Trump: టెస్లాపై దాడి చేస్తే 20 ఏళ్ల జైలు శిక్ష.. ట్రంప్‌ హెచ్చరిక

టెస్లా ఎలక్ట్రిక్ కార్ల సంస్థకు చెందిన ఆస్తులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. టెస్లాపై దాడులు చేసేవారికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.

New Update
Donald Trump and Elon Musk

Donald Trump and Elon Musk

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ల సంస్థకు చెందిన ఆస్తులు దాడులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. టెస్లాపై దాడులు చేసేవారికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఈ దాడులకు ప్రోత్సహిస్తున్న వారిపై కూడా జైలు శిక్ష తప్పదంటూ పోస్టు చేశారు. ఈ మధ్య చూసుకుంటే అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా టెస్లా షోరూమ‌లు, విద్యుత్ చార్జింగ్ స్టేషన్‌లు, కార్లపై దాడులు జరిగాయి. 

Also Read: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్‌!

వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ట్రంప్ దీనిపై స్పందించారు. ఈ దాడులకు పాల్పడేవారికి 20 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చారు. అయితే ఎలాన్ మస్క్‌ను డిఫార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ     (DOGE) విభాగం అధినేతగా ట్రంప్‌ నియమించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి టెస్లా సంస్థ ఆస్తులపై దాడులు పెరుగుతూ వస్తున్నాయి.  

Also Read: హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు బాధాకరం.. మైనర్ బాలిక ఇష్యూపై కేంద్రమంత్రి అసహనం!

ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలని మస్క్‌ సలహా మేరకు ట్రంప్‌ సర్కార్‌ చాలామంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తీవ్ర వివాదం చెలరేగింది. ట్రంప్‌తో పాటు ఎలాన్‌ మస్క్‌పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దీంతో ఉత్తర అమెరికాతో పాటు యూరప్‌లోని ఆయన కార్యాలయాలు, ఫ్యాక్టరీల ఎదుట నిరసనలు చేపట్టారు. మస్క్‌తో విభేధిస్తున్న కొంతమంది సనెటర్లు కూడా వాళ్లకి సపోర్ట్ చేశారు. తాము టెస్లా కార్లు అమ్మేస్తామని చెప్పారు.

Also Read: వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?

Also Read: విద్యార్థులకు శృంగార పాఠాలు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

 rtv-news

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

అగ్రరాజ్యం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. టారీఫ్ లకు సంబంధించి ట్రంప్ సర్కార్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా మినహా మిగతా అన్ని దేశాలపైనా టారీఫ్ లను 90 రోజుల పాటూ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

New Update
Donald Trump

Donald Trump

మొత్తానికి అమరికా ప్రభుత్వం దిగొచ్చింది. టారీఫ్ లపై ఇంచుమించు అన్ని దేశాలూ వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో వెనక్కు తగ్గడమే మంచిది అనుకున్నట్టుంది. మొత్తానికి టారీఫ్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఊరట కలిగించింది. దాదాపు వార రోజుల పాటూ ట్రంప్ టారీఫ్ లతో బెంబేలెత్తిపోయిన ప్రపంచం ఇప్పుడు కాస్త శాంతిస్తుంది. అమెరికా అధ్యక్షుడు మొదలెట్టిన ఈ వాణిజ్య యుద్ధంతో ప్రపంచ మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. షేర్ మార్కెట్ అయితే ఎన్నడూ చూడని విధంగా నష్టాలను చూసింది.  ఇప్పుడు ఈ 90 రోజుల నిలుపుదలతో అందరూ కాస్త ఊరట చెందుతారు.

చైనాకు మాత్రం లేదు..

అయితే ఈ 90 రోజుల నిలుపుదల చైనాకు మాత్రం వర్తించదని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య మరింత ముదిరినట్టయింది.  ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాపై యూఎస్ సుకాలు పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఒక్కరోజు తేడాలోనే చైనాపై యూఎస్‌ మరోసారి సుంకాలు పెంచింది. 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా కూడ తగ్గేదే లే అన్నట్టు ప్రవర్తిస్తోంది. అంతకుముందు అమెరికాకు ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి డ్రాగన్‌పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 

today-latest-news-in-telugu | usa | donald trump tariffs

Also Read: GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

Advertisment
Advertisment
Advertisment