ఫుల్ ఫోర్స్‌తో హెజ్బుల్లా మీద దాడి చేయండి..సైన్యానికి నెతన్యాహు ఆర్డర్

ఎవరేం చెప్పినా వినొద్దు...ఫుల్ ఫోర్స్‌తో దాడి చేయండి...హెజ్బుల్లా నాశనమే మన లక్ష్యం మన అంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.  కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ దేశాలు ఇచ్చిన పిలుపును ఆయన పక్కన పెట్టేశారు. 

New Update
attacks

Israel Attacks: 

లెబనాన్ మీద ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హిజ్బుల్లా, వారి స్థావరాలే లక్ష్యంగా వరుసగా దాడులు చేస్తోంది. దక్షిణ లెబనాన్‌లో బీరుట్ ఇంకా మిగతా ప్రాంతాల్లో  ఇప్పటికే 2వేల హిజ్బుల్లా స్థావరాల మీద అటాక్ చేసింది ఇజ్రాయెల్ సైన్యం. దీని వలన కేవలం 5 రోజుల్లో 90 వేల మంది నిరాశ్రయులు అయ్యారని కూడా వార్తా కథనాలు వచ్చాయి.  మరోవైప 600 మంది చనిపోయారు...5 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు అని కూడా చెబుతున్నారు. ఒకటి మాత్రం కచ్చితం ఏంటంటే..లెననాన్‌లో పరిస్థితి రోజు రోజుకూ దిగాజారుతోంది.  ఇజ్రాయెల్ ఇలానే దాడులు చేస్తూ పోతే కొన్ని రోజులకు హిజ్బుల్లా సంగతి ఏమో కానీ లెబనానే మొత్తం కనిపించకుండా పోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

అయితే ఏం జరిగినా తాము మాత్రం తగ్గేదే లేదు అంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.  కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ దేశాలు పిలుపునిచ్చాయి. దీనిపై ఆయన కనీసం స్పందిచను కూడా స్పందిచలేదు. పైగా తన సైన్యానికి ఫుల్ ఫోర్స్‌తో దాడులు చేయమని ఆదేశాలు ఇచ్చారు. మిత్రదేశాలు చెప్పినట్టు 21 రోజులు కాల్పుల విరమణ చేస్తే హిజ్బుల్లా కోలుకునేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చెప్పారు ఇజ్రాయెల్ రెవెన్యూశాఖ మంత్రి స్మోట్రిచ్. 

ఇక మరోవైపు లెబనాన్ మీద భూతల దాడులకు సిద్ధం అవుతోంది ఇజ్రాయెల్. దక్షిణ లెబనాన్‌లో పౌరుల ఇళ్ళల్లో హెజ్‌బొల్లా తమ ఆయుధాలను దాచి పెట్టిందని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. 20 ఏళ్లుగా లెబనాన్‌లో హెజ్‌బొల్లా తన నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించుకుందని..ముఖ్యంగా దక్షిణ లెబనాన్‌ వారికి ఆయుధాల అడ్డాగా మారిందని అంటోంది. ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ఆ ప్రాంతాన్ని వారు లాంచ్‌ ప్యాడ్‌లా మలుచుకున్నారు. అందుకే అక్కడ దాడులకు పాల్పడుతున్నామని తెలిపింది. అయితే తాము స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించడం లేదని...మేము ముందే పక్కాగా రెక్కీచేసి కేవలం హెజ్బుల్లా స్థావరాల మీదనే అటాక్ చేస్తున్నామని ఐడీఎప్ చెబుతోంది. ఇప్పటికే వందలాది స్థావరాలను ధ్వంసం చేశామని.. ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడిని అడ్డుకోవడమే మా లక్ష్యం అని తెలిపింది.  తమ అటాక్స్ కు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది.  

 

Also Read: Wage Rates : కనీస వేతనాలు నెలకు 26,910 రూ.లకు పెంచిన కేంద్రం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

అగ్రరాజ్యం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. టారీఫ్ లకు సంబంధించి ట్రంప్ సర్కార్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా మినహా మిగతా అన్ని దేశాలపైనా టారీఫ్ లను 90 రోజుల పాటూ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

New Update
Donald Trump

Donald Trump

మొత్తానికి అమరికా ప్రభుత్వం దిగొచ్చింది. టారీఫ్ లపై ఇంచుమించు అన్ని దేశాలూ వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో వెనక్కు తగ్గడమే మంచిది అనుకున్నట్టుంది. మొత్తానికి టారీఫ్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఊరట కలిగించింది. దాదాపు వార రోజుల పాటూ ట్రంప్ టారీఫ్ లతో బెంబేలెత్తిపోయిన ప్రపంచం ఇప్పుడు కాస్త శాంతిస్తుంది. అమెరికా అధ్యక్షుడు మొదలెట్టిన ఈ వాణిజ్య యుద్ధంతో ప్రపంచ మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. షేర్ మార్కెట్ అయితే ఎన్నడూ చూడని విధంగా నష్టాలను చూసింది.  ఇప్పుడు ఈ 90 రోజుల నిలుపుదలతో అందరూ కాస్త ఊరట చెందుతారు.

చైనాకు మాత్రం లేదు..

అయితే ఈ 90 రోజుల నిలుపుదల చైనాకు మాత్రం వర్తించదని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య మరింత ముదిరినట్టయింది.  ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాపై యూఎస్ సుకాలు పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఒక్కరోజు తేడాలోనే చైనాపై యూఎస్‌ మరోసారి సుంకాలు పెంచింది. 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా కూడ తగ్గేదే లే అన్నట్టు ప్రవర్తిస్తోంది. అంతకుముందు అమెరికాకు ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి డ్రాగన్‌పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 

today-latest-news-in-telugu | usa | donald trump tariffs

Also Read: GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

Advertisment
Advertisment
Advertisment