Noida Rocket : ఈడీ సంచలనం...భారీ వ్యభిచార రాకెట్‌ గుట్టు రట్టు...కోట్లల్లో దందా..

నోయిడాలో భారీ వ్యభిచార రాకెట్‌ గుట్టు రట్టయ్యింది. ఈ రాకెట్‌ గుట్టును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ‌(ED) రట్టు చేసింది. గత ఐదేళ్లుగా భార్యభర్తలు ఇద్దరూ ఈ దందా నడుపుతున్నట్టు గుర్తించారు. ఈ ముఠాకు అంతర్జాతీయంగా సంబంధాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

New Update
 prostitution racket

prostitution racket

 Noida Rocket : నోయిడాలో భారీ వ్యభిచార రాకెట్‌ గుట్టు రట్టయ్యింది. ఈ రాకెట్‌ గుట్టును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ‌(ED) రట్టు చేసింది. గత ఐదేళ్లుగా భార్యభర్తలు ఇద్దరూ ఈ దందా నడుపుతున్నట్టు గుర్తించారు. ఈ వ్యభిచార రాకెట్‌ నడుపుతున్న ముఠాకు అంతర్జాతీయంగా సంబంధాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. నోయిడాలోని ఓ ఇంటిపై దాడిచేసి రూ.15.66 కోట్ల అక్రమ విదేశీ నిధుల్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: కుక్కలను తప్పించుకోబోయి బావిలో.. 3 రోజులు అక్కడే! తర్వాత ఏం జరిగిందంటే...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాలో ఉజ్వర్ కిషోర్, అతడి భార్య నీలు శ్రీవాస్తవ గత ఐదేళ్లుగా వ్యభిచార రాకెట్‌ దందా నడుపుతున్నారు. ఫారెన్ ఫండ్స్ తో లక్షల్లో జీతాలు ఇస్తూ.. సంపాదన ఎరగా వేస్తూ పోర్న్ రాకెట్ నడుపుతున్న దంపతులను పట్టుకున్నారు ఈడీ అధికారులు.  సైప్రస్‌ దేశానికి చెందిన టెక్నియస్ లిమిటెడ్ అనే సంస్థతో ఈ జంటకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంస్థ ఎక్స్ హామ్‌స్టర్, స్ట్రిప్‌చాట్ వంటి అడల్ట్ ఎంటర్ టైన్ మెంట్ వెబ్‌సైట్‌లను నిర్వహిస్తోంది.

Also Read: పుతిన్‌ను హత్య చేసేందుకు ప్లాన్.. కారులో బాంబు పేలుడు
 
ఈ జంట  'echato dot com' పేరుతో ఒక పేజీని సృష్టించి, ఆకర్షణీయమైన జీతాలు ఇస్తామని ప్రకటనలు ఇచ్చారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతానికి చెందిన చాలా మంది మహిళలు ఈ ప్రకటనల ద్వారా ఆకర్షితులయ్యారు. ఆడిషన్ల సమయంలోనే పోర్న్ చిత్రాల్లో నటించాలని చెప్పి.. నెలకు రూ. 1 నుండి రూ.2 లక్షల వరకు సంపాదన ఉంటుందని ఆశ చూపుతారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి మోడళ్లను నియమించుకుంటుంది ఈ జంట. ఈడీ దాడుల్లో ఈ ఫ్లాట్‌లో ఒక ప్రొఫెషనల్ వెబ్‌క్యామ్ స్టూడియోను కనుగొన్నారు. ఇది ఓన్లీఫ్యాన్స్ వంటి అడల్ట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను ప్రసారం చేయడానికి ఉపయోగపడుతుంది.  దాడి సమయంలో ముగ్గురు మహిళలు ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయి పనిచేస్తూ కనిపించారు. ఈడీ వారి నుంచి స్టేట్ మెంట్ తీసుకుంది. ఈ దందా నుంచి వీళ్లు సంపాదించిన ఆదాయంలో 75 శాతం ఉంచుకుని 25 శాతం మాత్రమే మోడల్స్‌కు ఇస్తూ గుట్టు చప్పుడు కాకుండా దందా నడుపుతున్నారు. 

ప్రారంభంలో కస్టమర్స్ నుంచి క్రిప్టోకరెన్సీ ద్వారా చెల్లింపులు స్వీకరించేవారు. ఆ తర్వాత విదేశీ కరెన్సీని తీసుకునేవారు.  టెక్నియస్ లిమిటెడ్ ద్వారా నెదర్లాండ్స్‌లోని ఒక బ్యాంక్ ఖాతాలో రూ. 7 కోట్లు బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ నిధులను అంతర్జాతీయ డెబిట్ కార్డులను ఉపయోగించి భారతదేశంలో నగదు రూపంలో విత్‌డ్రా చేశారు. ఈ రాకెట్ ద్వారా వేలాది మంది మహిళలను నియమించి ఉండవచ్చని దర్యాప్తు సంస్థ తెలిపింది. పూర్తి విషయాలు దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని ఈడీ అధికారులు తెలిపారు. వినియోగదారులు చేసే చెల్లింపుల ఆధారంగా మోడల్స్ టాస్క్‌లను చేసేవారు. హాఫ్-ఫేస్ షోలు, ఫుల్-ఫేస్ షోలు, వివిధ కేటగిరీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను ఉపయోగించడానికి వినియోగదారులు టోకెన్‌లను కొనాల్సి ఉంటుంది. కేటగిరీని బట్టి ఛార్జీలు మారుతుంటాయి.  ఈ రాకెట్‌లో వేలాది మంది మహిళలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Also Read: చైనాలో భూ ప్రకంపనలు.. ఆస్పత్రిలో చిన్నారులను కాపాడిన సిబ్బంది, వీడియో వైరల్

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: మరికాసేపట్లో ట్రంప్ ప్రతీకార సుంకాల దండయాత్ర

అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాల దండయాత్ర మరి కాసేపట్లో మొదలవనుంది. ప్రపంచంలో అన్ని దేశాలపైనా టారీఫ్ లను విధిస్తున్నామని..ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ అంటున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
usa

Trump Tariffs

భారత్ సహా చాలా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో..వాషింగ్టన్ టైమ్ జోన్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ట్రంప్ వీటిని అనౌన్స్ చేయనున్నారు. వీటి వల్ల అమెరికా ఆదాయం భారీగా పెరుగుతుందని ట్రంప్ అంటున్నారు. వైట్‌హౌస్‌ వర్గాల ప్రకారం ఏటా 600 బిలియన్‌ల నుంచి 700 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరనున్నట్లు అంచనా వేస్తున్నారు. 

భారత్, చైనాలతో పాటూ ప్రపంచంలో అన్ని దేశాల మీద ప్రతీకార సుంకాల విధింపు ప్రారంభం అవుతుంది. రేపటి రోజును అమెరికా లిబరేషన్ డే అని ట్రంప్ ఒక పేరు కూడా పెట్టారు. ఇప్పటి వరకు వరల్డ్ లో అన్ని దేశాలకు తాము తక్కువ సుంకాలు విధిస్తున్నా...అవి మాత్రం అమెరికా దగ్గర నుంచి రెట్టింపు వసూలు చేస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే ప్రతీకార సుంకాలను విధిస్తున్నామని..ఏ దేశం ఎంత టారీఫ్ విధిస్తే తామూ అంతే విధిస్తామని చెప్పారు. ఏప్రిల్ 2 నుంచి వీటిని స్ట్రిక్ట్ గా అమలు చేస్తామని ప్రకటించారు. ఏది ఏమైనా తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఇందులో నుంచి ఎవరికీ మినహాయింపు ఉండదని కూడా తేల్చి చెప్పేశారు. మిత్ర దేశాలైన భారత్ లాంటి వాటికి కూడా ఈ సుంకాల మోత తప్పదని ట్రంప్ కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పారు. అమెరికాపై సుంకాలను ఎత్తివేసే దేశాల పట్ల సానుకూలంగా, మంచి వాడిగా ఉంటానని తెలిపారు. ఇన్నాళ్ళు తాము చాలా ఏళ్లుగా మేం ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించాం..కానీ ఇక మీదట అమెరికాను దోచుకోనివ్వమని మరోసారి చెప్పారు ట్రంప్. 

అమెరికాకు శత్రుదేశాల కంటే మిత్రదేశాలే ఎక్కువ ద్రోహం చేశాయని ట్రంప్ అంటున్నారు. దశాబ్దాలుగా అవి మిమ్మల్ని దోచుకున్నాయని ఆరోపిస్తున్నారు. ఇంతకు ముందు అన్ని దేశాలు అమెరికాను దోచుకున్న దానికంటే ఇప్పుడు తాము విధిస్తున్న సుంకాలు ఎంతో తక్కువని ట్రంప్ సమర్ధించుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచ దేశాలన్నిటిపైనా మా వాణిజ్య సుంకాలు అమలవుతాయని చెప్పారు. 

సుంకాల కోత..

టారీఫ్ లవిషయంలో మిగతా దేశాల మాట ఎలా ఉన్నా...భారత్ మాత్రం అమెరికాకు ఎదురు తిరగదల్చుకోలేదని తెలుస్తోంది. సుంకాల విషయం అనౌన్స్ చేసిన దగ్గర నుంచే భారత్ వాటిని సమర్థిస్తూ వచ్చింది. ప్రపంచంలో శక్తివంతమైన దేశాలన్నింటికీ సమాన అధికారాలు ఉండాలన్న ఆలోచనతోనే ట్రంప్ ఇదంతా చేస్తున్నారని వెనకేసుకొచ్చారు. ఇండియా కూడా సరిగ్గా ఇలానే ఆలోచిస్తుందని అన్నారు. క్వాడ్‌లో ప్రతి దేశం తమవంతు పాత్ర పోషిస్తోంది. అందులో ఫ్రీ రైడర్లు ఎవరూ లేరు అంటూ జైశంకర్..ట్రంప్ ను వెనకేసుకుని వచ్చారు. దాని తరువాత భారత ప్రభుత్వం అమెరికాతో  ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చింది కూడా. దాని బట్టి అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించే దిశగా ఇండియా చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. 

భారత్ పై ప్రభావం..

విదేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై దాదాపు ప్రతి దేశమూ సుంకం  విధిస్తుంది. తమ దేశంలో తయారీకి ప్రోత్సాహం ఇవ్వడం...దాని ద్వారా ఉద్యోగాలను సృష్టించడానికే ప్రభుత్వాలు ఈ పని చేస్తాయి. దీని వలన దేశ ఖజానా కూడా నిండుతుంది.  అయితే దీని వలన ఒక్కోసారి వినియోగదారులపై కూడా భారం పడే అవకాశం ఉంది. అధిక సుంకాల వలన ముడిసరుకు, కొన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆహార వస్తువులు, కూరగాయలు, బట్టలు, ఎలక్ట్రిక్ మెషినరీ, జెమ్స్, జ్యూయలరీ, ఫార్మా, ఐరన్, స్టీల్‌‌‌‌‌‌‌‌పై ఎక్కువ టారిఫ్‌‌‌‌‌‌‌‌లు పడే అవకాశం ఉంది. దాన్ని బట్టి వాటి ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇలా జరగకుండా ఉండడానికే భారత ప్రభుత్వం ఇప్పుడు యూఎస్ నుంచి దిగుమతి చేసుకుంటున్న 30 రకాల ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై టారిఫ్‌‌‌‌‌‌‌‌లు తగ్గించాలని చూస్తోంది. మనం తగ్గితే ఆటోమేటిక్ గా అమెరికా కూడా సుంకాలను తగ్గిస్తుంది.

today-latest-news-in-telugu | usa | trump tariffs | india | china

Also Read: NASA: మీడియా ముందుకు సునీతా విలియమ్స్..మళ్ళీ ఐఎస్ఎస్ కు వెళ్తా..

Advertisment
Advertisment
Advertisment