IRAN: మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్‌కు మరణ శిక్ష...ఎక్కడో తెలుసా!

మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్ ఆమిర్ హుస్సేన్ మగ్‌సౌద్లూకు ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. గతంలో ఇదే కేసులో ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఇతడిపై.. దేశ ద్రోహానికి పాల్పడినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి

New Update
hanging hyderabad

మహమ్మద్ ప్రవక్తను అవమానించిన కేసులో పాప్ సింగర్ ఆమిర్ హుస్సేన్ మగ్‌సౌద్లూకు ఇరాన్ కోర్టు మరణ శిక్ష ను విధించింది. గతంలో ఇదే కేసులో 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన ఇతడి కేసును మరోసారి తాజాగా రీఓపెన్ చేశారు. ఈక్రమంలోనే అతడికి మరణ శిక్ష ను విధించినట్లు తెలుస్తుంది. అయితే ఈ కేసు మాత్రమే కాకుండా ఆమిర్‌ పై దేశ ద్రోహానికి సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. 

Also Read: Private Album Shooting: ఎంతకు తెగించార్రా : ఆలయంలో అపచారం.. ఏకంగా గర్భగుడిలోనే

అలాగే ఈ తీర్పును అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా న్యాయస్థానం అతడికి ఇచ్చింది. ఇరాన్‌కు చెందిన 37 ఏళ్ల ఆమిర్ హుస్సేన్ మగ్‌సౌద్లూకు.. పాప్ సింగర్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా శరీరం అంతటా టాటూలు వేయించుకున్న ఇతడిని టట్లూగా కూడా పిలుస్తుంటారు. 2016లో ఆమిర్ హుస్సేన్ అనేక సార్లు అరెస్ట్ అయ్యాడు. ఈక్రమంలోనే రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 

Also Read: Crime: మనిషివా..పశువువా..నిండు చూలాలి కడుపు మీద కూర్చుని హత్య చేసిన దుర్మార్గుడు!

జైలు నుంచి విడుదల అయ్యాక  2018లో ఇతడు టర్కీకి వెళ్లిపోయాడు. అక్కడే అనేక ఆల్బమ్స్ రూపొందించాలని ప్రయత్నించాడు. అలాగే పెద్ద పెద్ద కచేరీలలో కూడా ప్రదర్శనలు చేశాడు. ఇప్పటి వరకు ఆమిర్ హుస్సేన్ 21 ఆల్బమ్‌లను విడుదల చేయగా.. 2021లో చివరి ఆల్బమ్ విడుదల అయింది.అయితే అదే ఏడాది 16 ఏళ్ల వయుసలో ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి అనుమతించాలని కామెంట్లు చేస్తూ పెద్ద ఎత్తున కలకలం సృష్టించాడు ఆమిర్. 

ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2023లో పాస్‌పోర్ట్ గడువు ముగియడంతో.. ఇస్తాంబుల్ వెళ్లాలనుకున్న అతడిని అడ్డుకుని ఇరాన్‌కు అప్పగించారు టర్కీ పోలీసులు. అప్పటి నుంచి అతను ఇరాన్ కస్టడీలోనే ఉంటున్నాడు. ముఖ్యంగా వ్యభిచారాన్ని ప్రోత్సహించిన కేసులో ఈ పాప్ సింగర్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే మరో కేసులో ఇస్లామ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు కూడా శిక్ష వేశారు.

తాజాగా మహమ్మద్ ప్రవక్తను అవమానించిన కేసులో ఇరాన్ కోర్టు.. ఇతడికి మరణ శిక్ష ను విధిస్తున్నట్లు  ప్రకటించింది. అయితే 2023లో ఇరాన్‌లో 900 మందికి పైగా మరణ శిక్షలు అమలు అయినట్లు సమాచారం. గత తొమ్మిది సంవత్సరాలలో ఆ ఏడాదే ఎక్కువ మందిని  ఉరి తీశారు. అలాగే 2023లో అమలు చేసిన ఉరి శిక్షల సంఖ్యతో పోలిస్తే ఈ రెండేళ్లలో ఆ సంఖ్య 6 శాతానికి మించి పెరిగింది. ఇదంతా చూస్తుంటే పాప్ సింగర్ ఆమిర్ హుస్సేన్‌కు కూడా త్వరలోనే మరణ శిక్ష అమలు అయ్యే అవకాశాలున్నాయి. 

Also Read: Kiran Abbavaram: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్ !

Also Read: TS Inter Students: ఇంటర్ విద్యార్థులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: మీ అంతట మీరే వెళ్ళిపోండి..మేము ఖర్చులు భరిస్తాం..ట్రంప్ ఆఫర్

పూర్తిగా వలసలను అరికట్టే వరకూ నిద్రపోయేది లేదని ట్రంప్ పట్టుబట్టారు.అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచీ దీనిపై చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో స్వీయ బహిష్కరణ చేసుకునే వాళ్ళకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తామే విమాన ఖర్చులు భరిస్తామని చెప్పారు.

author-image
By Manogna alamuru
New Update
usa

Trump Bumper Offer To Immigrants

మీ అంతట మీరే వెళ్ళిపోండి...దాని బాధ్యతలు మాత్రం అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వీయ బహిష్కరణ చేసుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమంతట తామే వెళ్ళిపోతే...విమాన ఖర్చులతో పాటూ కొంత నగదును కూడా ఇస్తామని చెప్పారు. తాజాగా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రకటించారు. అక్రమ వలసదారులను తమ దేశం నుంచ ఎలా అయినా బటయకు పంపేస్తామని...మేము గెంటేసే కన్నా తమంతట తామే బయటకు వెళ్ళిపోతే మంచిదని ట్రంప్ అంటున్నారు. 

మీ అంతట మీరే వెళ్ళిపోతే మంచిది..

ప్రస్తుతం దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్నవారిపై ఇమిగ్రేషన్‌ అధికారులు దృష్టిసారించారన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారని ట్రంప్ తెలిపారు. సాధారణ సౌరుల కోసం మాత్రం స్వీయ బహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. వెళ్ళిపోయిన లేదా వెళ్ళిపోతున్న వారిలో నేర చరిత్ర లేని వారు ఉంటే వారు మళ్ళీ అమెరికా వచ్చేందుకు కూడా అనుమతిస్తామన్నారు. వారు చట్టబద్ధంగా వెనక్కు రావడానికి సహకరిస్తామని తెలిపారు. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే అమెరికా నుంచి చాలా మంది అక్రమ వలసదారులను బయటకు పంపించేశారు. మొదట్లో యుద్ధ విమానాలను ఏర్పాటు చేసి మరీ వారందరినీ తమ తమ దేశాలకు పంపించారు. అయితే యుద్ధ విమానాలకు ఖర్చు ఎక్కువ అవుతుండడంతో ఆ కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టారు. దాని తర్వాత కూడా అక్రమ వలసలను అరికట్టడానికి, అమెరికాలో ఉంటున్న వారిని పంపించేందుకు చాలానే చర్యలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా యూఎస్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సైతం అక్రమ వలసదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో 30 రోజులకు మించి అక్రమంగా ఉంటున్నవారు కచ్చితంగా ఫెడరల్‌ గవర్నమెంట్‌ వద్ద రిజిస్టర్‌ చేయించుకోవాలని తెలిపింది. ఒక వేళ అలా రిజిస్టర్ చేసుకోకపోతే ఫైన్ లేదా జైలుశిక్ష విధిస్తామని కూడా తెలిపింది. 

 

today-latest-news-in-telugu | usa | america president donald trump | illegal immigrants america

Also Read: HYD: హైదరాబాద్ లో రెండు కంపెనీలపై ఈడీ సోదాలు..

Advertisment
Advertisment
Advertisment