USA: DOGE ను వీడుతున్న ఎలాన్ మస్క్..డేట్ ఫిక్స్

ట్రంప్ గవర్నమెంట్ లో ముఖ్యమైన డిపార్ట్ మెంట్ DOGE. దీనికి హెడ్ ఎలాన్ మస్క్. అయితే ఇప్పుడు ఆయన దానిని విడిచిపెట్టిపోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు. 

New Update
Elon Musk

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వానికి కీలక సలహాదారుడు ఎలాన్ మస్క్. ఇతను డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(DOGE)కు అధినేత కూడా. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచీ DOGE అనేక చర్యలను చేపట్టింది. ఫెడరల్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ఇప్పుడు ఎలాన్ మస్క్ DOGEనుంచి తప్పుకుంటున్నారని తెలుస్తోంది. టెక్ బిలియనీర్ మస్క్ దీన్ని స్వయంగా ప్రకటించారు. అంతే కాదు ఈయన ఏకంగా వాషింగ్టన్ వీడి వెళతారని తెలుస్తోంది. 

1 ట్రిలియన్ డాలర్లను సేవ్ చేశాం..

ఫాక్స్ న్యూస్ ప్రకారం.. ఎలాన్ మస్క్ ట్రంప్ టీం నుంచి మే నెలలో వైదొలగనున్నారు. ప్రభుత్వానికి 1 ట్రిలియన్ డాలర్ల భారం తగ్గించాం. కాబట్టి తాను వచ్చిన పని అయిపోయిందని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. మే 2025లో వార్షిక ఫెడరల్ లోటును సగానికి అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. తన బృందం రోజుకు 4బిలియన్ డాలర్ల లోటును సరిచేస్తూ వారంలో ఏడు రోజులు కష్టపడి పనిచేశామని మస్క్ చెప్పుకొచ్చారు. DOGE మే 2025లోపు దాదాపు 7 ట్రిలియన్ల డాలర్లనుంచి 6 ట్రిలియన్ల డాలర్లకు తగ్గించగలదని గట్టి నమ్మకని చెప్పారు. అందుకే DOGE ను వదిలేస్తానని అంటున్నారు. 

అంతకు ముందు తమ డీవోజీఈ సిబ్బంది వారానికి 120 గంటలు పనిచేస్తున్నారని ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. కానీ అమెరికా ఉన్నతస్థాయి అధికారులు మాత్రం వారానికి కేవలం 40 గంటలు మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. అందుకే పౌరులు చెల్లిస్తు్న్న సొమ్ము వృథా అవుతోందని పేర్కొన్నారు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థపై DOGE చేస్తున్న ఆడిట్‌లో కీలక విషయాలు బయటపడుతున్నాయని.. ప్రజల డబ్బులు ఎలా దుర్వినియోగమవుతున్నాయో తెలుస్తోందని చెప్పారు.  

today-latest-news-in-telugu | usa | elon-musk

Also Read: Mynmar Earthquake: మయన్మార్ లో తరుచూ భూకంపాలు..అక్కడ భూమి కింద ఏముంది?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sunitha Williams: అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా కనిపించింది..సునీతా విలియమ్స్

అంతరిక్ష అనుభవాలను మీడియాతో పంచుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భారత దేశం గురించి కూడా స్పందించారు. ఇండియా మహా అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించారు. త్వరలోనే భారత్ కు వస్తానని తెలిపారు. 

New Update

ఐఎస్ఎస్ నుంచి తిరిగి వచ్చాక సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు 12 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తాము కోలుకుంటున్నామని...నాసా బృందం తమకు శిక్షణ ఇస్తోందని చెప్పారు. ఇప్పుడు మామూలుగాను నడగలుగుతున్నామని చెప్పుకొచ్చారు. దాంతో పాటే తమ  ఐఎస్ఎస్ లో తమ అనుభవాలు, అక్కడ ఏం చేశారు. స్పేస్ ఎక్స్ పని తీరు గురించి అన్నీ వివరంగా చెప్పారు వ్యోమగాములు. మళ్ళీ అవకాశం వస్తే స్టార్ లైన్ షిప్ లో ఐఎస్ఎస్ కు వెళ్ళడానికి రెడీ అని తెలిపారు. 

ఇండియా చాలా బావుంది..

అంతరిక్షం నుంచి భారత్ ఏ విధంగా కనిపించింది అన్న ప్రశ్నకు సునీతా విలియమ్స్...అద్భుతంగా ఉంది అంటూ సమాధానం చెప్పారు. భారతదేశ ప్రకృతి దృశ్యాన్ని చూసి ముగ్ధురాలైనట్లు తెలిపారు. హిమాలయాలను దాటుకుని వెళుతుంటే మైమరిచిపోయానని సునీతా అన్నారు.  ఆ దృశ్యాలను బెచ్ విల్ మోర్ కెమెరాలో బంధించామని తెలిపారు. గుజరాత్, ముంబై ప్రాంతాల మీదగా వెళ్లినప్పుడు జాలర్ల పడవలు సిగ్నల్‌లాగా కనిపించాయని అన్నారు. భారత్ లో తొందరలోనే పర్యటిస్తానని సునీతా అన్నారు. తన తండ్రి పుట్టిన దేశాన్ని త్వరలోనే చూస్తానని, బంధువులను, ప్రజలను కలుస్తానని సునీతా చెప్పారు. భారత్ అద్భుతమైన ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు. భారత అంతరిక్ష యాత్రలో భాగం కావడానికి, సాయం చేయడానికి తాను సిద్దమేనని ఆమె అన్నారు. 

today-latest-news-in-telugu | nasa | sunitha-williams | astronauts

Also Read: Myanmar: మసీదుల్లో ప్రార్థన చేస్తూ 700 మంది మృత్యువు.. 2వేలకు పైనే..

Advertisment
Advertisment
Advertisment