Israel-Hamas war:ఇజ్రాయెల్ సైన్యం పొరపాటున బందీలను చంపేసింది-ప్రధాని నెతన్యాహు

ఏం జరిగినా...ఎవ్వరిడగినా...ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ మీద దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ముగ్గురిని ఇజ్రాయెల్ సైన్యం చంపేయడం ఇప్పుడు చర్చనీయంగా మారింది.

New Update
Israel-Hamas war:ఇజ్రాయెల్ సైన్యం పొరపాటున బందీలను చంపేసింది-ప్రధాని నెతన్యాహు

హమాస్ దగ్గర బందీలను ఇజ్రాయెల్ సైన్యమే చంపడం ఇప్పుడు కలకలం రేగుతోంది. ఇది అనుకోకుండా జరిగింది...విషాదకర సంఘటన అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పినప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలు దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజాలోని టెల్ అవీవ్ లోని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం బయట ప్రదర్శనలు చేశారు.

Also read:ధోనీ వర్సెస్‌ రోహిత్‌ ఎపిక్‌ క్లాష్‌కి ఎండ్‌కార్డ్.. ఫ్యాన్స్‌ ఎమోషనల్‌!

ఏది ఏమైనా హమాస్‌ను పూర్తిగా తుదముట్టించేవరకు తాము యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ వార్ మొదలై ఇప్పటికి 71 రోజులు గడిచింది. దీనివలన గాజాలో 85శాతం మంది ప్రజలు నిరాశ్రయులైయ్యారు. యుద్ధం మాయవినాశనానికి దారి తీస్తోందని ఐరాస మొత్తుకుంటోంది. దీని కోసం తీర్మానాలను ప్రవేశపెడుతోంది. అన్ని దేశాలు కూడా దీనికి మద్దతునిస్తున్నాయి. అమెరికా కూడా కొన్ని షరతులతో తీర్మానానికి ఆమోదం తెలిపింది. కాల్పుల విరమణ డిమాండ్ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దాన్ని పట్టించుకోకపోవడం మీద ఐరాస ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ చట్టాలను ఆదేశం ఉల్లంఘిస్తోందని అంటోంది.

మరోవైపు తాము గాజాలో ప్రజలకు మానవసహాయం అందిస్తున్నామని తెలిపింది ఇజ్రాయెల్. తమ భూభాగం ద్వారా అవి వెళుతున్నాయని తెలిపింది. యుద్ధం మొదలైన తర్వాత పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ సహాయం చేయడం ఇదే మొదటిసారి. దీంతో పాటూ సామస్య ప్రజలకు భద్రత కలిగించడం మీద కూడా అమెరికా ఎన్ఎస్ఏ...ఇజ్రాయెల్ అధికారులతో మాట్లాడుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Earthquake: గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు.. భయాందోళనలో జనం

ఆదివారం ఒకే గంటల వ్యవధిలో భారత్, మయన్మార్, తజికిస్తాన్‌లో నాలుగు భూకంపాలు వచ్చాయి. భారత్‌లో రెండు, మయన్మార్, తజికిస్తాన్‌లో ఒక్కోటి వచ్చాయి. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు.

New Update
Earthquake

Earthquake

ఈమధ్య వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఆదివారం ఒకే గంటల వ్యవధిలో భారత్, మయన్మార్, తజికిస్తాన్‌లో నాలుగు భూకంపాలు వచ్చాయి. దీంతో జనం భయాందోళనలో ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. మొదటి భూకంపం తజికిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు సమీపంలో రాగా.. ఆ తర్వాత మయన్మార్‌లో మీక్టిలాలో వచ్చింది. అనంతరం భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్‌లో, ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకశీలో భూకంపాలు వచ్చాయి.   

Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు. తజికిస్తాన్‌లో భూకంప తీవ్రత 6.0 గా నమోదయ్యింది. భారత్‌లో ఫైజాబాద్‌లో ఉదయం 9 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. కేవలం ఒక గంట వ్యవధిలోనే నాలుగు భూకంపాలు వచ్చాయి. మయన్మార్‌లో 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. మార్చి 28న అక్కడ 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ బలమైన భూకంపం సంభవించడం కలకలం రేపింది. జనం ఇళ్ల నుంచి భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. 

Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!

 జమ్ముకశ్మీర్‌లో హిమాలయన్‌ ప్రాంతంలో 4.2 తీవ్రతో భూకంపం రావడంతో అక్కడి స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ భూకంపాలు భారత్‌ ప్లేట్‌ యూరేషియన్ ప్లేట్‌తో ఢీకోనడం వల్ల సంభవించే టెక్టోనిక్‌ కదలికల వల్ల సంభవిస్తున్నాయి. ఇదిలాఉడంగా మార్చి 28న మయన్మార్‌ వచ్చిన భూకంప ధాటికి 3600 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

telugu-news | rtv-news | earthquake | national-news

 

Advertisment
Advertisment
Advertisment