CSK vs RCB: ఇలా సింగిల్‌గా కప్‌లు గెలవడం మన వల్ల కాదు భయ్యా.. పొత్తులు పెట్టుకుంటే బెటర్!

సింగిల్‌గా కప్‌లు గెలవలేమని.. ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంటే మంచిదని ఓ యూజర్ చేసిన ట్వీట్‌ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్‌-17 ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లో చెన్నైపై ఆర్‌సీబీ ఓడిపోయింది. దీంతో ఆర్‌సీబీపై సోషల్‌మీడియాలో మీమ్స్‌ పేలుతున్నాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
CSK vs RCB: ఇలా సింగిల్‌గా కప్‌లు గెలవడం మన వల్ల కాదు భయ్యా.. పొత్తులు పెట్టుకుంటే బెటర్!

IPL 2024 - Trolls On RCB: ఈ సాలా కప్‌ నమ్‌దీ అన్నారు అమ్మాయిలు.. ఇటు అబ్బాయిలు మాత్రం ఎప్పటిలాగే నెక్ట్స్‌ సాలా కప్‌ నమ్‌దే అనేలాగే ఉన్నారు. విమెనన్స్‌ ప్రిమియర్‌ లీగ్‌ రెండో ఎడిషన్‌లోనే బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ అమ్మాయిలు కప్‌ సాధించారు. ఇటు మెన్స్‌ టీమ్‌ 17వ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఓటమితో ప్రారంభించింది. ఓడిపోవడం సంగతి పక్కన పెడితే అసలు గెలవాలన్న ఉద్దేశ్యమే లేనట్టు ఆడింది ఆర్‌సీబీ (RCB). బ్యాటింగ్‌లో కార్తిక్‌, రావత్‌ ఆడబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఘోరమైన ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చేది. తొలి మ్యాచ్‌తోనే ఆర్‌సీబీని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ అటు సోషల్‌మీడియా ఊరుకుంటుందా? బెంగళూరు ఓడిపోయిన ప్రతీసారి మిమ్స్‌ పేలుతాయి. నిజానికి ఈ జోకులను ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ కూడా ఎంజాయ్‌ చేస్తారు. అంతటి స్పోరిటివిటీ ఆ జట్టు అభిమానులది.


చంద్రబాబును అంటున్నారా?
ఐపీఎల్‌-17 ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపై విక్టరీ కొట్టింది. ఆర్‌సీబీ సెట్‌ చేసిన 174 పరుగుల టార్గెట్‌ను 4 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది రుతురాజ్‌ టీమ్‌. దీంతో ఆర్‌సీబీ ఓటమిపై క్రికెట్‌ అభిమానులు ఎప్పటిలానే సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అందులో ఓ యూజర్‌ చేసిన ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఇలా సింగిల్‌గా కప్‌లు గెలవలేమని ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంటే మంచిదని ఓ యూజర్ చేసిన ట్వీట్‌ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది పరోక్షంగా చంద్రబాబుకు చురకలంటించే విధంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటికి దిగుతున్నాయి. అటు జగన్‌ పార్టీ సింగిల్‌గా పోటి చేస్తోంది. ఈ పరిణామాలను మ్యాచ్‌ చేసే ఆ యూజర్‌ ఇలా ట్వీట్ పెట్టినట్టుగా తెలుస్తోంది. నిజానికి చంద్రబాబు సింగిల్‌గా పోటి చేయరనే విమర్శ ఎప్పటినుంచో ఉంది.


కొంపముంచిన బ్యాటర్లు
ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 రన్స్ చేసింది. ఓపెనర్‌ డుప్లెసిస్‌ (Du Plessis) ఆరంభంలో దూకుడుగా ఆడాడు. 23 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు డుప్లెసిస్‌. అయితే అతను ఔటయ్యాక పరిస్థితి మారిపోయింది. రజాత్‌ పటిదార్‌, మ్యాక్స్‌వెల్‌ బాతు గుడ్లు పెట్టి వెళ్లిపోయారు. దీంతో కోహ్లీ (Virat Kohli), గ్రీన్‌ మరో వికెట్‌ పడకుండా టుక్‌ టుక్‌ బ్యాటింగ్‌ చేశారు. ఆ తర్వాత బ్యాట్‌కు పని చెబుతురానుకుంటే అలా జరగలేదు. ఇద్దరు స్వల్వ వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. అయితే అనుజ్‌ రావత్‌, దీనేశ్‌ కార్తిక్‌ పోరాటంలో ఆర్‌సీబీ 173 రన్స్‌ చేయగలిగింది. అటు టార్గెట్‌ ఛేజింగ్‌లో చెన్నై ఆడుతూ పాడుతూ గెలిచేసింది.

Also Read: ఏళ్ళు గడుస్తున్నా చెన్నై గడ్డపై కోహ్లీకి లేని విక్టరీ.. ధోనీ చేతిలో మరోసారి ఓటమి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bhubharathi Portal : రేపే భూభారతి పోర్టల్ ఆరంభం..ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు

రేపటి నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది. తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూభారతి అమలుపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

New Update
Bhubharathi Portal

Bhubharathi Portal

Bhubharathi Portal : రేపటి నుంచి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది.రాష్ట్రంలో భూభారతి పోర్టల్‌ను తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.భూభారతి అమలుపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి పోర్టల్‌ను రేపు జాతికి అంకితం చేయబోతున్నట్లు తెలిపారు. సామాన్య రైతుకు కూడా అర్ధమయ్యేలా భూభారతిని రూపొందించాలని అధికారులకు సూచించారు. భూభారతి తాత్కాలికం కాదని.. కనీసం వంద సంవత్సరాల పాటు ఉంటుందని అన్నారు. భూభారతి వెబ్‌సైట్ సైతం అత్యాధునికంగా ఉండాలని తెలిపారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. భూభారతి నిర్వహణ విశ్వసనీయత సంస్థకు అప్పగించాలని చెప్పారు.కాగా పోర్టల్‌పై రైతులకు అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు.  

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

భూ స‌మ‌స్యల ప‌రిష్కారం, లావాదేవీల‌కు చెందిన స‌మాచారం రైతులకు, ప్రజలకు సుల‌భంగా అంద‌బాటులో ఉండేలా భూ భార‌తి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. భూభారతికి చెందిన పలు అంశాలను అధికారులకు ఆయన సూచించారు. ఈ పోర్టల్​ ను పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో మూడు మండలాల్లో పైలట్​ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని అక్కడ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూభారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆయా స‌ద‌స్సుల్లో ప్రజ‌ల నుంచి వ‌చ్చే సందేహాలను నివృత్తి చేయాలో అధికారులకు సూచించారు. అదేవిధంగా ఈ భూ భారతిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రతి మండ‌లంలోనూ క‌లెక్టర్ల ఆధ్వర్యంలో స‌ద‌స్సులు నిర్వహించాల‌ని సీఎం ఆదేశించారు.

Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

 ప్రజలు, రైతుల‌కు అర్ధమ‌య్యేలా, సుల‌భ‌మైన భాష‌లో పోర్టల్ ఉండాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోర్టల్ బ‌లోపేతానికి ప్రజ‌ల నుంచి వ‌చ్చే స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తూ ఎప్పటిక‌ప్పుడు అప్‌డేట్ చేయాలని సీఎం అధికారుల‌కు సూచించారు. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాల‌ని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ కార్యద‌ర్శి జ్యోతి బుద్ద ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన  

 రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్​ ప్రజల పాలిట శాపంగా మారిందని, భూ లావాదేవీలన్నింటినీ ఆన్​లైన్​ ద్వారా నిర్వహించేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్​ సామాన్య ప్రజలకు ఇబ్బందులను తెచ్చిందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ పార్టీ గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం విమర్శలు చేసింది. భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల నుంచి ధరణి పోర్టల్‌లో ఎక్కించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తింది. దీంతో 20 లక్షలకు పైగా రైతులు ధరణి పోర్టల్‌ కారణంగా ఆగమయ్యారని ఆరోపించింది.

Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు

 

Advertisment
Advertisment
Advertisment