Iran Warns US : మా కొత్త ఆయుధంతో.. అమెరికాకు గుండెపోటు గ్యారంటీ..ఇరాన్ తాజా హెచ్చరిక

ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ చేసిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. శత్రు బలగాలపై ప్రయోగించబోయే ఒక రహస్య "కొత్త ఆయుధం" గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఆయుధం అమెరికా దళాలకు "గుండెపోటు" తెప్పించేంత శక్తివంతమైనదన్నారు.

New Update
FotoJet - 2026-04-30T101616.484

With our new weapon

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు(iran us war) పరాకాష్ఠకు చేరిన తరుణంలో, ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ చేసిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. శత్రు బలగాలపై ప్రయోగించబోయే ఒక రహస్య "కొత్త ఆయుధం" గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఆయుధం అమెరికా దళాలను తీవ్రంగా భయపెట్టడమే కాకుండా, వారి వెన్నంటే ఉంటూ "గుండెపోటు" తెప్పించేంత శక్తివంతమైనదని ఆయన హెచ్చరించారు(Iran Warns US Strikes). అయితే, ఆ ఆయుధానికి సంబంధించిన సాంకేతిక వివరాలను మాత్రం ఆయన గోప్యంగా ఉంచారు.

Also Read :  అమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్‌ ఫొటో... విదేశాంగ శాఖ సంచలన నిర్ణయం

Iran Warns US

హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే చర్చలకు వస్తామన్న ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసి చర్చల మేజా వద్దకు తీసుకురావాలన్న అమెరికా వ్యూహాన్ని ఇరానీ కొట్టిపారేశారు. అమెరికా గర్వకారణంగా భావించే విమాన వాహక నౌక 'యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్'పై ఇరాన్ దళాలు ఏడు క్షిపణులతో దాడి చేసి, దాని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయగలిగాయని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ తమ నౌకలు గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయని ఆయన వెల్లడించారు.

మరోవైపు, ఇరాన్‌తో కొత్త అణు ఒప్పందం కుదిరే వరకు ఆర్థిక ,నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతుందని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. నేరుగా సైనిక చర్య చేపట్టడం కంటే ఓడరేవుల దిగ్బంధనమే ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. టెహ్రాన్ తీవ్ర ఒత్తిడిలో ఉందని, అందుకే సంఘర్షణను ముగించి చర్చలకు రావాలని కోరుకుంటోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఇరాన్‌పై ఒత్తిడిని మరింత పెంచుతామని ఆయన హెచ్చరించారు.

ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తమ పౌరుల కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి ప్రతీకారం తీర్చుకుంటామని అడ్మిరల్ ఇరానీ ప్రతిజ్ఞ చేశారు. శత్రువులు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందేవరకు వారిని దెబ్బకొడుతూనే ఉంటామని ఆయన హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ భీకర మాటల యుద్ధం, క్షిపణి దాడులు పశ్చిమాసియాలో శాంతి భద్రతలను మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి.

Also Read :  ఆకలి తీర్చుకోవడానికి తోటి సైనికులనే తింటున్న రష్యా జవాన్లు.. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంచలనం!

Advertisment
తాజా కథనాలు