Navy Jobs: పరీక్ష లేకుండానే ఉద్యోగం.. 56వేల జీతంతో ఇండియన్‌ నేవీలో జాబ్స్‌..!

షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఇండియన్​ నేవీ నోటిఫికేషన్​ జారీ చేసింది. ఈ రిక్రూట్​మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 254 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ జాబ్‌కు ఎంపిక అయితే బేసిక్ పే రూ. 56100 నుంచి మొదలవుతుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

New Update
Navy Jobs: పరీక్ష లేకుండానే ఉద్యోగం.. 56వేల జీతంతో ఇండియన్‌ నేవీలో జాబ్స్‌..!

Indian Navy - Short Service Commission Jobs: ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 254 ఖాళీలను భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేవీ joinindiannavy.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేసి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫిబ్రవరి 24న నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మార్చి 10, 2024.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 254 SSC ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు.

ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి:

--> ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్: 136 పోస్టులు

--> ఎడ్యుకేషన్ బ్రాంచ్: 18 పోస్టులు

--> టెక్నికల్ బ్రాంచ్: 100 పోస్టులు

అర్హత ప్రమాణం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా సబ్జెక్టులో B.E/B.Tech డిగ్రీని కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:
డిగ్రీ సాధారణ మార్కుల ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ విషయాన్ని ఈ-మెయిల్ లేదా SMS ద్వారా తెలియజేస్తారు. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్‌లో ఫిట్‌గా ఉన్న అభ్యర్థులు అడ్మిషన్‌లో ఖాళీల లభ్యత ప్రకారం నియమిస్తారు.

వేతనం:
బేసిక్ పే రూ. 56100 నుంచి మొదలవుతుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు ఇక్కడ లింక్‌పై క్లిక్‌ చేయండి.

Also Read: నిరుద్యోగులకు అలెర్ట్.. 1,025 పోస్టుల దరఖాస్తుకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి!

WATCH THIS VIDEO:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

All India Civil Services ఇప్పటివరకు ఫోన్ వాడలేదు.. ఆల్ ఇండియా సివిల్స్ లో తెలంగాణ అమ్మాయికి 11వ ర్యాంకు

వరంగల్ కి చెందిన సాయి శివాని అనే విద్యార్థిని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లోనూ సాయిశివాని రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు, జోనల్ 1లో 11వ ర్యాంకు సాధించింది.

New Update

All India Civil Services సాధారణంగా చాలామంది సివిల్స్ క్లియర్ చాలా కష్టమని భావిస్తారు. కానీ కస్టపడి చదివితే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని మరో సారి నిరూపించింది ఈ అమ్మాయి. తెలుగు తేజం సాయిశివాని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 

Also Read: Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

సివిల్స్ లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు 

వరంగల్ కి చెందిన సాయి శివాని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసిన సాయి శివాని.. ఆ తర్వాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టింది. కలెక్టర్  కలతో అహర్నిశలు కష్టపడింది. ప్రణాళికతో రోజుకు 12 గంటలు చదివింది. మొదటి సారి విఫలమైనా.. నిరాశ చెందలేదు. మళ్ళీ కష్టపడి చదివింది. రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా స్థాయిలో  11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.  2023లో ఐదు మార్కులతో సాయిశివాని ప్రిలిమ్స్ మిస్సయింది. తిరిగి 2025లో తన కల నెరవేర్చుకుంది. 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

ఈ సందర్భంగా సాయిశివాని మాట్లాడుతూ.. ఇంతవరకు ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే తన కల నెరవేరడానికి కారణమని తెలిపింది. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో కఠోర సాధన చేశాను. రోజుకు 12 గంటలు చదివాను. ఒత్తిడిని జయించడానికి యోగా, భగవద్గీత చదివేదాన్ని. ఈ విజయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారం మరువలేనిది అని చెప్పింది. 

latest-news

Also Read: AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

Also Read: Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే

Advertisment
Advertisment
Advertisment