terrorists attack: పాకిస్తాన్‌లో ఉగ్రదాడి.. 9 మంది సైనికులు మృతి

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని బన్ను కంటోన్మెంట్‌‌పై మంగళవారం ఉగ్రదాడి చేశారు. 9మంది చనిపోగా.. మరో 20మంది గాయపడ్డారు. ఇద్దరు సూసైడ్ బాంబర్లు అటాక్ చేశారు. పాక్ తాలిబన్లతో సంబంధం ఉన్న జైష్ ఉల్ ఫుర్సాన్ ఈ దాడికి పాల్పడిందని పాక్ ఆర్మీ అనుమానిస్తోంది.

New Update
Khyber Pakhtunkhwa

Khyber Pakhtunkhwa Photograph: (Khyber Pakhtunkhwa)

రంజాన్ మాసం ప్రారంభ వేళ పాకిస్తాన్‌లో సూసైడ్ బాంబర్ ఉగ్రదాడి కలకలం రేపింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని కంటోన్మెంట్ పోస్టు లక్ష్యంగా చేసుకొని మంగళవారం సాయంత్రం బ్లాస్ట్‌లు చేశారు. ఈ దాడికి పాల్పడింది పాక్ తాలిబన్లతో సంబంధం ఉన్న జైష్ ఉల్ ఫుర్సాన్ ఉందని పాకిస్తాన్ ఆర్మీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఐదుగురు టెర్రరిస్టులు ప్లాన్ ప్రకారం ఈ అటాక్ చేసినట్లు తెలుస్తోంది. తాలిబాన్ మద్దతుదారుడైన ఓ మతాధికారి హత్యకు గురైన కొన్ని రోజుల తర్వాత ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 28న అదే ప్రావిన్స్‌లోని ఒక సెమినరీలో శుక్రవారం ప్రార్థనల సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో తాలిబాన్ అనుకూల మతాధికారి హమీదుల్ హక్ హక్కానీ, నలుగురు సందర్శకులు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. 

Also read : Telangana Inter Exams : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు!

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బన్ను కంటోన్మెంట్‌లో మంగళవారం సాయంత్రం ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు పేలుడు పదార్థాలను పేల్చారు. తర్వాత కొందరు ఆయుధాలతో చొరబడి కాల్పులు చేశారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం.. దాడి చేసిన వారితో భద్రతా దళాలు జరిగిన ఘర్షణలో కనీసం తొమ్మిది మంది మరణించారు. 35 మంది గాయపడ్డారు. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ముగిసిన వెంటనే కంటోన్మెంట్ ఏరియాలో ఉగ్రవాదులు అటాక్ చేశారు. ఇటీవల తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ తో చేతులు కలిపిన ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్ ఫుర్సాన్ ఈ దాడికి పాల్పడిందని భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. సోషల్ మీడియాలో దాడికి సంబంధించిన పేలుడు దృశ్యాలు, దట్టమైన పొగ, కాల్పుల శబ్దాలుతో వీడియోలు షేర్ చేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

China: స్నేహం కావాలి..అమెరికా దెబ్బకు చైనాకు భారత్ గుర్తొచ్చింది..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలతో చైనాకు ఊపిరి ఆడడం లేదు. చైనా కూడా ఈ యుద్ధంలో తగ్గడం లేదు కానీ.. మిగతా దేశాల సపోర్ట్ కావాలని మాత్రం అనుకుంటోంది. భారత్‌ సహా పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. 

New Update
11

చైనాకు భారత్ పొరుగు దేశం. ఒకే సరిహద్దును పంచుకుంటున్న ఆసియా దేశాలు. కానీ ఆ దేశం ఎప్పుడు ఇండియా మీద కాలుదువ్వుతూనే ఉంటుంది. మన దేశంలో ప్రదేశాలను ఆక్రమించుకోడానిక, దాడి చేయడానికి అదను చూస్తూనే ఉటుది. ఎవరు ఎంత చెప్పినా వినలేదు. కానీ ఇప్పుడు మాత్రం భారత్ తో సమా పొరుగు దేశాతో వ్యాహాత్మక సంబంధలను పెంపొందించుకొంటామని అంటున్నారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. దీనికి కారణం అమెరికా కొట్టిన సుంకాల దెబ్బ. మిగతా ఏ దేశాలకు లేని విధంగా అత్యధిక టారీఫ్ లను చైనాపై విధించారు ట్రంప్. ఏకంగా 125 శాతం టారీఫ్ లతో విరుచుకుపడ్డారు. చైనా కూడా అమెరికా ధీటుగా జవాబిస్తోంది కానీ ఎక్కువ కాలం నిలబడలేకపోవచ్చును. ఇప్పుడు ఆ దేశానికి మిగతా దేశాల సపోర్ట్ చాలా అవసరం. అందులో భాగ్గానే జిన్ పింగ్ స్నేహం కావాలి అంటూ చిలక పలుకులు పలుకుతున్నారు. 

ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పని చేస్తాం..

తమ మధ్య అభిప్రాయ భేదాలు తగ్గించుకుని సరఫరా వ్యవస్థలను మరింత పెంపొందించుకునేదుకు ప్రయత్నిస్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెబుతున్నారు. పొరుగు దేశాలు ముఖ్యంగా భారత్ తో కలిసి పని చేస్తామని.. ఒక మంచి ఉమ్మడి సమాజాన్ని నిర్మిస్తామని అంటున్నారు. బీజింగ్‌లో మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు జరిగిన ఉన్నతస్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రధాని లీ కియాంగ్ కూడా దీనికి వత్తాసు పలికారు. అధ్యక్షుడు చెప్పినట్టుగా పొరుగు దేశాలతో వ్యవహారం అమలులో పెట్టాలని అన్నారు.  ఇందులో భాగంగా జిన్‌పింగ్‌ త్వరలో కీలక పొరుగు దేశాలైన వియత్నాం, మలేసియా, కాంబోడియాలలో సందర్శించే అవకాశముంది.

today-latest-news-in-telugu | china | india | usa | trump tariffs 

Also Read: Mary Kom: విడాకులు తీసుకోబోతున్న మేరీకోమ్?

 

Advertisment
Advertisment
Advertisment