Visakhapatnam: విశాఖలో బెంగాల్ విద్యార్థిని సూసైడ్.. అది ఆత్మహత్యా? హత్యా?

విశాఖ పట్నం నరసింహ నగర్ లోని సాధనా హాస్టల్ లో గత నెల 14వ తేదీన బెంగాల్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని రితీ సాహా అనుమానస్పద స్థితిలో మృతి చెంది. అయితే అది ఆత్మహత్య కాదు.. హత్య అని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రితీ సాహా పేరెంట్స్ ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశారు. దీంతో బెంగాల్ లోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించిన బెంగాల్ సీఎం.. విచారణ కోసం ఒక టీమ్ ను విశాఖ పంపిస్తున్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిన సంబంధిత విశాఖ నాల్గవ పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లిన మీడియాను నియంత్రించే ప్రయత్నం చేస్తుండడం మరింత అనుమానాలకు తావిస్తోంది.

New Update
Visakhapatnam: విశాఖలో బెంగాల్ విద్యార్థిని సూసైడ్.. అది ఆత్మహత్యా? హత్యా?

Kolkata Police Register Case into Death of Student in Visakhapatnam: విశాఖ పట్నం నరసింహ నగర్ లోని సాధనా హాస్టల్ లో గత నెల 14వ తేదీన బెంగాల్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని రితీ సాహా అనుమానస్పద స్థితిలో మృతి చెంది. అయితే అది ఆత్మహత్య కాదు.. హత్య అని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రితీ సాహా పేరెంట్స్ ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశారు. దీంతో బెంగాల్ లోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించిన బెంగాల్ సీఎం.. విచారణ కోసం ఒక టీమ్ ను విశాఖ పంపిస్తున్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిన సంబంధిత విశాఖ నాల్గవ పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లిన మీడియాను నియంత్రించే ప్రయత్నం చేస్తుండడం మరింత అనుమానాలకు తావిస్తోంది.

కోల్ కత్తాలో కేసు నమోదు: 

పశ్చిమ బెంగాల్ కు చెందిన రితీ సాహా ఆకాష్ బైజూస్ లో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. రితీ బైజూస్ కు అనుసంధానంగా ఉన్న సాధనా హాస్టల్ లో ఉంటోంది. గతల నెల 14న హాస్టల్ 4వ అంతస్తుపై నుంచి దూకి చనిపోయిందని తల్లిదండ్రులకు హాస్టల్ యాజమాన్యం తెలిపింది. హుటాహుటిన బెంగాల్ నుంచి వచ్చి తల్లిదండ్రులు.. విగత జీవిగా పడి ఉన్న రితీని చూసి కన్నీరుమున్నీరయ్యారు. రితీ మృతిపై వారు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నారు.హాస్టల్ సిబ్బంది, పోలీసులు చెప్తున్న దానిపై అనేక అనుమానాలు వచ్చాయి.

ఈ కేసుపై సీఎం మమతా బెనర్జీ ప్రెస్ మీట్:

నాలుగో అంతస్తు పైకి వెళ్ళే సమయంలో రితీ ఒక డ్రెస్ లో ఉన్నట్టు హాస్టల్ సీ సీ పుటేజ్ లో కనిపించగా.. కింద పడి ఉన్న మృత దేహంపై మరో కలర్ డ్రెస్ ఉన్నట్టు ఆ భవనానికి ఎదురుగా ఉన్న బిల్డింగ్ సీసీ పుటేజ్ లో ఉన్నట్టు మృతు రాలి తల్లి తండ్రులు చెప్తున్నారు. ఆ విషయాన్ని పోలీసులకు చెబితే పట్టించుకోవడం లేదనీ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ ల పై నమ్మకం లేదంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కి ఫిర్యాదు చేశారు తల్లితండ్రులు. దీంతో కలకత్తాలో ఈ హత్య కేసుపై మమతా బెనర్జీ మాట్లాడారు. బెంగాల్ మంత్రి అనూప్ ను ఏకంగా రితీ సాహా ఇంటికి పంపించారు.

కోల్ కత్తా నేతాజీ నగర్ పీ ఎస్ లో రితీ సాహా అనుమానస్పద మృతిపై కేసు నమోదు కావడం పై విశాఖ పోలీస్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. స్థానిక పోలీస్ అధికారుల వ్యవహార శైలి పై మృతురాలి తల్లితండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. మేము అక్కడ ఉన్నప్పుడు ఒక నల్లటి కార్ లో వచ్చిన వ్యక్తులకు బ్యాగ్‌ లలో డబ్బులు పంపారని, వాళ్ళు పోలీస్ అధికారులకు చెందిన మనుషులు అని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఒక రాష్ట్రంలో జరిగిన ఘటనలపై వేరే రాష్ట్రంలో కేసులు నమోదు కావడం అరుదు..అలాంటిది కలకత్ లో కేసు నమోదు కావడం, స్థానిక పోలీసులపై ఆరోపణలు రావడం లాంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

ఇది హత్యనే విద్యార్థిని తల్లిదండ్రులు:

రితీ సాహాను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. కాలేజ్, హాస్టల్ నిర్వాహకుల నుంచి పోలీసులు డబ్బులు తీసుకొని కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యార్థిని తల్లిదండ్రులు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ వర్మకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert:  ఉరుములు..మెరుపులు...ఏడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే?

వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది.

New Update
  Rain Alert For Telangana

Rain Alert

Rain Alert : వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే , మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది. రాబోయే ఏడు రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని ఈశాన్య, దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కు మార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!
 
ముఖ్యంగా అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అస్సాంలోని గౌహతిలో  భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెండు మూడు గంటల పాటు కురిసిన వర్షం కారణంగా.. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో రాబోయే 24 గంటల్లో అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో కూడా భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!
 
అయితే.. వాయువ్య బీహార్ మీదుగా తుఫాను ఏర్పడిందని.. ఇది మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడుతుంది. దీని ప్రభావంతో రాబోయే 7 రోజులు ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ నెల22 నుంచి27 మధ్య అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు నాగాలాండ్, మణిపూర్, మిజోరం మరియు త్రిపురలలో కూడా భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
 
ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

 

 

Advertisment
Advertisment
Advertisment