Gautam Adani Case: అదానీ కేసు గురించి అడిగిన అమెరికా మీడియా.. ప్రధాని మోదీ షాకింగ్ రియాక్షన్

అదానీ గ్రూప్‌పై అమెరికాలో కేసు నమోదు కావడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీని అమెరికా విలేకర్లు ప్రశ్నలు అడిగారు. దీనికి ఆయన తనదైన శైలీలో స్పందించారు. వ్యక్తిగత స్థాయి అంశాలు దేశాధినేతలు చర్చించరని చెప్పారు.

New Update
PM Modi’s response to question on Gautam Adani bribery case in US

PM Modi’s response to question on Gautam Adani bribery case in US

Gautam Adani Case: ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం అదానీ గ్రూప్‌పై అమెరికాలో కేసు నమోదు కావడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రధాని మోదీ - ట్రంప్ భేటీ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చిందా అనేదానికి ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే అక్కడి మీడియా వాళ్లు మోదీని దీనిపై ప్రశ్నించారు. దీనికి ప్రధాని తనదైన శైలీలో స్పందించారు. వ్యక్తిగత స్థాయి అంశాలు చర్చించరని చెప్పారు.  

'' భారత్ ప్రజాస్వామ్య దేశం. మా సంస్కృతి వసుదైక కుటుంబం. ప్రపంచం అంతా మా కుటుంబంగా భావిస్తాం. ప్రతి భారతీయుడిని మా వాడిగానే అనుకుంటాం. ఇద్దరు దేశాధినేతలు ఎప్పుడూ కూడా వ్యక్తిగత స్థాయి అంశాలను చర్చించరు'' అని ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. అంతేకాదు అదానీపై జో బైడెన్‌ కార్యవర్గ వైఖరిని తప్పుబడుతూ ఆరుగురు అమెరికా చట్టసభ సభ్యులు అటార్నీ జనరల్ పామ్‌ బోండికి లేఖలు కూడా రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also Read: న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకుకు బిగ్ షాక్.. కార్యకలాపాలు నిషేధించిన ఆర్బీఐ

అయితే అమెరికాలో ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానంపై విపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని తన స్నేహితుడిని కాపాడుకుంటున్నారని ఎక్స్‌ వేదికగా విమర్శించారు. '' దేశంలో ప్రశ్నలు అడిగితే మౌనం, విదేశాల్లో అడిగితే మాత్రం అది వ్యక్తిగత విషయం. అమెరికాలో మోదీ అదానీ చేసిన అవినీతిని దాస్తున్నారు. మిత్రుడి జేబు నింపడం మోదీకి జాతి నిర్మాణం అవుతుంది. లంచాలు ఇవ్వడం, జాతి సంపందను దోచుకోవడం వ్యక్తిగత అంశాలుగా మారిపోతాయని'' రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. 

ఇదిలాఉండగా.. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించేలా అధిక ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసే ఏపీ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎఫ్‌సీపీఏ కింద అమెరికాలో పలువురిపై కేసు నమోదైంది. ఆ నిధులను అమెరికాలో పెట్టుబడి కింద అదానీ గ్రూప్‌ సమీకరించింది. దీంతో అదానీ గ్రూప్‌పై కూడా కేసు నమోదు కావడం అప్పట్లో దుమారం రేపింది. 

Also Read: ఫాస్టాగ్‌ యూజర్లకు అలర్ట్‌..ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్‌!

సౌర విద్యుత్‌ విక్రయ కాంట్రాక్టులో అనుకూల షరతులను అమలుచేసేందుకు అదానీ గ్రూప్  250 మిలియన్ డాలర్లు (రూ.2029 కోట్లు) లంచాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. అయితే విదేశీ సంస్థలపై చర్యలు తీసుకునే 1977 ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్‌ యాక్ట్ (FCPA) అమలను ట్రంప్ అధికారంలోకి వచ్చాక నిలిపివేశారు. దీంతో ఈ కేసులో అదానీ గ్రూప్‌ను భారీ ఊరట కలిగింది. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

US Student Visa: అమెరికాలో మనోళ్లు సేఫ్.. ట్రంప్ సర్కార్ బంపర్ ఆఫర్

అమెరికాలో వీసాలు రద్దయిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల లీగల్‌ హోదాను తిరిగి పునరుద్ధరించింది. కోర్టుల ఆదేశాలతో ట్రంప్ సర్కారు వెనక్కి తగ్గింది. ఇందులో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారు.

New Update
us student visa restoration

us student visa restoration

US Student Visa: అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన విదేశీ విద్యార్థులకు ఒక శుభవార్త. ఇటీవల వీసాలు రద్దైన సంగతి అందరికి తెలిసిందే, అయితే దేశబహిష్కరణ ముప్పు ఎదుర్కొన్న దాదాపు 1200 మందికి పైగా విద్యార్థులకు వారి చట్టబద్ధ హోదాను మళ్లీ కల్పిస్తూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న పూర్వపు కఠిన నిర్ణయం పై ఇప్పుడు వెనక్కి తగ్గింది.

Also Read: BIG BREAKING: ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ.. పాక్ సంచలన డిమాండ్!

ఇప్పటి వరకు అక్రమ వలసదారులపై గట్టి చర్యలు తీసుకుంటూ వచ్చిన ట్రంప్ సర్కారు, విదేశీ విద్యార్థుల విషయంలో కూడా అదే రకమైన వైఖరిని చూపింది. వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విద్యార్థుల వీసాలు, లీగల్ స్టేటస్‌ను రద్దు చేసింది. దీనివల్ల అనేక మంది విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కొంతమంది ఇప్పటికే అమెరికాను వదిలి వెళ్లిపోయారు, మరికొంత మంది గుట్టుచప్పుడు కాకుండా ఉన్నారు. ఇంకొంత మంది అక్కడ చదువుకోలేని   పరిస్థితిలో ఉండిపోయారు.

Also Read: BIG BREAKING: కశ్మీర్ సమస్యపై స్పందించిన ట్రంప్

విద్యార్థుల వీసాలు(US Student Visa) రద్దు చేయకూడదు..

ఈ పరిణామాల మధ్య, బాధిత విద్యార్థులు న్యాయ పోరాటం చేసి  కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేసిన కోర్టులు అమెరికా ప్రభుత్వాన్ని విద్యార్థుల వీసాలు రద్దు చేయకూడదు అంటూ ఆదేశించాయి. దీని ప్రకారం, యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) తాత్కాలికంగా విద్యార్థుల లీగల్ స్టేటస్‌ను పునరుద్ధరించింది.

Also Read: BIG BREAKING: పాక్ కి భారీ షాక్‌..10 మంది సైనికులు హతం!

ఇక సాధారణంగా ఎవరైనా విద్యార్థి వీసా కోల్పోతే, వారి వివరాలు SEVIS (Student and Exchange Visitor Information System) డేటాబేస్ నుండి తొలిగిస్తారు. అయితే తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో, ముందు తొలగించిన రికార్డులను తిరిగి యాక్టివేట్ చేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వ న్యాయవాదులు వెల్లడించారు. 

ఈ విద్యార్థులలో కొంతమంది భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా చిన్నచిన్న కారణాలు, ఉదాహరణకు ట్రాఫిక్ ఉల్లంఘనలు లాంటి వాటికే  వీసాలు రద్దయినట్లు అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ పేర్కొంది. తాజా నిర్ణయం ద్వారా వారికి కొంత ఉపశమనం లభించినట్లైంది.

Also Read: Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?

అయితే, ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు విద్యార్థులు తమ హోదా పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ నిర్ణయాలను గమనిస్తూ ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వ న్యాయవాదులు తెలుపుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment