Tibet: టిబెట్‌లో ఆగని భూ ప్రకంపనలు..168 గంటల్లో 3600 సార్లు..

జనవరి 7న టిబెట్‌లో భూకంపం వచ్చింది. 7.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి 126 మంది చనిపోయారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు భూ ప్రకంపనలు ఆగలేదు. మొత్తం 3600 సార్లు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ చెబుతోంది. 

author-image
By Manogna alamuru
New Update
Japan Earth Quakes:జపాన్‌లో ఎందుకు ఎక్కువ భూకంపాలు వస్తాయి? కారణం ఇదే.

టిబెట్‌లోని షీగాజే డింగ్రి కౌంటీలో జనవరి 7న 9.05 గంటలకు భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.1గా నమోదైంది. వరుసగా ఆరుసార్లు భూమి కంపించింది.  దీని తాకిడికి 126 మంది పౌరులు మరణించారు. మరో 188 మంది గాయపడ్డారు. నేపాల్‌లో ఉన్న ఖబు హిమాలయాల్లో భూకంపం వచ్చినట్లు గుర్తించారు. అక్కడి లబుసేకు ఈశాన్యంగా ఉన్న డింగ్రీ కౌంటీకి చెందిన త్సోగో టౌన్‌షిప్ ను కేంద్రంగా ఇది ఏర్పడిందని చెబుతున్నారు. భూమిలోపల 10 కి.మీ అడుగున ఇది సంభవించింది. 

168 గంటల్లో 3, 614 సార్లు..

చైనా–నేపాల్ సరిహద్దులో ఉన్న ప్రాంతం టిబెట్. పర్వతాలు, లోయలతో నిండి ఉంటుంది. ఇక్కడే తీవ్రస్థాయిలో భూమి కంపించింది. దీని ఎఫెక్ట్ చైనా, కొంత భారత్‌ల మీద కూడా పడింది. అయితే తాజాగా మరో విషయం తెలిసింది. జనవరి 7 తర్వాత నుంచి ఇప్పటివరకు భూమి కంపిస్తూనే ఉందని చెబుతోంది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో భూ ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం 5.2 తీవ్రతతో మళ్ళీ భూకంపం వచ్చింది.  మొత్తం 168 గంటల్లో 3, 614 సార్లు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ చెప్పింది. భూమి 3–5 మధ్య తీవ్రతతో అనునిత్యం కంపిస్తోంది. దీంతో టిబెట్‌లో ప్రజలు వణికిపోతున్నారు. మళ్ళీ ఎక్కడ పెద్ద ప్రమాదం ఎదుర్కోవలసి వస్తుందోనని భయపడుతున్నారు. దీని వలన తాము నిద్రలేని రాత్రులను గడుపుతున్నామని అక్కడి ప్రజలు చెబుతున్నారు. జనవరి 14తేదీ ఒక్కరోజునే 150సార్లు భూమి కంపించింది. 

Also Read: Kamala Jobs: స్టీవ్ జాబ్స్ కోరిక తీర్చిన భార్య..కుదుటపడిన ఆమె ఆరోగ్యం

ప్రమాదం ఎక్కడ..

టిబెట్‌లోని షిగాజ్ అనేది షిగాజ్ ప్రావిన్స్‌లోని ఒక ప్రాంతం. భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్న దీనిని షిగాస్టే అని కూడా అంటారు. టిబెట్ లోని అత్యంత పవిత్రమైన నగరాలలో ఇద ఒకటి. బౌద్ధమతంలో ప్రముఖ వ్యక్తి అయిన పంచన్ లామా తాలూకా సాంప్రదాయక స్థానం. ఇక్కడే ఎక్కువగా భూ ప్కంపనలు వస్తున్నాయి. ఈ కౌంటీలో 27 గ్రామాలు, సుమారు 60 వేల జనాభా ఉంది. ఈ పీఠభూమి ప్రాంతం శక్తివంతమైన భూకంపాలకు గురయ్యేదిగా గుర్తించారు. ఇది టెక్టోనిక్ యురేషియన్, ఇండియన్ ప్లేట్లు కలిసే చోట ఉంది. ఇవి తరుచుగా తీవ్ర శక్తితో ఢీకొంటున్నాయి. దాని వల్లనే భూకంపాలు సంభవిస్తున్నాయి. 

Also Read: క్రిటికల్ కండిషన్‌లో లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు..మరింత వేగంగా గాలులు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pakistan PM: యుద్ధానికి సిద్ధం సైన్యానికి సెలవులు రద్దు.. పాకిస్థాన్ కీలక ప్రకటన

భారత్ సిందూ ఒప్పందం రద్దు చేయడమంటే యుద్ధం ప్రకటించడమే అంటూ పాక్ పేర్కొంది. పాక్ ప్రధాన మంత్రి గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పాక్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది. భారత్ దాడి చేస్తే.. తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించింది.

New Update
pak meeting

పాక్, భారత్ మధ్య ఉత్రిక్తత పరిస్థితిను నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ పాక్‌తో దౌత్య సంబంధాలు తెచ్చుకుంది. పాకిస్థాన్ హై కమిషన్ ఆఫీస్ కూడా ఖాళీ చేయాలని 72 గంటల టైం ఇచ్చింది. అలాగే సిందూ నదీ జలాల ఒప్పందం కూడా రద్దు చేసింది. దీంతో గురువారం పాకిస్థాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత వైఖరిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది.

భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని పాక్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. పహల్గామ్ దాడిలో భారత్ అసత్యాలు ప్రచారం చేస్తోందని పాక్ ప్రధాని రిలీస్ చేసిన ప్రెస్ మీట్ లో అన్నాడు. భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన అన్నారు. పాకిస్థాన్ భద్రతా అధికారులు, ఆర్మీ ఆఫీసర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయాలన్న భారత ప్రకటనను పాకిస్తాన్ తీవ్రంగా తిరస్కరించింది. ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఏకపక్షంగా నిలిపివేయడానికి ఇందులో ఎటువంటి నిబంధన లేదని పాక్ ప్రధాని చెప్పారు.

సిందూ నదీ జలాలు ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమే అని పాక్ అభిప్రాయ పడుతుంది. భారత్ నుంచి పాకిస్థాన్‌కు విమానాలను కూడా పాకిస్తాన్ రద్దు చేసింది. పాకిస్తాన్, దాని సార్వభౌమాధికారానికి ఏదైనా భంగం వాటిల్లితే వెంటనే ప్రతిచర్యలు ఉంటాయని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ అన్నాడు.

( attack in Pahalgam | india pakistan news | india-pakistan | war | terrorist | jammu-and-kashmir | pakistan | latest telugu news | today news in telugu)

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు