USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి

యెమెన్ లోని ముఖ్య నగరాలైన హోడెదా, మారిబ్, సాదాలపై అమెరికా వైమానిక దాడులు చేస్తోంది. అక్కడి ఎయర్ పోర్ట్, ఓడరేవుల లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. దీని వలన భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 

author-image
By Manogna alamuru
New Update
yemen

USA Attacks Yemen

ఇజ్రాయెల్, హమాస్, ఇరాన్ ల మధ్య యుద్ధం ఇప్పుడు అమెరికాకు కూడా పాకింది. కొన్ని నెలలుగా యెమెన్ కు చెందిన హౌతీలు అమెరికాపై దాడులు చేస్తున్నారు. దీనికి ప్రతిగా ఇప్పుడు అగ్రరాజ్యం కూడా దాడులను మొదలుపెట్టింది. తాజాగా అమెరికా హౌతీలపై మరోసారి విరుచుకుపడింది. యెమెన్ లోని ముఖ్య నగరాలైన హోడెదా, మారిబ్, సాదాలపై అమెరికా వైమానిక దాడులు చేస్తోంది. అక్కడి ఎయర్ పోర్ట్, ఓడరేవుల లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. దీని వలన భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.  హౌతీలపై ట్రంప్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోంది. 

ఇంతకు ముందు కూడా..

అంతకు ముందు ఇదే నెలలో కొన్ని రోజుల క్రితం కూడా అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం యెమెన్‌లో ఉన్న హౌతీలను లక్ష్యంగా చేసుకొని సైనిక చర్యకు దిగింది. యెమెన్ రాజధాని అయిన సనాతో పాటు సదా, అల్‌ బైదా, రాడాలే ప్రాంతాలపై దాడులు చేశాయి. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 31 మందికి పైగా మృతి చెందారు. మరో 101 మంది గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని హౌతీ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు అమెరికా నౌకలు, విమానాలపై హౌతీలు దాడులు చేస్తే సహించేది లేదని యూఎస్‌ సెంట్రల్ కమాండ్‌ తేల్చిచెప్పింది. అయితే అమెరికా చేసిన దాడులను హౌతీ పొలిటికల్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. దీన్ని యుద్ధ నేరంగా అభివర్ణించింది. అంతేకాదు యెమెన్ దళాలు అమెరికాతో ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ వార్నింగ్ ఇచ్చింది. 

today-latest-news-in-telugu | usa | yemen | attacks

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

అమెరికా కలలు ఇంక కల్లలుగానే మిగిలిపోతాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఒకవైపు హెచ్ 1 వీసాల లాటరీ తగ్గించేశారు...మరోవైపు విద్యార్థి వీసాల మీ కూడా భారీగా కత్తెర వేస్తోంది. ఈసారి చాలా మంది విద్యార్థులకు వీసాలను తిరస్కరించింది. 

New Update
F1 Visa

F1 Visa

అమెరికాలో ఉన్నత విద్యకు బోలెడంత డిమాండ్ ఉంది. మన దేశం నుంచి దీని కోసం చాలా మంది వెళుతుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది.  అయితే కొంతకాలంగా విద్యార్థి వీసాల్లో బాగా కోత పడిపోతోంది.  కొత్తగా వచ్చే అప్లికేషన్లు చాలా మట్టుకు తిరస్కరణకు గురౌతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు చెందినవే ఎక్కువ ఉంటున్నాయని హైదరాబాద్ కన్సెల్టెన్సీలు చెబుతున్నాయి. యూఎస్ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు లభించినా..వీసాలు రావడం లేదని చెబుతున్నారు. 

ఏ చిన్న తప్పు ఉన్నా వదలడం లేదు..

అమెరికాలో ఆగస్టు- డిసెంబర్‌ సెమిస్టర్‌ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41 శాతం వీసా దరఖాస్తులను ఒప్పుకోలేదు. వాటికి కారణాలేంటనేది కూడా చెప్పడం లేదు. ఏ చిన్న పొపాటు ఉన్నా వదడలడం లేదు..అన్నీ పట్టి పట్టి చూస్తున్నారని చెబుతున్నారు. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదని...ట్రంప్ వచ్చాకనే ఇదంతా జరుగుతోంది అంటున్నారు. విద్యార్థులకు ఇచ్చేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఎఫ్ 1. దీనితో అక్కడ సెటిల్ అవడం కూడా కుదరదు. అయినా కూడా వీసాలను అనుమతించడం లేదు. 

అమెరికా చెబుతున్న లెక్కల ప్రకారం 2023-24 లో ఎఫ్‌-1 వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు రాగా.. ఇందులో 2.79 లక్షల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అంతకుముందు 2022-23లో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షల అప్లికేషన్లను నిరాకరించారు. దీనికి ప్రధాన కారణం చదువు అయిపోయినా కూడా విద్యార్థులు అమెరికాలోనే ఉండిపోవడం అని చెబుతున్నారు. ఇక్కడ చదువు అవ్వగానే.. ఇక్కడే ఉద్యోగం సంపాదించుకోవాలని విద్యార్థులు అనుకుంటారు. చదువుకు, ఉద్యోగానికి మధ్య గ్యాప్ వచ్చినా కూడా ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నారు. దీన్ని గమనించిన అమెరికా ప్రభుత్వం ఏకంగా వీసాలనే తిరస్కరిస్తోంది. మరోవైపు అమెరికాలో సీటు దొరకని స్టూడెంట్స్ అందరూ యూకే, జర్మనీలకు వెళ్ళిపోతున్నారు.

 today-latest-news-in-telugu | usa | student-visa 

Also Read: సుంకాల పేరుతో ప్రపంచంపై ట్రంప్ ట్రేడ్ వార్.. ఎవరికెంత నష్టం! 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు