Mehul Choksi: బెల్జియంలో మెహుల్‌ ఛోక్సీ అరెస్ట్‌!

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని మోసం చేసిన కేసులో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.13,500 కోట్ల మోసం చేసినట్టు దర్యాప్తులో తేలింది. అతడ్ని అప్పగించాలని భారత్ కోరింది.

New Update
Choksi

Choksi

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని మోసం చేసిన కేసులో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఆయనపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. దాదాపు రూ.13,500 కోట్ల మోసం చేసినట్టు దర్యాప్తులో తేలింది. అతడ్ని అప్పగించాలని భారత్ కోరింది. అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also Read: Trump: కేవలం 30 రోజులే..అమెరికాను విడిచి వెళ్లిపోండి...!

డైమండ్ వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన గురించి భారతీయులకు బాగా తెలుసు. అంత బాగా పాపులర్ అయ్యాడు కూడా. పంజాబ్ నేషనల్ బ్యాంకు పేరు చెప్పగానే ముందుగా ఆయన పేరే వస్తుంది. ఆ రేంజ్‌లో బ్యాంకుని మోసం చేశాడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 13, 500 కోట్ల రూపాయలను మోసం చేసి విదేశాలకు పారిపోయాడు.

Also Read: Musk-Trump: ట్రంప్ మీటింగ్‌లో మస్క్ "టాప్ సీక్రెట్" నోట్..అసలు అందులో ఏముంది!

.వేల కోట్ల రూపాయలతో విదేశాలకు చెక్కేసిన నిందితుపై భారత్ దృష్టి పెట్టింది. వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్‌ ఛోక్సీ బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన బెల్జియం జైలులో ఉన్నాడు. ఛోక్సీపై తీవ్ర అభియోగాలు ఉండడంతో ఆయన్ని అప్పగించాలని బెల్జియం ప్రభుత్వాన్ని భారత్ కోరింది.

భారత్ నుంచి పారిపోయిన మెహుల్‌ ఛోక్సీ బెల్జియంలో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య ప్రీతి చోక్సీ బెల్జియం పౌరురాలు. అయితే మెహుల్ చోక్సీ బెల్జియంలో ఉండటానికి ఎఫ్ రెసిడెన్సీ కార్డ్ పొందారు. అక్కడి చట్టాల ప్రకారం మెహుల్‌ ఛోక్సీ ఇండియాకు వస్తాడా? లేకుంటే విజయ్ మాల్యా మాదిరిగా అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించి కాలం గడిపేస్తాడా? అన్నది అసలు పాయింట్.


సరిగ్గా 2018 జనవరిలో భారత్‌కు ఓ కుదుపు కుదిపేసింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్. దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ ఇది. ఈ కుంభకోణం బయటపడటానికి కొద్దివారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు విదేశాలకు పారిపోయాడు. కుంభకోణం బయటకు రావడానికి ముందు అంటిగ్వా పౌరసత్వం పొందినట్టు తెలిసింది.

ఈ కేసులో మరో నిందితుడు చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడు. ఆయన్ని రప్పించేందుకు భారత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ కేసులో ఓ అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. 2023లో బెల్జియంలో ఛోక్సీ ఉండటానికి అనుమతి దొరికింది. ఇండియా నుంచి నేరుగా వెస్టిండీస్ దీవులైన ఆంటిగ్వా, బార్బుడాలో నివసించాడు కూడా.

బెల్జియంలో స్థిరంగా ఉండేందుకు పక్కాగా స్కెచ్ వేశాడు ఛోక్సీ. నకిలీ పత్రాలు సమర్పించి, అక్కడి ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించాడనే ఆరోపణలు ఛోక్సీపై ఉన్నాయి.  65 ఏళ్ల మెహుల్ చోక్సీకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ట్రీట్ మెంట్ కోసం బెల్జియం నుంచి స్విట్జర్లాండ్‌కు వెళ్లాడు.

ఆ తర్వాత బెల్జియంకు వచ్చాడని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛోక్సీ ఇండియాకు వస్తే ఇలాంటి ఫలితం ఉండదని అంటున్నారు. ఆయన ఆరోగ్యానికి మనం ఖర్చు చేయాల్సివస్తుందని అంటున్నారు. బ్యాంక్‌కు ఎగ్గొట్టిన  13 వేల కోట్ల రూపాయలను రాబట్టాలని అంటున్నారు.

Also Read: Ap Weather Report: ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో వర్షాలు.!

Also Read: భక్తులకు TTD అదిరిపోయే శుభవార్త.. ఇక క్యూ లైన్లో ఉండాల్సిన అవసరమే లేదు!

mohul choksi | punjab-national-bank | belgium | arrest | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

పహల్గాంలో ఉగ్రవాదులు దాడిచేసి 28మందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి తామే కారణమని లష్కర్‌ తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌) ప్రకటించుకుంది. అయితే ఆ సంస్థ తాజాగా మాట మార్చింది. ఆ ఘటనతో తమకు సంబంధం లేదని ప్రకటించింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

Pahalgam Terror Attack : పహల్గాంలో ఉగ్రవాదులు దాడిచేసి 28 మందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి లష్కర్‌ తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌) కారణమని ప్రకటించుకుంది. అయితే అనుహ్యంగా ఆ సంస్థ తాజాగా మాట మార్చింది. ఆ ఘటనతో తమకు సంబంధం లేదని ప్రకటించింది.  ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. "ఇంతకు ముందు వచ్చిన ప్రకటనతో మాకు సంబంధం లేదు. భారత్‌ మా వ్యవస్థల్ని హ్యాక్‌ చేసి ఆ మెసేజ్‌ పోస్టు చేసింది. దీనిపై ఇప్పటికే పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం భారత్‌ ఇలా చేయడం  ఇదేమీ తొలిసారి కాదు' అని ఆరోపించింది.

మరో వైపు  భారత్‌ దెబ్బకు పాకిస్థాన్‌ ఉ... పోసుకుంటుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో సింధు నీళ్ల కోసం పాక్‌ విలవిలలాడుతోంది.  పాక్ ప్రధానిలో  భయం మొదలైంది. సింధు నీళ్లు ఆపడంతో పాక్‌ కాళ్ల బేరానికి వచ్చేందుకు సిద్ధమైంది. పహల్గామ్ ఉగ్రదాడిపై విచారణకు సిద్ధమని ప్రకటించింది. మాకు మంచినీళ్లు కావాలని పాక్‌ ప్రధాని స్పష్టం చేశాడు. మా 25 కోట్ల జనానికి సింధు నీళ్లే జీవన ఆధారం అంటూ కొత్త రాగం అందుకున్నాడు. నీళ్ల కోసం మా ప్రయత్నాలు కొనసాగిస్తామంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

కాగా జమ్మూ కాశ్మీర్‌‌‌‌ పహల్గామ్‌‌‌‌లోని బైసరన్ లో జరిగిన ఉగ్రదాడి ఘటనకు పాకిస్తాన్‌‌‌‌కు చెందిన లష్కర్- ఏ-తొయిబా (ఎల్‌‌‌‌ఈటీ) అనుబంధ సంస్థ అయిన "ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌‌‌‌ఎఫ్)" బాధ్యత వహించిన విషయం తెలిసిందే. ఈ దాడి వెనుక ఎల్‌‌‌‌ఈటీ సీనియర్ కమాండర్ సైఫుల్లా కసూరీ మాస్టర్‌‌‌‌మైండ్‌‌‌‌గా ఉన్నట్లు తెలుస్తుంది.  అలాగే దాడికి పాల్పడిన టీఆర్‌‌‌‌ఎఫ్ బృందానికి ఆసిఫ్ ఫౌజీ నాయకత్వం వహించినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్‌‌‌‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం  రద్దు చేసింది. అయితే, చర్య తర్వాతే టీఆర్‌‌‌‌ఎఫ్ ఏర్పడింది. అప్పటి నుంచి అడపాదడపా జమ్మూ కాశ్మీర్‌‌‌‌లో టెర్రరిస్టుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. 

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కర్- ఏ-తొయిబా (ఎల్‌‌‌‌ఈటీ) సీనియర్ కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీదే పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారిగా తెలుస్తున్నది. కసూరిని ఎల్‌‌‌‌ఈటీ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌‌‌‌కు సన్నిహితుడిగా కూడా చెబుతున్నారు. హఫీజ్ సయీద్.. జమాత్- ఉద్ -దవా (జేయూడీ) రాజకీయ సంస్థ మిల్లీ ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) అధ్యక్షుడిగా సైఫుల్లా కసూరిని పరిచయం చేశాడు. ఈ జేయూడీనే 2016లో యూఎస్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ స్టేట్.. ఎల్‌‌‌‌ఈటీకి పేరు మార్చుకుంది. దీన్ని2008లో ఐక్యరాష్ట్ర సమితి ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. 

Also Read: Indus Waters : మిస్టర్ మోదీ..సింధూలో నీళ్లు పారకపోతే రక్తం పారుతుంది: బిలావల్‌ భుట్టో హెచ్చరిక

Advertisment
Advertisment
Advertisment