USA: ఎక్కడికీ వెళ్లొద్దు..అమెరికాలో టెకీలకు కంపెనీలు వార్నింగ్

ట్రంప్ వచ్చిన తర్వాత అంతా తారుమారు అయిపోతున్నాయి. ఇమ్మిగ్రేషన్, వీసా పాలసీలు మారిపోయాయి.  ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం పట్టుకుంది. దీంతో అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీలు అన్నీ హెచ్ 1 బీ మీద చేస్తున్న ఉద్యోగులను ప్రయాణాలు చేయొద్దని చెబుతున్నాయి. 

New Update
USA Tourist Visa:యూఎస్ పర్యాటక వీసాదారులకు గుడ్‌న్యూస్..డ్రాప్ బాక్స్ సదుపాయం

H1B Visa

ప్రస్తుతం అమెరికాలో హెచ్ 1 బీ వీసాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడు ఏం కారణం చెప్పి వెళ్ళిపొమ్మంటారో తెలియక బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇమ్మిగ్రేషన్, వీసాల పాలసీలను ఎడాపెడా మార్చేస్తున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు ఏ కొత్త రూల్ పెడుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ ఉద్యోగులను హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హెచ్ 1 బీ వీసాలపై పని చేస్తున్న వారు అమెరికా వదిలి అంతర్జాతీయ ప్రయాణాలు చేయొద్దని చెబుతున్నారు. అమెరికాకు తిరిగి వచ్చే క్రమంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు స్ట్రిక్ట్ రూల్స్ చూపించి మళ్ళీ అనుమతించకపోవచ్చని అంటున్నారు. అందుకే టెక్ కంపెనీలు ఉద్యోగులకు ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేస్తున్నాయి. అమెరికాలోని ఆపిల్, గూగుల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు పైతలం ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చును. 

వరుసగా మార్పులు..

గత నెలలోనే వీసాలు, ఇమ్మిగ్రేషన్ రూల్స్  మారతాయని యూఎస్ విదేశాంగ మంత్రి రూబియో  చెప్పారు. ఈ రెండింటినీ విదేశీ వ్యవహారాల కిందకు తీసుకురావాలనుకుంటున్నామని అన్నారు. అదే అయితే కనుక వీసా నిబంధనల్లో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. అమెరికాలో పనిచేయాలని, చదువుకోవాలని, ఇక్కడ పర్యటించాలని అనుకొనే భారతీయులు భారీ మార్పులను చవిచూసే అవకాశం ఉంది. వీసా ఆమోదాలు, పునరుద్ధరణ విషయంలో యాజమాన్యాలు, ఉద్యోగస్తులు అంతరాయం ఎదుర్కొనే అవకాశం ఉందని రూబియో చెప్పారు. దీని వలన హెచ్‌-1బీ నిబంధనలు, ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియపై అనిశ్చితిని పెంచుతుందన్నారు. 

today-latest-news-in-telugu | usa | h1-b-visa | tech-companies

 

Also Read: AP: హైకోర్ట్ లో ఆర్జీవీకి ఊరట..తొందరపాటు చర్యలు వద్దు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

అగ్రరాజ్యం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. టారీఫ్ లకు సంబంధించి ట్రంప్ సర్కార్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా మినహా మిగతా అన్ని దేశాలపైనా టారీఫ్ లను 90 రోజుల పాటూ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

New Update
Donald Trump

Donald Trump

మొత్తానికి అమరికా ప్రభుత్వం దిగొచ్చింది. టారీఫ్ లపై ఇంచుమించు అన్ని దేశాలూ వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో వెనక్కు తగ్గడమే మంచిది అనుకున్నట్టుంది. మొత్తానికి టారీఫ్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఊరట కలిగించింది. దాదాపు వార రోజుల పాటూ ట్రంప్ టారీఫ్ లతో బెంబేలెత్తిపోయిన ప్రపంచం ఇప్పుడు కాస్త శాంతిస్తుంది. అమెరికా అధ్యక్షుడు మొదలెట్టిన ఈ వాణిజ్య యుద్ధంతో ప్రపంచ మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. షేర్ మార్కెట్ అయితే ఎన్నడూ చూడని విధంగా నష్టాలను చూసింది.  ఇప్పుడు ఈ 90 రోజుల నిలుపుదలతో అందరూ కాస్త ఊరట చెందుతారు.

చైనాకు మాత్రం లేదు..

అయితే ఈ 90 రోజుల నిలుపుదల చైనాకు మాత్రం వర్తించదని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య మరింత ముదిరినట్టయింది.  ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాపై యూఎస్ సుకాలు పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఒక్కరోజు తేడాలోనే చైనాపై యూఎస్‌ మరోసారి సుంకాలు పెంచింది. 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా కూడ తగ్గేదే లే అన్నట్టు ప్రవర్తిస్తోంది. అంతకుముందు అమెరికాకు ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి డ్రాగన్‌పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 

today-latest-news-in-telugu | usa | donald trump tariffs

Also Read: GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

Advertisment
Advertisment
Advertisment