Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్‌ కు ఎంత శాతం విధించారంటే..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాల పై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అర్థరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.భారత్‌ పై తాము 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

author-image
By Bhavana
New Update
Trump- Modi

Trump- Modi

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాల పై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అర్థరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. వైట్‌ హౌస్‌ లోని రోజ్‌ గార్డెన్‌ లో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ లో ఈ విషయాలు వెల్లడించారు.ఈ రోజున ట్రంప్‌ లిబరేషన్‌ డే గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేబినెట్‌ సభ్యులతో పాటు స్టీల్‌,ఆటోమొబైల్‌ కార్మికులను ట్రంప్‌ ఆహ్వానించారు.

Also Read: Trump-Musk:డోజ్‌ నుంచి మస్క్‌ ఔట్‌..!

అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమ పై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు.ఆ దేశాల పై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్‌ లుగా ట్రంప్‌ పేర్కొన్నారు.ఇక భారత్‌ పై తాము 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

Also Read: Forbes Billionaires List: 2025లో ప్రపంచ కుబేరులు వీరే.. టాప్ 10 నుంచి మాయమైన ముఖేష్ అంబానీ

ఇక భారత ప్రధాని మోడీ గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు.తనకు మోడీ గొప్ప స్నేహితుడని,అయితే భారత్‌ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని తెలిపారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్ అన్నారు.ఇక చైనా పై 34 శాతం సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు.యూఎస్‌ కు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తుల పై కనీసం 10 శాతం టారిఫ్‌ లు విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 

ఈరోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది.అమెరికా ఇండస్ట్రీ ఈరోజు పునర్జన్మించినట్లు అయ్యింది.యూఎస్ మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండబోతుంది. అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారు.తమ టాక్స్‌ పేయర్లను గత 50 ఏళ్లుగా దోచుకున్నారు.ఇక అది జరగదు.

మా పై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాం.అమెరికాకు ఈరోజు నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం వచ్చింది. ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చింది. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయి.విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తాం.

అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయి. దీంతో అమెరికా స్వర్ణయుగమవుతుంది. దశాబ్దాలుగా వాణిజ్య అడ్డంకులను అమెరికా తొలగిస్తూ వచ్చింది. కానీ పలు దేశాలు అమెరికా ఉత్పత్తుల పై భారీ సుంకాలను విధిస్తూ వచ్చాయి. అనేక దేశాలు అమెరికా మేధో సంపత్తిని దొంగిలించాయి.

పలు దేశాలు అయితే అన్యాయమైన నియమాలను కూడా అవలంభించాయి.అమెరికా దిగుమతి చేసుకున్న మోటారు సైకిళ్ల పై 2.4 శాతం సుంకాలు విధించింది. ఇక థాయిలాండ్‌,ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్ర వాహనాల పై 60 శాతం ,భారత్‌ 70 శాతం ,వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తూ వచ్చాయి. 

ఈ క్రమంలో ట్రంప్ విధించి ప్రతీకార సుంకాలు..ఇలా ఉన్నాయి...

భారత్‌ -26 శాతం, చైనా 34 శాతం, ఈయూ 20 శాతం, తైవాన్‌ 32 శాతం,జపాన్‌ 24 శాతం,దక్షిణ కొరియా 25 శాతం,థాయిలాండ్‌ 36 శాతం,స్విట్జర్లాండ్‌ 31 శాతం, ఇండోనేషియా 32 శాతం,మలేషియా 24 శాతం, కంబోడియా 49 శాతం,యూకే 10 శాతం, సౌత్‌ఫ్రికా 30 శాతం,బ్రెజిల్‌ 10 శాతం, బంగ్లాదేశ్‌ 37శాతం,సింగపూర్‌ 10 శాతం,ఇజ్రాయెల్‌ 17 శాతం,పిలిఫ్ఫీన్స్‌ 17 శాతం,చిలి 10 శాతం, ఆస్ట్రేలియా 10 శాతం, పాకిస్తాన్‌ 29 శాతం, టర్కీ 10శాతం.శ్రీలంక 44 శాతం, కొలంబియా 10 శాతం గా ఉన్నాయి.

Also Read: Loan waiver: లివర్ రూ.90 వేలు, కిడ్నీ రూ.75వేలు.. అప్పు తీర్చలేక అవయవాలు అమ్మకోడానికి రైతు

Also Read:Again Earthquake in Myanmar : మయన్మార్ లో మరోమారు భూకంపం..ఈసారి నష్టం..

trump | bharat | trump tariffs | trump tariffs on india | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

అమెరికా కలలు ఇంక కల్లలుగానే మిగిలిపోతాయా అంటే అవుననే అనిపిస్తోంది. ఒకవైపు హెచ్ 1 వీసాల లాటరీ తగ్గించేశారు...మరోవైపు విద్యార్థి వీసాల మీ కూడా భారీగా కత్తెర వేస్తోంది. ఈసారి చాలా మంది విద్యార్థులకు వీసాలను తిరస్కరించింది. 

New Update
F1 Visa

F1 Visa

అమెరికాలో ఉన్నత విద్యకు బోలెడంత డిమాండ్ ఉంది. మన దేశం నుంచి దీని కోసం చాలా మంది వెళుతుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది.  అయితే కొంతకాలంగా విద్యార్థి వీసాల్లో బాగా కోత పడిపోతోంది.  కొత్తగా వచ్చే అప్లికేషన్లు చాలా మట్టుకు తిరస్కరణకు గురౌతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు చెందినవే ఎక్కువ ఉంటున్నాయని హైదరాబాద్ కన్సెల్టెన్సీలు చెబుతున్నాయి. యూఎస్ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు లభించినా..వీసాలు రావడం లేదని చెబుతున్నారు. 

ఏ చిన్న తప్పు ఉన్నా వదలడం లేదు..

అమెరికాలో ఆగస్టు- డిసెంబర్‌ సెమిస్టర్‌ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా వెళ్తుంటారు. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41 శాతం వీసా దరఖాస్తులను ఒప్పుకోలేదు. వాటికి కారణాలేంటనేది కూడా చెప్పడం లేదు. ఏ చిన్న పొపాటు ఉన్నా వదడలడం లేదు..అన్నీ పట్టి పట్టి చూస్తున్నారని చెబుతున్నారు. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదని...ట్రంప్ వచ్చాకనే ఇదంతా జరుగుతోంది అంటున్నారు. విద్యార్థులకు ఇచ్చేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఎఫ్ 1. దీనితో అక్కడ సెటిల్ అవడం కూడా కుదరదు. అయినా కూడా వీసాలను అనుమతించడం లేదు. 

అమెరికా చెబుతున్న లెక్కల ప్రకారం 2023-24 లో ఎఫ్‌-1 వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు రాగా.. ఇందులో 2.79 లక్షల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అంతకుముందు 2022-23లో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షల అప్లికేషన్లను నిరాకరించారు. దీనికి ప్రధాన కారణం చదువు అయిపోయినా కూడా విద్యార్థులు అమెరికాలోనే ఉండిపోవడం అని చెబుతున్నారు. ఇక్కడ చదువు అవ్వగానే.. ఇక్కడే ఉద్యోగం సంపాదించుకోవాలని విద్యార్థులు అనుకుంటారు. చదువుకు, ఉద్యోగానికి మధ్య గ్యాప్ వచ్చినా కూడా ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నారు. దీన్ని గమనించిన అమెరికా ప్రభుత్వం ఏకంగా వీసాలనే తిరస్కరిస్తోంది. మరోవైపు అమెరికాలో సీటు దొరకని స్టూడెంట్స్ అందరూ యూకే, జర్మనీలకు వెళ్ళిపోతున్నారు.

 today-latest-news-in-telugu | usa | student-visa 

Also Read: సుంకాల పేరుతో ప్రపంచంపై ట్రంప్ ట్రేడ్ వార్.. ఎవరికెంత నష్టం! 

 

Advertisment
Advertisment
Advertisment