విశ్వంలో భూమికి ప్రమాదం పుట్టుకొచ్చింది. స్పేస్లో లైఫ్ టైం అయిపోయిన నక్షత్రాలు బ్లాక్ హోల్స్గా మారుతాయి. వీటినే కృష్ణ బిలాలు అంటారు. సూర్యుని కంటే పెద్దగా ఉన్న ఓ బ్లాక్ హోల్ ఇప్పుడు భూమి వైపుకు దూసుకొస్తుంది. ఖగోళ శాస్త్రవేత్తలు దానికి J0410-0139 అని పేరు పెట్టారు. విశ్వంలో కాలం చెల్లిన నక్షత్రాలు వాటి కాంతిని కోల్పోయి అడ్డదిడ్డంగా ప్రయాణిస్తుంటాయి.
Also Read: Planet Parade: ఫిబ్రవరి 28న ఆకాశంలో అద్భుతం..ఒకే లైన్ లోకి 7 గ్రహాలు!
J0410-0139 కూడా అంతరిక్షంలో అలాగే తిరుగుతూ.. ఎర్త్ టార్గెట్గా భూగ్రహం వైపే వస్తోంది. ఆ బ్లాక్హోల్ దాదాపు 700 మిలియన్ సూర్యుని ద్రవ్యరాశిని కలిగి ఉందని సైంటిస్తులు కనుగొన్నారు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు చూసిన బ్లాక్ హోల్లో ఇదే అతి పూరతమైనదని చెబుతున్నారు. NASAలోని చంద్ర అబ్జర్వేటరీ, చిలీలోని వెరీ లార్జ్ టెలిస్కోప్తో J0410-0139ని గుర్తించారు. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు టెలిస్కోప్ సాయంతో డేటాను సేకరిస్తు్న్న సైంటిస్టులు ఇది చాలా శక్తివంతమైనదని చెబుతున్నారు.
Also Read: Russia: పోలాండ్ సరిహద్దుల్లో రష్యా భీకర దాడి..
భూమి ఎలా పుట్టిందో చెప్పే థియరీని బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటారు. భూమి పుట్టిన 100 మిలియన్ సంవత్సరాల తర్వాత బ్లాక్హోల్ ప్రయాణం ప్రారంభమైంది. ఇది శరవేగంగా కదులుతూ భూమివైపుకు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఈ బ్లాక్ హోల్(కృష్ణబిలం) భూమి నుంచి 12.9 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. విశ్వంలో దూరాన్ని కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు. ఒక లైట్ ఈయర్ అంటే 5.88 ట్రిలియన్ మైల్స్ లేదా 9.46 ట్రిలియన్ కిలో మీటర్లు. విశ్వంలో కాంతి 670,616,629 మైల్స్ పర్ అవర్ లేదా 1,079,252,849 కిలో మీటర్లు పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి సంవత్సరం దూరాన్ని కనుగొనడానికి ఈ వేగాన్ని సంవత్సరంలోని గంటల సంఖ్యతో గుణించాలి.
Also Read: USA: ఆ లోపు వచ్చేయండి.. హెచ్1–బి వీసాదారులకు కంపెనీల సూచన