Bangladesh: బంగ్లాదేశ్‌ లో మీడియాకి వదంతుల పండగ..యూనస్‌ సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరగబోతున్నట్లు పలు మీడియాల్లో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.వీటిని ఇప్పటికే ఆ దేశ సైన్యం ఖండించింది.

New Update
Bangladesh:

yunas

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరగబోతున్నట్లు పలు మీడియాల్లో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.వీటిని ఇప్పటికే ఆ దేశ సైన్యం ఖండించింది. తాజాగా యూనస్ సైతం దీని పై స్పందించారు. బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీడియాలో వందతుల పండగ జరుగుతున్నట్లు ఆయన విమర్శించారు.

Also Read: Sajjanar: ఉన్నది ఒక్కటే జీవితం అంటూ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి తప్పుడు వార్తలు ఇంకా పెరుగుతాయన్నారు. బంగ్లాలో 53వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యూనస్‌ ఓ టెలివిజన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యలో మాట్లాడారు. గతేడాది జులై-ఆగస్టుల్లో తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఓడిపోయిన వారు ఈ వదంతులను సాధనాలుగా మార్చుకుంటున్నారు.ఈ తప్పుడు కథనాల వెనుక ఎవరు ఉన్నారు,ఎవరు వీటిని నడిపిస్తున్నారనేది మీ అందరికీ తెలుసు. 

Also Read: Digital Frauds: డిజిటల్ మోసాలు...లక్షల సిమ్‌ కార్డులు,వేల వాట్సాప్‌ ఖాతాలు బ్లాక్‌ చేసిన కేంద్రం!

Rumors Fest About Yunus Government

వీటిని వ్యాప్తి చేసేందుకు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తూ 24 గంటలూ ఇదే పని మీద ఉన్నారు.మనందరి ఐక్యత వారిని కల్లోలానికి గురి చేస్తుంది. దీన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. వారి వినూత్నమైన ఆటలకు ఎప్పుడు పావుగా మారతారో మీకే తెలీదు.మనం యుద్ధ పరిస్థితుల్లో ఉన్నామని గుర్తుంచుకోండి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వదంతులు మరింత పెరిగిపోతయాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నా అని యూనస్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెర్రస్‌ దీని పై తమకు హామీ ఇచ్చారన్నారు. రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో గతేడాది ఆగస్టులో హసీనా దేశం విడిచిపారిపోయిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి భారత్‌ లో ఆమె తలదాచుకుంటున్నారు. అనంతరం యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.తాజాగా ఆయనకు వ్యతిరేకంగా దేశంలో తిరుగుబాబు చెలరేగే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.దీంతో అక్కడి ఆర్మీ అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారనేది వాటిల్లోని సారాంశం. అయితే వీటిని బంగ్లా సైన్యం ఖండించింది. ఆ కథనాలు వార్త పాత్రికేయ దుష్ప్రవర్తనకు నిదర్శనమని బంగ్లాదేశ్‌ సైనిక ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read:PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?

Also Read: AP NEWS: షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్.. ఎందుకంటే?

 

bangladesh | haseena | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇన్నాళ్లూ వారందరినీ పట్టుకుని.. తిరిగి వారి దేశాలకు యూఎస్‌ పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ వెళ్లకుండా పట్టుబడితో.. రోజుకు రూ.86 వేల జరిమానా విధిస్తామని డీహెచ్‌ఎస్‌ చెప్పింది.

New Update
America migrants

America migrants

అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వలసదారులపై ట్రంప్ యంత్రాంగం మరింత కఠినమైన చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే వారిపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కారు.. ఇప్పుడు మరింతగా వారిని వారి దేశాలకు పంపేందుకు సిద్ధమైంది. అక్రమ వలసదారులు తక్షణమే అమెరికా వీడి వెళ్లిపోవాలని లేకపోతే తీవ్రమైన చర్యలు తప్పవని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ నుంచి ఆదేశాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

వెళ్లకపోతే రోజుకు రూ.86 వేల జరిమానా విధిస్తామని, అది కూడా కట్టకపోతే వారు ఆస్తులను సైతం జప్తు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడే వారిని అమెరికా తిరిగి వారి దేశాలకు పంపిచేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నదే అయినా.. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనిని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. అక్రమ వలసదారులపై చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. 

Also Read: Musk-Trump: ఆయనో మూర్ఖుడు..ట్రంప్‌ సలహాదారుడి పై మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

ట్రంప్ ఆదేశాలతో అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్‌ను కూడా తీసుకువచ్చింది అమెరికా. ఈ యాప్ ద్వారా పేరు నమోదు చేసుకుని ఎవరికివారు స్వయంగా దేశం వీడి వెళ్లిపోయే వెసులుబాటు ఉంటుంది.అలా కాకుండా అధికారులు గుర్తిస్తే తమ పద్ధతుల్లో అక్రమ వలదారులను వెనక్కి పంపించాల్సి ఉంటుందని, ఇతర చర్యలు తీసుకుంటామని డీహెచ్ఎస్ అధికార ప్రతినిధి ట్రిసియా మెక్‌లాలిన్ మీడియాతో పేర్కొన్నారు. తుది ఆదేశాలు అందుకున్న తర్వాత కూడా దేశం వీడిపోకుంటే భారీ జరిమానా తప్పదని హెచ్చరించారు. 

ముఖ్యంగా సెల్ఫ్ డిపోర్టేషన్‌కు సంబంధించి హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం మార్చి 31న సోషల్ మీడియా వేదికగా కీలక సమాచారాన్ని పంచుకుంది. తమ తనిఖీల్లో పట్టుబడితే క్రమబద్ధీకరణకు ఎటువంటి అవకాశం ఉండబోదని, సంపాదించుకున్న డబ్బును కూడా నష్టపోవాల్సి వస్తుందని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

బహిష్కరణ ఆదేశాలు అందుకున్న తర్వాత వెళ్లిపోకపోతే రోజుకు 998 డాలర్లు జరిమానా, సెల్ఫ్ డిపోర్ట్ యాప్‌లో నమోదు చేసుకున్న తర్వాత వెళ్లపోకపోతే రోజూ 1000- 5 వేల డాలర్లు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో అమెరికాకు తిరిగి వచ్చే అవకాశం కూడా కోల్పోతారని పేర్కొంది.

డొనాల్డ్ ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఈ జరిమానాలకు సంబంధించి 1996లో తీసుకువచ్చిన చట్టాన్ని అప్పుడు తొలిసారి అమలు చేస్తున్నారు. 9 మంది అక్రమ వలసదారులపై జరిమానా విధించినప్పటికీ, అందులో కొందరిపై ఉపసంహరించుకున్నారు. ట్రంప్ తర్వాత బైడెన్ వచ్చాక జరిమానాలు విధించడాన్ని నిలిపివేశారు. అక్రమ వలసదారుల్లో భయాన్ని కలిగించేందుకు ఈ జరిమానాలను తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

Also Read: Ap weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం...ఏపీలో వర్షాలు..

Also Read: Canada: కెనడా రాజకీయాల్లో కొత్త ట్రెండ్

america | migrants | illeagal-migrants | illegal immigrants america | Indian illegal immigrants | america illegal immigrants news | Immigrants | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment