/rtv/media/media_files/2025/01/25/Nx9L9CgT2sn5FOrhIrev.jpg)
Gulf Of Mexico
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కార్యవర్గం పనులు జోరుగా చేస్తున్నారు. వరుసపెట్టి ఆర్డర్లను పాస్ చేస్తున్నారు. ఇప్పటికే అక్రమ వలసలపై అరెస్ట్ లు చేయడం, ఇతర దేశాల వారిని వెనక్కు పంపించడం లాంటివి ఒక పక్క జరిగిపోతున్నాయి. మరోవైపు అమెరికా సమూలంగా మార్పులను చేస్తున్నారు. తాజాగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికా మారినట్లు వైట్ హౌస్ కార్యవర్గం ప్రకటించింది. దాంతో పాటూ అలస్కన్ శిఖరం డెనాలిని పేరును కూడా మౌంట్ మెకిన్లీగా మార్చారు. ఈ పేరు మార్పులతో అగ్రరాజ్యం అసాధారణ వారసత్వం నిలుస్తుందని..గల్ష్ ఆఫ్ అమెరికా చరిత్రను భవిష్యత్తులో అందరూ జరుపుకుంటారని ట్రంప్ కార్యవర్గం తెలిపింది. అయితే ట్రంప్ ఆదేశాల ప్రకారం జియోలాజికల్ సర్వే పేరును మార్చిన్పటికీ అంతర్జాతీయంగా ఇది సాధ్యం కాదని తెలుస్తోంది.
Also Read: Cinema: సీజ్ ద లయన్ అంటున్న రాజమౌళి..ఎస్ఎస్ఎమ్బీ29 షూటింగ్ మొదలైనట్టేనా?
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ఇది ఒకటి..
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును మారుస్తానని ట్రంప్ చాలాసార్లు చెప్పారు. అన్నట్టుగానే పదవిని స్వీకరించిన వెంటనే గల్ఫ్ ఆఫ్ అమెరికా గా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ, శక్తిమంతమైన దేశంగా దాని స్థానాన్ని అది పొందిందని చెప్పారు. అయితే మెక్సికో గవర్నమెంట్ కు ఇది ఇష్టం లేదు. 1607 నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ఆ పేరుతో పిలుస్తున్నారని ఆమె ఛెప్పారు. ఉత్తర అమెరికాలో దాదాపు ఆరు లక్షల చదరపు మైళ్ల సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా వ్యవహరిస్తారు. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద జలవనరుల్లో ఇది తొమ్మిదవ స్థానంలో ఉంది. అమెరికాలో వినియోగించే సగానికి పైగా శుద్ధి చేసిన గ్యాస్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. అమెరికాలో వినియోగించే 40 శాతం మత్స్య సంపద ఇక్కడే దొరుకుతుంది.
Also Read: HYD: బంజారాహిల్స్ లో అదుపు తప్పిన కారు..ఒకరు మృతి
India-China: ట్రంప్ టారిఫ్ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు
ట్రంప్ టారిఫ్ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వెల్లడించారు.
Jai shankar
ట్రంప్ టారిఫ్ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్-చైనా సంబంధాలు మాత్రం బలపడే దిశగా వెళ్తున్నాయి. తాజాగా ఇరుదేశాల సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఆ సంబంధాలు సానుకూల దిశ వైపు పయనిస్తున్నాయన్నారు. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని.. వీటిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉందని అన్నారు.
Also Read: ట్రంప్ టారిఫ్లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్గాంధీ ఫైర్
ఇదిలాఉండగా 202-0 లో తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్-చైనా మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. అనంతరం సైనిక, దౌత్యపరంగా చర్చలు జరగడం, గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇరుదేశాలకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు .
Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
ఇటీవల చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 108 శాతం టారిఫ్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా చైనా కూడా అమెరికాపై 84 శాతం సుంకాలు విధించింది. దీంతో ట్రేడ్ వార్ మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ టారిఫ్ల స్పందించారు. అమెరికా టారిఫ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలన్నారు. పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం సంబంధాలు ఆధాపడి ఉన్నాయన్నారు. అమెరికా విధించిన టారిఫ్ల వల్ల అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అభివృద్ధి పొందే హక్కును కోల్పోతున్నాయని చెప్పారు. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన ఇరు దేశాలు కలిసి ఎదుర్కోవాలన్నారు.
Also read: Viral video: రన్నింగ్ ట్రైన్ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్
telugu-news | rtv-news
ఏపీకి గుడ్న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Thatikonda vs Kadiyam : కడియం టాల్ లీడర్ కాదు, ఫాల్ లీడర్...మాజీ మంత్రి రాజయ్య సంచలనవ్యాఖ్యలు
Union Minister Grand Daughter Shot Dead : బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య
Hit 3 Movie Second Song: అర్జున్ సర్కార్ కొత్త సాంగ్ ఊరమాస్.. ‘హిట్ 3’ సెకండ్ సింగిల్ కెవ్ కేక
Air India flight: విమానంలో పక్క ప్యాసింజర్పై మూత్రం పోసిన వ్యక్తి