USA: పాలస్తీనాకు మద్దతు..భారతీయ విద్యార్థిని వీసా రద్దు

పాలస్తీనా నిరసనకారులకు మద్దతునిచ్చినందుకు ఓ భారతీయ విద్యార్థిని వీసా రద్దు చేసింది అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్. తమ దేశంలో ఉండటానికి, చదవడానికి  అనుమతి ఉంది కానీ నిరసనలు చేయడానికి కాదని డీహెచ్ఎస్ ప్రకటించింది.  

New Update
usa

Indian Student Rajani Srinivasan

గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్ల వెంటనే ఖాళీ చేయాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై పాలస్తీనియన్లు మండిపడుతున్నారు. దీనికి అమెరికాతో పాటూ పలు దేశాల్లో పాలస్తీనియన్లు నిరసనలు చేస్తున్నారు. గాజాను తన ఆస్తిగా భావిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.. అందుకే తనకు నచ్చినవిధంగా గాజాను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు అంటూ ఆ దేశస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కాట్లాండ్ లో ట్రంప్ గోల్ఫ్ రిసార్ట్‌లలో ఒకదానిని ధ్వంసం చేశామని పాలస్తీనా అనుకూల కార్యకర్తలు ప్రకటించారు కూడా. ఇక దానితో పాటూ అమెరికాలో పలు యూనివర్శిటీల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: USA: ఏలియన్స్ ఉన్నాయి..అమెరికా నిఘా అధికారులు

భారతీయ విద్యార్థిని..

తాజాగా పాలస్తీనాకు మద్దతుగా కొలంబియా యూనివర్శిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీనికి భారతదేశానికి చెందిన రంజనీ శ్రీనివాసన్ అనే విద్యార్థిని మద్దతు పలికారు.  దీని కారణంగా ఈమె ఎఫ్ -1 వీసాను రద్దు చేశారు. అంతేకాదు ఆమె స్వీయ బహిష్కరణకు గురైయ్యారని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. సీబీపీ హోమ్‌ అనే ఆప్‌ను ఉపయోగించి ఆమె మార్చి 11న స్వీయ బహిష్కరణకు గురైనట్లు డీహెచ్‌ఎస్‌ తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. అమెరికాలో నిసించడానికి, చదువుకోడానికి తాము వీసా ఇస్తామని...కానీ ఉగ్రవాద సంస్థలకు మద్దుతు తెలిపినా, నిరసనలు చేసినా...వీసాలను రద్దు చేస్తామని డీహెచ్ఎస్ చెప్పింది. అలాంట వారు తమ దేశంలో ఉండకూడదని కామెంట్ చేసింది. మిలిటెంట్‌ సంస్థలకు మద్దతుగా నిరసనలు తెలిపిన కొలంబియా యూనివర్శిటీ విద్యార్థిని ఒకరు స్వీయ బహిష్కరణ కోసం సీబీపీ హోమ్‌ ఆప్‌ ఉపయోగించిందనందుకు సంతోషిస్తున్నా అని డీహెచ్ఎస్ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ అన్నారు. ఇందులో టూల్ ను ఉయోగించి స్వచ్ఛందంగా దేశాన్ని దిలిపెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నామని ఆమె తెలిపారు.

Also Read: Cricket: బెదిరింపు కాల్స్ వచ్చేవి..టీమ్ ఇండియా క్రికెటర్ వరుణ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment