USA: మంచు తుఫానులో అమెరికా..ఎమర్జెన్సీ ప్రకటించిన రాష్ట్రాలు

భారీ మంచు తుఫాను అమెరికాను ముంచేయనుంది. చాలా రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మంచు, వర్షంతో పాటూ అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అక్కడి వాతావణశాఖ చెబుతోంది. ఇది ఈ దశాబ్దిలోనే తీవ్ర తుఫానుగా అంచనా వేస్తోంది. 

author-image
By Manogna alamuru
New Update
Snow Fall: కాశ్మీర్ ను కప్పేసిన మంచు దుప్పటి.. రోడ్స్ మూసివేత! 

చలికాలంలో ఏవో రెండు, మూడు రాష్ట్రాలు తప్ప మొత్తం అమెరికా అంతా మంచు దుప్పటి కప్పేసుకుంటుంది. దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటూ స్నోలో కూరుకుపోతుంది. రోజురోజుకూ డ్రాప్ అయ్యే ఉష్ణోగ్రతలతో చలికి వణికిపోతారు అక్కడి ప్రజలు. ఇది వారికి సర్వసాధారణమే. మంచు పడడం సాధారణమే అయినా మంచు తుఫానులను తట్టుకోవడం మాత్రం సాధారణం కాదు. మామూలుగా ఉష్ణోగ్రతలు తగ్గి మంచు పడితే అంత ఎఫెక్ట్ ఉండదు. కానీ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు డ్రాప్ అయిపోయి అద కాస్తా మంచు తుఫానుకు దారి తీస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అమెరికాలో ఎంత చలి తీవ్రతకు తట్టుకునే ఏర్పాట్లు ఉన్నా...మంచు తుఫానుల తాకిడికి మాత్రం బలవ్వకతప్పదు. 

గత పదేళ్ళల్లో లేదు..

ఇప్పుడు ఈ భయమే వణికిస్తుంది అమెరికా ప్రజలును. మరో రెండు, మూడు రోజుల్లో తీవ్రమైన మంచు తుఫాను అమెరికాలో చాలా రాష్ట్రాలను చుట్టు ముట్టేయనుంది.  దీంతో అనేక రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మంచు, వర్షంతోపాటు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. గత పదేళ్ళల్లోనే ఇలాంటి భారీ తుఫాను రాలేదని చెబుతున్నారు.  ఇది ఈ దశాబ్దిలోనే అతి తీవ్ర తుపానుగా వాతావరణశాఖ అంచనా వేస్తున్నారు. ఈ మంచు తుఫాను దాదాపు పదిహేనుకుపైగా రాష్ట్రాల మీద ప్రభావం చూపించనుంది. దీనివలన సుమారు 6కోట్ల మంది ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Also Read: అభ్యర్థులకు అలెర్ట్.. CUET PG రిజిస్ట్రేషన్ స్టార్ట్.. ఇలా అప్లై చేసుకోండి!

ఎమర్జెన్సీ విధించిన రాష్ట్రాలు..

మధ్య అమెరికాలో మొదలయ్యే శీతల తుఫాను తూర్పు దిశగా కదులుతోందని యూఎస్ నేషనల్ వెదర్ సర్వీఎస్ చెబుతోంది. పోలార్ వర్టెక్స్ కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మిస్సౌరీ నుంచి మధ్య అట్లాంటిక్‌ వరకు ఇది విస్తరించనుందని, గడిచి దశాబ్దిలోనే అతి తీవ్ర శీతల తుపానుగా కానుందని వాతారణ శాఖ చెబుతోంది.  అమెరికాలో 2011 తర్వాత ఇలాంటి తుఫాను రావడం ఇద మొదటిసారని అంటున్నారు. వారం రోజుల పాటూ ఈ తుఫాను ఉండనుందని అంచనా వేస్తున్నారు. వాతావరణశాఖ హెచ్చరికలతో అనేక రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కెంటకీ, వర్జీనియా, కాన్సాస్, ఆర్కాన్సాస్‌ రాష్ట్రాలు ఇప్పటికే ఎమర్జెన్సీ విధించాయి. కన్సాస్‌, ఇండియానా ప్రాంతాల్లో 20 సెం.మీ, వర్జీనియాలో 10 నుంచి 25సెం.మీ మేర మంచు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనాలున్నాయి.

Also Read: HYD: హైదరాబాద్ మినర్వా హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

America: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

అంతర్యుద్ధాలతో అట్టుడికే దేశాల్లోని లక్షల మందికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహారం పథకం ద్వారా అందించే సాయాన్ని అమెరికా నిలిపివేసింది.ఆఫ్గానిస్తాన్‌, సిరిమా, యెమెన్‌ తదితర 11 దేశాల ప్రజలు ఆకలితో అలమటించనున్నారు.

New Update
crisis

crisis

అంతర్యుద్ధాలతో అట్టుడికే దేశాల్లోని లక్షల మందికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహారం పథకం ద్వారా అందించే సాయాన్ని అమెరికా నిలిపివేసింది. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆఫ్గానిస్తాన్‌, సిరిమా, యెమెన్‌ తదితర 11 దేశాల ప్రజలు ఆకలితో అలమటించనున్నారు.అమెరికా ప్రభుత్వ సూచన మేరకు ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నాం.

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

America Food Boycott

డోజ్‌ లోని యూఎస్‌ఎయిడ్‌ వ్యవహారాలను చూసే జెరెమీ లూవిన్‌ ఈ ఆదేశాలిచ్చారు అంటూ భాగస్వాములకు పంపిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.దీనికి సంబంధించి దాదాపు 60 కి పైగా లేఖలు వివిధ విభాగాలకు గత వారం రోజుల్లో అందాయి.అమెరికా నిర్ణయం పై ప్రపంచంలో అతి పెద్ద ఆహార సహాయ పథకాన్ని నిర్వహించే డబ్ల్యూఎఫ్‌పీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

ఇది లక్షల మందికి మరణ శాసనం అవుతుంది.వారంతా తీవ్ర ఆకలితో అలమటించిపోతారు. ఆకలి చావులు సంభవిస్తాయని తన ఎక్స్‌ పేజీలో పేర్కొంది.ఈ నిర్ణయాన్ని ట్రంప్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విజ్ఙప్తి చేసింది. ప్రాణాలను కాపాడే పథకాలకు సాయం పై ట్రంప్‌ యంత్రాంగంతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.ఇప్పటి దాకా చేసిన సాయానికి కృతజ్ఙతలు తెలిపింది.

కోతల నుంచి ఆహారంతో పాటు ప్రాణాధార అత్యవసర సాయాలను మినహాయిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పాటు ప్రభుత్వ అధికారులు గతంలోనే హామీ ఇచ్చారు. అయితే సోమవారం ఆయన కార్యాలయం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

Also Read:EX MLC Jeevan Reddy Vs MLA Sanjay Kumar : మళ్లీ వేడెక్కిన జగిత్యాల రాజకీయాలు..ఎమ్మెల్యే..మాజీ ఎమ్మెల్సీ మధ్య వార్‌

Also Read:Kalvakuntla Kavitha : అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదం..ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

latest telugu news updates | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
Advertisment