Earth Quake: మయన్మార్, థాయ్ లాండ్ లలో 700 దాటిన మృతుల సంఖ్య

భారీ భూకంపం మయన్మార్, థాయ్ లాండ్లను అతలాకుతలం చేసింది.  ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 700 మంది చనిపోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

New Update
international

Mynmar Earth Quake

మయన్మార్, థాయ్ లాండ్ లలో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రకంపనల విధ్వంసానికి రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 700 దాటింది. ఒక్క మయన్మార్ లోనే 690కు పైగా మరణించినట్లు తెలుస్తోంది. బ్యాంకాక్ లో ఇప్పటివరకు 10 మంది చనిపోగా..ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. ఈ భారీ భూకంపం ధాటికి మొత్తంగా మృతుల సంఖ్య 10 వేలు దాకా అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ చెబుతోంది. ప్రాణ నష్టం అత్యధికంగా మయన్మార్‌లోని మాండలే నగరంలో జరిగిందని తెలుస్తోంది.  రెండు భూకంపాల కేంద్ర స్థానాలూ మాండలే నగరానికి సమీపంలోనే ఉన్నాయి. 

అతి పెద్ద భూకంపాలలో ఒకటి..

మయన్మార్ లో భూకంపం అక్కడి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసేసింది. ఒక్కసారిగా మీద వచ్చి పడిన విపత్తుతో జనం చెల్లాచెదురు అయిపోయారు. వందల్లో ప్రాణాలు పోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మయన్మార్, బ్యాంకాక్ తో సహా చైనా, భారత్, వియత్నాం మరికొన్ని తూర్పు ఆసియా దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్ పై 7.7, 6.4 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది. అన్నిటి కంటే ఎక్కువగా థాయ్ లాండ్, మయన్మార్ దేశాలు ప్రభావితం అయ్యాయి. భారీగా ఇక్కడ భవనాలు నేలమట్టం అయ్యాయి. ఇక్కడ ఒక్కచోటే దాదాపుగా 694 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలుస్తోంది. మరో 1600 మంది తీవ్రంగా గాయపడ్డారు.  ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇళ్ళఉ, భవనాలు కూలిపోవడంతో చాలా మంది నిరాశ్రయులు అయ్యారు. 

 

today-latest-news-in-telugu | earth-quake | dead

Also Read: Kolkata: కోలకత్తా జూ.డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరగలేదు..సీబీఐ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Fire Accident in america : అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పది మంది తెలుగు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. శనివారం సాయంత్రం 6.20 గంటల సమయంలో బర్మింగ్‌హామ్‌లోని కెల్లామ్‌ స్ట్రీట్‌లో ఉన్న రెండు అపార్టుమెంటుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

New Update
Fire Accident  in america

Fire Accident in america

Fire Accident  in america : అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పది మంది తెలుగు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. శనివారం సాయంత్రం 6.20 గంటల సమయంలో బర్మింగ్‌హామ్‌లోని కెల్లామ్‌ స్ట్రీట్‌లో ఉన్న రెండు అపార్టుమెంటుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బిల్డింగ్‌ మొత్తానికి వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అపార్టుమెంట్లలో ఉన్న పది మంది విద్యార్థులను రక్షించారు. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో దవాఖానకు తరలించారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

Also Read: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్!

బాధితులంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులని పేర్కొన్నాయి. వారు అలబామా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారని తెలిపాయి. అపార్టుమెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయని వెల్లడించాయి. శనివారం సాయంత్రం 6.20 గంటలకు బిల్డింగ్‌లో మంటలు వ్యాపించాయని బాధితుల్లో ఒకరు ఇన్‌స్టా పోస్టు ద్వారా వెల్లడించారు.

Also Read: ఫస్ట్ నైట్‌లో వధువు వింత కండీషన్.. గజగజ వణికిపోయిన వరుడు!

మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, వేగంగా అపార్టుమెంట్‌ మొత్తం వ్యాపించాయని తెలిపారు. అందరం వెనుక డోర్‌ నుంచి బయటకు వచ్చేశామని, కానీ ఒకరు మాత్రం పొగలు దట్టంగా అలముకోవడంతో అందులో చిక్కుకుపోయాడని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగానే ఉన్నదని అందులో తెలిపారు. అగ్నిప్రమాదం నుంచి తాము బయటపడటం చాలా గొప్పవిషయమని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు