Britan: ఇక నుంచి వారానికి 4 రోజులే పని..ఆ కంపెనీల తుది నిర్ణయం!

యూకేకు చెందిన కొన్ని కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎలాంటి వేతనం కోత లేకుండా శాశ్వతంగా వారానికి నాలుగు పని దినాలను అమలు చేస్తున్నాయి.పేరొందిన పలు ఛారిటీలు,మార్కెటింగ్‌,టెక్నాలజీ సంస్థలు సహా 200 కంపెనీలు ఈ విధానంలో ఉన్నట్లు సమాచారం.

New Update
japan

పని గంటల పై భారత్‌ (India) సహా అనేక దేశాల్లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. యూకేకు చెందిన కొన్ని కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎలాంటి వేతనం కోత లేకుండా శాశ్వతంగా వారానికి నాలుగు పని దినాలను అమలు చేస్తున్నాయి.పేరొందిన పలు ఛారిటీలు,మార్కెటింగ్‌,టెక్నాలజీ సంస్థలు సహా 200 కంపెనీలు ఈ విధానంలో మారినట్లు బ్రిటన్‌ మీడియా కథనాలు వెల్లడించాయి.

Also Read:Telangana: సరస్వతి పుష్కరాలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి.. ఎప్పుడు, ఎక్కడ..అంటే

వందేళ్ల కిందటి విధానాలు...

4 డే వీక్‌ ఫౌండేషన్‌ (4 Day Week Foundation) చేసిన సర్వేలో భాగంగా ఈ విషయం వెల్లడైనట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. తాజా పని విధానంతో ఈ కంపెనీల్లో పని చేస్తున్న 5 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.దీని పై4 డే వీక్‌ ఫౌండేషన్‌ క్యాంపెయిన్‌ డైరెక్టర్‌ జో రైల్‌ మాట్లాడుతూ..9-5 జాబ్‌ వారానికి ఐదు రోజుల పని అనేవి వందేళ్ల కిందటి విధానాలు.

Also Read: Mauni Amavasya: మౌని అమావాస్య రోజు గంగలో మునిగితే పాపాలు పోతాయా? మహాకుంభమేళకు పోటెత్తుతున్న భక్తులు

ప్రస్తుత అవసరాలకు ఇవి పని చేయవు.మనం అప్డేట్‌ అవ్వాల్సిన సమయం వచ్చింది. వారానికినాలుగు రోజుల పని విధానంతో ఉద్యోగులకు ఎక్కువ ఖాళీ సమయం అందుబాటులో ఉంటుంది. దాని వల్ల ప్రజలు సంతృప్తికర జీవితాలను గడిపేందుకు స్వేచ్ఛ లభిస్తుంది అని అభిప్రాయపడ్డారు.

తొలుత ఈ వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని బ్రిటన్‌ (Britain) లో దాదాపు 30 మార్కెటింగ్‌,అడ్వర్టైజింగ్‌, ప్రెస్‌ రిలేషన్స్‌ సంస్థలు అమలు చేశాయి. ఆ తర్వాత 29 ఛారిటీలు, 24 టెక్నాలజీ , ఐటీ, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, 22 మేనేజ్‌ మెంట్‌,కన్సల్టింగ్‌ సంస్థలు కూడా ఇదేబాట పట్టినట్లు సర్వేలో వెల్లడైంది.

అత్యధికంగా లండన్‌ లో 59 కంపెనీలు ఈనూతన పని విధానాన్నిఅనుసరిస్తున్నాయి. 

Also Read:Davos: పెట్టుబడులు, చర్చలు ఒకవైపు...శృంగారం మరోవైపు..దావోస్ లో పారిశ్రామిక వేత్తల భాగోతం

Also Read: America: కాళ్లూ, చేతులు కట్టేసి.. నీళ్లు కూడా ఇవ్వకుండా.. అక్రమవలసదారుపై అమెరికా వికృత చేష్టలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Danish Kaneria: పోషిస్తున్నామని వాళ్లే ఒప్పుకున్నారు

పహల్గాం ఘటన పై పాక్‌ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి.దీని పై ఆ దేశ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా స్పందించారు.ఉగ్రవాదానికి మేం ప్రోత్సహిస్తున్నామంటూ పాక్‌ బహిరంగంగా ఒప్పుకుంది అని అన్నారు.

New Update
Pakistan cricketer Danish Kaneria

Pakistan cricketer Danish Kaneria Photograph: (Pakistan cricketer Danish Kaneria)

జమ్ము కశ్మీర్‌ లోని పహల్గాం ఘటన  పై పాక్‌ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శలకు దారి తీశాయి. ఉగ్రవాదులను స్వాత్రంత్య సమరయోధలు అంటూ పిచ్చి ప్రేలాపనలు చేశారు.దీని పై ఆ దేశ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటికే పాక్‌ ప్రధాని మౌనంగా ఉండటం గురించి ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

Also Read:Pakistan: మరో నాలుగు రోజుల్లో యుద్ధం..పాక్ ఢిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్

పాక్‌ ఉప ప్రధాని ఉగ్రవాదులను ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ అంటూ సంబోధించారు. ఇది అవమానకరమే కాకుండా..ఉగ్రవాదానికి మేం మద్దతిస్తున్నాం, ప్రోత్సహిస్తున్నామంటూ బహిరంగంగా అంగీకరించినట్లు ఒప్పుకుందని డానిష్‌ పోస్టు పెట్టాడు. ఇప్పటికే పాక్‌ ఉగ్రవాదులను కాపాడటంతో పాటు ఆశ్రయం కల్పించడం పై డానిష్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే ఉన్నారు.

Also Read: Ap Rain Alert:ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు!

తాను పాక్‌ లేదా ఇక్కడి ప్రజలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం లేదని వివరించారు. ఉగ్రవాదం చేతిలో పాక్‌ తీవ్రంగా బాధపడుతోంది.శాంతి కోసం నిలబడే నాయకత్వం అవసరం ఉంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించేవారు కాదు.నేను గర్వంగా పాక్‌ క్రికెట్‌  జెర్సీని ధరించా. మైదానంలో నా చెమటను చిందించా.చివరికి నన్ను ట్రీట్ చేసిన విధానం పహల్గాం బాధితులకు భిన్నంగా లేదు.

హిందువుగా ఉన్నందుకే లక్ష్యంగా మారా. ఉగ్రవాదాన్ని సమర్థించేవారు సిగ్గుపడాలి. హంతకులను రక్షించేవారు సిగ్గుపడాలి. నేనెప్పుడైనా మానవత్తం, వాస్తవం వైపే నిలబడతా పాక్‌ ప్రజలు కూడా ఇలానే ఉంటారని భావిస్తున్నా.వారిని తప్పుదోవ పట్టించోద్దు అని సుదీర్ఘమైన పోస్టు పెట్టాడు.

జమ్మూ కశ్మీర్‌ లో చోటు చేసుకున్న ఉగ్రదాడి ఘటన పై పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ స్పందిచకపోవడం పై ఆ దేశ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా తీవ్ర విమర్శలు కురిపించారు. ప్రధాని షరీఫ్‌ కు వాస్తవం తెలుసంటూ అన్నారు.ఉగ్రవాదులను పెంచి పోషించినట్లు పాక్‌ ఒప్పుకుందని ఆయన అన్నారు.

Also Read: Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

Also Read: Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం..ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్

pak | danish-kaneria | pahalgam | attack in Pahalgam | usa | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment