Kerala: అమిత్‌ షా వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన పినరయ్‌ విజయన్‌

కేరళలో వైపరీత్యం ముంచుకొస్తుందని ముందుగా హెచ్చరించినా అప్రమత్తం కాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ స్పందించారు. కొండచరియలు విరిగిపడే ముందు ఐఎండీ కేవలం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసిందన్నారు.

New Update
Kerala: అమిత్‌ షా వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన పినరయ్‌ విజయన్‌

కేరళలోని వాయనాడ్‌ జిల్లాలో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ వైపరీత్యం ముంచుకొస్తుందని కేరళను జులై 23నే హెచ్చరించామని వారే అప్రమత్తం కాలేదని కేంద్రమంత్రి అమిత్‌ షా బుధవారం పార్లమెంటులో చెప్పారు. అయితే దీనిపై కేరళ సీఎం పినరయి విజయన్ కౌంటర్ వేశారు. ఇది పరస్పర నిందారోపణలకు సమయం కాదని అన్నారు. కొండచరియలు విరిగిపడే ముందు వాతావరణ శాఖ (IMD) కేవలం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసిందని పేర్కొన్నారు.

Also Read: ఐఏఎస్‌ కోచింగ్ సెంటర్ ఘటన.. స్పందించిన రావుస్ అకాడమీ

ఐఎండీ అంచనాలకు మించి వయనాడ్‌లో 500 మి.మీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని తెలిపారు. ఇది ఐఎండీ హెచ్చరికలు చాలా అధికమన్నారు. వైపరీత్యానికి ముందు ఈ ప్రాంతం ఎప్పుడూ కూడా రెడ్ అలర్ట్‌లో లేదని చెప్పారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆరు గంటలకు రెడ్ అలర్ట్‌ జారీ చేశారని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. కేరళలోని వయనాడ్‌ జిల్లాలో మెప్పడి, మండక్కై, చూరాల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 200 మందికి పైగా చనిపోయినట్లు కేరళ వైద్యారోగ్య శాఖ తెలిపింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: మూడు నగరాల నుంచి అధికంగా వెజ్ ఆర్డర్లు-స్విగ్గీ

మరోవైపు అరేబియా సముద్రం వేడెక్కడం వల్లే ఈ భారీ వర్షాలకు కారణమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. అరేబీయా తీరంలో దట్టమైన మేఘాల వ్యవస్థ ఏర్పడటంతో వయనాడ్‌, కొలికోడ్‌, మలప్పురం, కన్నూర్‌లలో భారీ వర్షాలకు దారీ తీశాయన్నారు. 2019లో కేరళలో వరదలకు కారణమైన దట్టమైన మేఘాల మాదిరిగానే ఇవి ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు ఈ తరహా దట్టమైన మేఘాల ధోరణిని శాస్త్రవేత్తలు ముందుగానే గుర్తించారని కొచ్చి యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన రాడార్‌ పరిశోధన కేంద్రం డైరెక్టర్‌ అభిలాష్‌ తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: పెళ్లయిన 6 రోజులకే ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన నవ వధువు..

జమ్మూకశ్మీర్‌లో వినయర్‌ నర్వాల్ (26) అనే నేవీ అధికారి పెళ్లయిన ఆరురోజులకే టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల చేతిలో మరణించారు. భర్త మృతిని తట్టుకోలేని ఆ నవవధువు ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
Pahalgam Attack

Pahalgam Attack

జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. టీఆర్‌ఎఫ్‌ ఉగ్రవాదుల కాల్పుల్లో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. వీళ్లలో  లెఫ్టినెంట్ వినయర్‌ నర్వాల్ (26) అనే నేవీ అధికారి పెళ్లయిన ఆరురోజులకే  ఉగ్రవాదుల చేతిలో మరణించారు. భర్త మృతిని తట్టుకోలేని ఆ నవవధువు ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాకు చెందిన వినయ్ నర్వాల్‌.. ప్రస్తుతం కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. 

Also Read: నలుగురు టెర్రరిస్టులను గుర్తుపట్టిన భద్రతా బలగాలు

ఏప్రిల్ 16న ఆయనకు వివాహం జరిగింది. హనీమూన్‌ కోసం ఆయన తన సతీమణితో కశ్మీర్‌కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే వినయ్ జీవితం ఉగ్రవాదులకు బలైపోయింది. భర్తను కోల్పోయిన ఆ నవవధువ ఆవేదన అందరినీ కన్నీ్ళ్లు పెట్టిస్తోంది. ఆమె రోదిస్తూ.. '' మాకు పెళ్లయి ఆరు రోజులే అయ్యింది. ఈ ఘటన జరిగినప్పడు మేము పానీపూరీ తింటున్నాం. ఒక్కసారిగా ఓ ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అడిగాడు. వెంటనే తన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడని'' ఆమె ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: పహల్గామ్‌ ఉగ్రదాడి.. ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా!

ఇదిలాఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

Also Read: పహల్గామ్ అటాక్ సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్!

 telugu | Pahalgam attack

 

Advertisment
Advertisment
Advertisment