/rtv/media/media_files/2025/02/27/zF5eh9axnmuSO7oUPtPv.jpg)
వారణాసి(Varanasi).. అధ్యాత్మికతతో నిండిన ఇక్కడ ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారి అయిన వారణాసిని దర్శనం చేసుకోవాలని చెబుతుంటారు. కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని చెబుతుంటారు పెద్దలు. అయితే ఇక్కడే మరణాన్ని ముందే చెప్పే బావి ఓ గురించి తెలుసుకుందాం.
కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోని సిద్ధేశ్వరి మందిర్ ప్రాంగణంలో చంద్రుడు నిర్మించిన చంద్రకూప్ (Chandrakoop) అనే ఈ బావి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ బావి నీటి కోసమే కాకుండా రాబోయే మరణాన్ని కూడా వెల్లడిస్తుందని భక్తులు నమ్ముతారు. పురాణాల ప్రకారం ఎవరైనా ఈ బావిలోకి చూస్తే వారి ప్రతిబింబం కనిపించకపోతే రాబోయే రాబోయే ఆరు నెలల్లో జీవితం ముగుస్తుందని, ఇది ఒక శకునమని చెబుతుంటారు. అందుకే దీనిని భవిష్యత్తు అంచనా వేసే బావి అని కూడా పిలుస్తారు.
Also read : Kedar దగ్గర సినీ పెద్దల బ్లాక్ మనీ.. ఆ వేల కోట్లు ఎక్కడ.. వారందరిలో హైటెన్షన్!
Also Read : ఈ కష్టం పగోడికి కూడా రావొద్దు... పాకిస్తాన్ చెత్త రికార్డు!
శివుని భక్తుడైన చంద్ర దేవుడు
'చంద్రకూప్' అనే పేరు రెండు పదాలతో ఈ బావి నిర్మించబడింది. 'చంద్ర' అంటే చంద్రుడు, 'కూప్' అంటే బావి. హిందూ పురాణాల ప్రకారం, ఈ బావిని శివుని భక్తుడైన చంద్ర దేవుడు నిర్మించాడు. చంద్రదేవుని తపస్సుకు సంతోషించిన శివుడు ఈ బావికి ప్రత్యేక శక్తులను ప్రసాదించాడని నమ్ముతారు. ఈ బావిలోకి చూస్తేనే వ్యక్తి మనస్సు, శరీరం, ఆత్మ శుద్ధి అవుతాయని స్థానిక ప్రజలు నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం చంద్రేశ్వర లింగం నవగ్రహ శివలింగాలలో ఇది తొమ్మివది. పౌర్ణమి, అమావాస్య రోజులలో ఎక్కువగా భక్తులు ఇక్కడ పూజలు చేస్తుంటారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆలయాన్ని భక్తులు సందర్శించవచ్చు. ఈ బావిలో ఉన్న మరో ప్రత్యేక విషయం ఏమిటంటే, వారణాసిలోని మణికర్ణికా ఘాట్తో దీనికి ఉన్న సంబంధం ఉంది. ఈ బావి లోపల మణికర్ణిక ఘాట్ నుండి నేరుగా వెళ్ళే సొరంగం ఉందని స్థానిక పూజారి చెబుతున్నారు.
Also Read : కాలర్లు పట్టుకొని పొట్టు పొట్టు తన్నుకున్న బీజేపీ నేతలు.. వీడియో వైరల్
Also read : నీ భర్త కంటే విజయ్ బెటర్.. జ్యోతిక మాస్ రిప్లై.. మళ్ళీ వెంటనే డిలీట్!