/rtv/media/media_files/2026/04/20/irgc-2026-04-20-13-15-47.jpg)
State power in the hands of the IRGC
IRGC : అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అతలాకుతలమైన ఇరాన్(iran us war latest) రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ అధికారం ఇప్పుడు పూర్తిగా సైనిక అతివాదుల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న తరుణంలో, ఆ దేశ పాలనా పగ్గాలు పూర్తిగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) చేతుల్లోకి వెళ్లినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. దేశ దౌత్య, సైనిక నిర్ణయాల్లో మితవాదుల ప్రాభవం తగ్గి, అతివాద సైనిక జనరల్ల ఆధిపత్యం పెరగడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
ఐఆర్జీసీ మేజర్ జనరల్ అహ్మద్ వహీద్ ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా అవతరించారు. ఆయనతో పాటు ఆయన సన్నిహిత వర్గం కీలక పదవులను ఆక్రమించినట్లు సమాచారం.సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహమ్మద్ బఘేర్ నుంచి లభించిన మద్దతుతో వహీద్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇరాన్ సైన్యాన్ని, విదేశీ దౌత్యాన్ని ఈ అతివాద వర్గమే నియంత్రిస్తోంది.
Also Read : ఇరాన్ పాలకులను వణికిస్తున్న భయం... ఖమేనీ అంత్యక్రియల్లో జాప్యం ?
Military Revolution In Iran
శాంతి చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలని ప్రయత్నిస్తున్న మితవాద నేతలను ఐఆర్జీసీ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికాతో శాంతి చర్చల వేళ హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అరాగ్చీ మొగ్గు చూపారు. అయితే, ఆయన నిర్ణయాన్ని తోసిరాజని ఐఆర్జీసీ(irgc warning) ఆయనను పాలనా వ్యవహారాల నుంచి పక్కకు తప్పించినట్లు తెలుస్తోంది.ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధనాన్ని ఎదుర్కోవాలంటే హర్మూజ్ జలసంధిని మూసి ఉంచడమే ఏకైక మార్గమని ఐఆర్జీసీ బలంగా నమ్ముతోంది.వాషింగ్టన్లోని 'ఇనిస్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ వార్' (ISW) అంచనాల ప్రకారం.. ఐఆర్జీసీ చేతుల్లోకి అధికారం వెళ్లడం వల్ల శాంతి చర్చలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా పనిచేస్తున్న, ఐఆర్జిసి మాజీ సభ్యుడు మహమ్మద్ బఘేర్ జోల్ఘడ్జర్ మద్దతు వాహిదికి ఉంది. ఇటీవలి యుద్ధాలలో సంప్రదాయ నావికాదళ నష్టాల తర్వాత వేగవంతమైన దాడి పడవలను ఎక్కువగా ఉపయోగిస్తున్న కీలకమైన సముద్ర మార్గాలలో, ఈ పొత్తు వాహిది ప్రభావాన్ని మరింత బలపరుస్తుంది.
వారాంతంలో జలమార్గం గుండా ప్రయాణించడానికి ప్రయత్నిస్తున్న కనీసం మూడు నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దీనివల్ల పర్షియన్ గల్ఫ్లో వందలాది నౌకలు చిక్కుకుపోయాయి, ఈ చమురు మార్గం కఠినమైన ఐఆర్జిసి దిగ్బంధనంలో ఉందని ఇది స్పష్టమైన సందేశాన్ని పంపింది. వాహిది ,జోల్ఘడ్జర్ భాగస్వామ్యం ప్రత్యక్ష దౌత్యపరంగా ప్రభావాన్ని కూడా చూపింది. ఈ నెల ప్రారంభంలో, ఐఆర్జిసి , సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆదేశాలను పాటించేలా చూసేందుకు జోల్ఘడ్జర్ను ఇరాన్ సంప్రదింపుల బృందంలో చేర్చారు
"ఇరాన్ సైనిక నాయకత్వం ఇప్పుడు రాజీ పడే ధోరణిలో లేదు. అమెరికా ఒత్తిడికి తలొగ్గడం కంటే, ప్రపంచ ఇంధన సరఫరాను స్తంభింపజేయడమే లక్ష్యంగా వారు హర్మూజ్ను మూసి ఉంచాలని భావిస్తున్నారు. ఇరాన్ నాయకత్వంలో వచ్చిన ఈ మార్పులు మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలను మరింత సాంద్రతరం చేస్తున్నాయి. మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై స్పష్టత లేకపోవడం, మరోవైపు అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకునే ఐఆర్జీసీ పగ్గాలు చేపట్టడంతో అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ తమ తదుపరి వ్యూహాలపై దృష్టి సారించాయి.వారాంతంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఇరాన్ను మరింత ఒంటరి చేసేలా ఉన్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : హోటళ్లు సీజ్, మార్కెట్లు, బస్టాప్ లు క్లోజ్.. గల్లీల్లో వేల మంది సైనికులు.. పాక్ లో అసలేం జరగబోతోంది?
Follow Us