది నాన్‌వెజ్ కంటే వెజ్‌కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే మాంసం వల్ల బాడీ హీట్ అవుతుంది. అదే ఆకుకూరలు అయితే ఆ సమస్య ఉండదని తింటారు. కానీ ప్రస్తుతం రోజుల్లో ఎక్కువగా కూరగాయలను రసాయనాలతో పండిస్తున్నారు. మిగతా సీజన్‌లతో పోలిస్తే వేసవిలో వాటర్ తక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది రసాయనాలతో వీటిని పండిస్తారు.

ఇది కూడా చూడండి: Betting Apps Anvesh: యూట్యూబర్‌ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!

క్రిమి సంహారక మందులు వాడటం వల్ల..

ఇలాంటి కూరగాయలను వేసవిలో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో కూరగాయలు బాగా ఏపుగా పండటానికి వీటిని వాడుతారు. వీటిపై ఎక్కువగా క్రిమి సంహారక మందులు కూడా వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి కూరగాయలను తింటే మధుమేహం, గుండెపోటు, ఊబకాయం, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో కూరగాయలను తింటే మాత్రం ఇంటికి తీసుకొచ్చి బాగా శుభ్రం చేయాలి. 

ఇది కూడా చూడండి: వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి..జట్టును గెలిపించి!

మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలను వెనిగర్ నీటిలో వేసి ఒక 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వత వాటిని ఆరబెట్టి  ఉప్పు నీటితో మళ్లీ కడగాలి. ఇలా రెండు సార్లు కూరగాయలను కడిగిన తర్వాత మాత్రమే వండాలి. లేకపోతే దీర్ఘకాలిక సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో ఎక్కువగా ఇమిడాక్లోప్రిడ్, థయామెథోక్సామ్ వంటి క్రిమిసంహారక మందులు వాడుతారు. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: Nicholas Pooran : భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sri Rama Navami 2025: నవమి రోజే సీతారాముల కల్యాణం ఎందుకు చేస్తారో... తెలుసా!

చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో శ్రీ మహా విష్ణువు జన్మించినట్లు భక్తుల నమ్మకం.ఆ పర్వదినాన్నే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. మరీ ఈ రోజే ఎందుకు సీతారాముల కల్యాణం చేస్తారు అనే విశేషాలు ఈ కథనంలో...

New Update
Srirama navami

Srirama navami Photograph: (Srirama navami)

చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తూ ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ద నవమి,గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్‌ ముహుర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో  త్రేతాయుగంలో జన్మించాడు.

Also Read: Ukraine: పేరుకే అగ్రరాజ్యం..చేసేవన్నీ బలహీనమైన పనులే..అమెరికాపై జెలెన్ స్కీ విమర్శలు

పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసం,రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు.ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజలు నమ్ముతారు.మరీ ఈ రోజే ఎందుకు సీతారాముల కల్యాణం చేస్తారు అనే విశేషాలు ఈ కథనంలో...

Also Read: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

Sri Rama Navami Story

ఆగమ శాస్త్రం ప్రకారం...శ్రీ సీతారామల కల్యాణం ఉత్తర ఫల్గుణి  నక్షత్రం యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది. కానీ ఆగమశాస్త్రం మాత్రం గొప్ప వ్యక్తులు, అవతార పురుషులు జన్మించిన తిథి నాడే ఆ నక్షత్రంలోనే వివాహం జరిపించాలని శాస్త్రాల నియమం. అందుకే శ్రీరాముడు పుట్టిన చైత్ర శుద్దనవమి, పునర్వసు నక్షత్రం వేళ దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం జరుపుకుంటారు. ఈ లోకోత్తర కల్యాణం జరిగినప్పుడే లోక కల్యాణ యఙానికి హేతువుగా నిలబడిందని శాస్త్రాలలో వివరించడం జరిగింది.

శ్రీరాముడు, సీతాదేవి ఇద్దరూ కూడా సాధారణ వ్యక్తులు కాదు.వీరిద్దరూ యజ్ఙ ఫలితంగా ఆధారంగా ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి.దశరథ మహారాజు తన వంశం కోసం చేసిన యాగం ఫలితంగా శ్రీరాముడు జన్మిస్తాడు. అదే సమయంలో యజ్ఙం నిర్వహించేందుకు యాగశాల కోసం భూమిని తవ్వుతున్న జనకుడికి నాగేటి చాలు ద్వారా లభించిన యజ్ఙప్రసాదం సతీమ్మ వారు.

చైత్రమాసం శుద్ద నవమి రోజున లోక కల్యాణం అని సంకల్పంలో పండితులు చదువుతుంటారు. అందుకే కొత్తగా పెళ్లయిన దంపతులను సీతారామచంద్రులుగా భావిస్తారు.తలంబ్రాల కార్యక్రమంలో కూడా శ్రీసీతారాముల కల్యాణం  పాటను భజంత్రీలు పాడుతుంటారు.పూజలు కూడా చేస్తారు.

ఇదిలా ఉంటే...మరో కథనం ప్రకారం..భక్తరామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వం సీతారాముల కల్యాణం మార్గశిర శుద్ధ పంచమి నాడు జరిగినట్లుగా , అయితే తాను చెరసాల నుంచి  తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ చంద్రుని పుట్టిన రోజు వేడుకలు,కల్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. సీతారామ కల్యాణం, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది కూడా శ్రీరామనవమి నాడే. ఆ మరునాడు దశమి నాడు శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది.

కోదండ రామ కల్యాణ్యాన్నిచూసేందుకు సకల దేవతలు దివి నుంచి భువికి దిగి వస్తారంటూ ..శ్రీరామచంద్రుని దివ్యదర్శనం మహనీయంగా నేత్రపర్వంగా పట్టాభిషేకం సమయాన తిలకించి పులకితులవుతారని నమ్మకం.

Also Read: Musk: యూఎస్‌-యూరప్‌ ల మధ్య సుంకాలుండవు..మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

Also Read: Trump Tarrifs: అసలైన ప్రమాదం ముందుంది: జేపీ మోర్గాన్‌!

latest telugu news updates | latest-telugu-news | telugu-news | Sri Rama Navami 2025 | today-news-in-telugu | daily-life-style | human-life-style

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు