USA : రెఫ్యూజీలను అనుమతించడానికి ఇండియాకు భయం..జోబైడెన్ సంచలన వ్యాఖ్యలు

ఎప్పుడూ లేనిది అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ భారత్‌ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ వలదారులను అనుమతించడానికి ఇండియా భయపడుతుంది అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. అందుకే భారత్‌లో అభివృద్ధి వేగంగా లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.

New Update
Joe Biden: బైడెన్‌ కు కరోనా పాజిటివ్‌!

Joe Biden Controversial Comments : భారత్, చైనా(China), జపాన్(Japan), రష్యా(Russia) లు జెనోఫోబిక్ దేశాలంటూ విమర్శించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden). ఈదేశాలు రెఫ్యూజీలను అనుమతించవని అన్నారు. అందుకే భారత్ లాంటి దేశాలు వేగంగా అభివృద్ధి చెందడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. వాషింగ్టన్‌లో పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో జో బైడెన్‌ పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. దాంతో పాటూ అమెరికా గురించి కూడా గొప్పగా చెప్పుకున్నారు. అమెరికా..భారత్(America-India), మిగతా దేశాల్లాంటిది కాదని చెప్పారు. అమెరికా విదేశీ వలసదారులను స్వాగతిస్తుందన్నారు. అలా వచ్చిన వారు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేందుకు కృషి చేస్తున్నారని...అందుకే తమ దేశం ఎప్పుడు అభివృద్ధి పథంలోనే ఉంటుందని చెప్పుకొచ్చారు.

జోబైడెన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.అందులోనూ ప్రస్తుతం భారత్‌లో ఎన్నికల టైమ్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని రాజకీయ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా మిత్ర దేశాలైన భారత్‌, జపాన్‌ గురించి బైడెన్‌ తక్కువ చేసి మాట్లాడం ఏం బాలేదని విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు బారతీయుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read:Party Symbols: బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న కారు గుర్తును పోలిన సింబల్స్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీకి రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌ గగనతలంలో ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. మోదీ విమానం ఆ దేశంలోకి వెళ్లగానే 6ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌గా వచ్చాయి. 2వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశానికి ఆయన అక్కడికి వెళ్లారు.

New Update
Saudi Arabia visit

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2 రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు. ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌కు చెందిన ఎఫ్‌-15 విమానాలు దానిని ఎస్కార్ట్‌గా వచ్చాయి. మోదీ ప్రయాణిస్తు్న్న విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున 6 జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

సౌదీకి బ‌య‌లుదేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల 2 దేశాల మ‌ధ్య బంధం మ‌రింత దృఢ‌మైంద‌న్నారు. ర‌క్షణ‌, వాణిజ్య, పెట్టుబ‌డి, ఎనర్జీ రంగాల్లో స‌హ‌కారం పెరిగింద‌న్నారు. ప్రాంతీయంగా శాంతి, సామ‌ర‌స్యం, స్థిర‌త్వం పెంచేందుకు ఇండియా, సౌదీ దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నట్లు తెలిపారు.

Also read: BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

ప్రధాని హోదాలో మోదీ సౌదీ వెళ్లడం ఇది మూడోసారి అయినా.. జెడ్డాకు వెళ్లడం ఇదే మొద‌టిసారి. రెండ‌వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొనున్నారు. ప్రధాని తన పర్యటనలో జెడ్డాలో ఆ దేశంతో 6 ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ ఆరేబియా చ‌క్రవ‌ర్తి మ‌హ‌మ్మద్ బిన్ స‌ల్మాన్ అల్ సౌద్‌తో జ‌రిగే చ‌ర్చల్లో భార‌తీయ యాత్రికుల‌కు చెందిన హ‌జ్ కోటా గురించి మాట్లాడ‌నున్నారు.

(saudi-arabia | modi-visit | Air escort)

Advertisment
Advertisment
Advertisment