Ukrain-Russia: ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు!

కీవ్‌ పై మాస్కో వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. తాజాగా ఉక్రెయిన్‌ కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేశాయి. కీవ్‌ మేయర్‌ విటాలి కీచ్‌కోస్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

New Update
RUSSIAA

రష్యా-ఉక్రెయిన్‌ (Russia-Ukraine) ల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ఒక వైపు కీలక భేటీలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కీవ్‌ పై మాస్కో (Mascow) వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. తాజాగా ఉక్రెయిన్‌ కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేశాయి. 

Also Read:  Niharika Konidela: నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను.. నిహారిక ఎమోష‌న‌ల్ పోస్ట్ ఎవ‌రి గురించో తెలుసా!

కీవ్‌ మేయర్‌ విటాలి కీచ్‌కోస్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. రష్యా తమ పై బాలిస్టిక్‌ క్షిపణులు,బహుళ రాకెట్లను ప్రయోగించిందని కీచ్‌కోస్‌ తెలిపారు.వీటిని తమ దళాలు అడ్డుకుంటున్నాయని పేర్కొన్నారు. కీవ్‌ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తమకు పేలుడు శబ్ధాలు వినిపిస్తున్నాయని అక్కడి ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.

Also Read: Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!

Ussian Airstrikes On Ukraine

యుద్ధం ముగింపునకు సౌదీ అరేబియాలో ఉక్రెయిన్‌, అమెరికా అధికారులు కీలక చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలో రష్యా దాడులు చేయడం గమనార్హం.ఇటీవల సైతం ఉక్రెయిన్‌ లోని డోబ్రోపిలియా, ఖార్కివ్‌ ప్రాంతాల్లోని స్థావరాల పై రష్యా క్షిపణి, డ్రోన్‌ లతో విరుచుకుపడింది.ఈ దాడిలో 14 మంది మరణించగా..అనేక మంది గాయపడ్డారు.

ఎనిమిది బహుళ అంతస్తుల భవనాలు, 30 కు పైగా వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. రష్యా దాడుల నుంచి ప్రజలను రక్షించేందుకు తమ వైమానిక రక్షణను బలోపేతం చేయాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఇక రష్యా ఉక్రెయిన్‌ ల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అటు అమెరికా,ఇటు ఐరోపా దళాలు కీలక సమావేశాలు నిర్వహించనున్నాయి. యద్ధాన్ని ముగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సౌదీ అరేబియాలో ఉక్రెయిన్‌ తో అమెరికా చర్చలకు సిద్ధమైంది. అమెరికా సాయాన్ని నిలిపివేసిన నేపథ్యంలో ఉక్రెయిన్‌ కు అండగా నిలిచేందుకు మాస్కోను నిలువరించేందుకు ఐరోపా దేశాలు సమావేశమవుతున్నాయి. 

Also Read:Rains: మండుతున్న ఎండల్లో వాతావరణశాఖ చల్లటి వార్త.. 3 రోజులపాటు వానలే..వానలు!

Also Read: Elan Musk: ఎక్స్‌ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్‌ దాడే అంటున్న మస్క్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

అమెరికా కలలు ఇంక కల్లలుగానే మిగిలిపోతాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఒకవైపు హెచ్ 1 వీసాల లాటరీ తగ్గించేశారు...మరోవైపు విద్యార్థి వీసాల మీ కూడా భారీగా కత్తెర వేస్తోంది. ఈసారి చాలా మంది విద్యార్థులకు వీసాలను తిరస్కరించింది. 

New Update
F1 Visa

F1 Visa

అమెరికాలో ఉన్నత విద్యకు బోలెడంత డిమాండ్ ఉంది. మన దేశం నుంచి దీని కోసం చాలా మంది వెళుతుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది.  అయితే కొంతకాలంగా విద్యార్థి వీసాల్లో బాగా కోత పడిపోతోంది.  కొత్తగా వచ్చే అప్లికేషన్లు చాలా మట్టుకు తిరస్కరణకు గురౌతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు చెందినవే ఎక్కువ ఉంటున్నాయని హైదరాబాద్ కన్సెల్టెన్సీలు చెబుతున్నాయి. యూఎస్ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు లభించినా..వీసాలు రావడం లేదని చెబుతున్నారు. 

ఏ చిన్న తప్పు ఉన్నా వదలడం లేదు..

అమెరికాలో ఆగస్టు- డిసెంబర్‌ సెమిస్టర్‌ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41 శాతం వీసా దరఖాస్తులను ఒప్పుకోలేదు. వాటికి కారణాలేంటనేది కూడా చెప్పడం లేదు. ఏ చిన్న పొపాటు ఉన్నా వదడలడం లేదు..అన్నీ పట్టి పట్టి చూస్తున్నారని చెబుతున్నారు. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదని...ట్రంప్ వచ్చాకనే ఇదంతా జరుగుతోంది అంటున్నారు. విద్యార్థులకు ఇచ్చేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఎఫ్ 1. దీనితో అక్కడ సెటిల్ అవడం కూడా కుదరదు. అయినా కూడా వీసాలను అనుమతించడం లేదు. 

అమెరికా చెబుతున్న లెక్కల ప్రకారం 2023-24 లో ఎఫ్‌-1 వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు రాగా.. ఇందులో 2.79 లక్షల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అంతకుముందు 2022-23లో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షల అప్లికేషన్లను నిరాకరించారు. దీనికి ప్రధాన కారణం చదువు అయిపోయినా కూడా విద్యార్థులు అమెరికాలోనే ఉండిపోవడం అని చెబుతున్నారు. ఇక్కడ చదువు అవ్వగానే.. ఇక్కడే ఉద్యోగం సంపాదించుకోవాలని విద్యార్థులు అనుకుంటారు. చదువుకు, ఉద్యోగానికి మధ్య గ్యాప్ వచ్చినా కూడా ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నారు. దీన్ని గమనించిన అమెరికా ప్రభుత్వం ఏకంగా వీసాలనే తిరస్కరిస్తోంది. మరోవైపు అమెరికాలో సీటు దొరకని స్టూడెంట్స్ అందరూ యూకే, జర్మనీలకు వెళ్ళిపోతున్నారు.

 today-latest-news-in-telugu | usa | student-visa 

Also Read: సుంకాల పేరుతో ప్రపంచంపై ట్రంప్ ట్రేడ్ వార్.. ఎవరికెంత నష్టం! 

 

Advertisment
Advertisment
Advertisment