Pakistan: పాకిస్తాన్ లో భూకంపం..భారత్ సరిహద్దుల్లో కూడా..

నిన్న రాత్రి పాకిస్తాన్ లో భూకంప సంభవించింది. ఇస్లామాబాద్‌లలో శనివారం రాత్రి 10:48 గంటలకు భూకంప ప్రకంపనలు వచ్చాయి. దీని ప్రభావం భారత సరిహద్దు అయిన పీవోకే మీద కూడా పడింది. 

New Update
Earth Quake : లేహ్ లడఖ్ లో భూకంపం..కదిలిన కొండలు

పాకిస్తాన్ లోని రావల్పిండి, ఇస్లామాబాద్ లలో భూకంపం సంభవించింది. రాత్రి ప్రజలు నిద్రపోతున్న సమయంలో 10.48 గంటలకు హూమి ఒక్కసారిగా కంపించింది. రావల్పిండికి ఆగ్నేయంగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని చెబుతున్నారు.   17 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపారు. దీని ప్రభావం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కూడా పడింది. ఈ కారణంగా అక్కడ కూడా స్వల్పంగా భూమి కంపించింది. 

ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు..

అయితే ఈ భూకంపం తీవ్రత పెద్దగా లేకపోవడం వలన ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు. రాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ళల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంతకు ముందు గతేడాది చివరలో నవంబర్లో కూడా పాకిస్తాన్లో భూకంపం వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని దక్షాన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ఖైబర్ పఖ్తుంఖ్వా , ఇస్లామాబాద్‌లోని వివిధ నగరాల్లో ప్రకంపనలు సంభవించాయి. ప్రస్తుతం వచ్చిన భూకంపం తీవ్రత 5.1గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే చెబుతోంది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని ఇష్కాషిమ్ నగరానికి పశ్చిమ-నైరుతి దిశలో 37 కి.మీ దూరంలో మరియు 220.7 కి.మీ లోతులో ఉందని తెలిపింది. 

Also Read: Second Batch: అమృత్ సర్ చేరుకున్న అక్రమవలసదారుల రెండవ విమానం

అమెరికాలో కూడా..

దాదాపుగా ఇదే సమయానికి అమెరికాలో కూడా భూకంపం సంభవించింది. కాలిఫోర్నియాలో 3.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. రాత్రి 11:44 గంటలకు భూకంపం సంభవించింది. 15.3 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. కాలిఫోర్నియాలోని మాలిబుకు వాయువ్యంగా 11 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని జియోలాజికల్ సర్వే తెలిపింది. థౌజండ్ ఓక్స్, ఆక్స్‌నార్డ్, సిమి వ్యాలీ మరియు వెంచురాలో ప్రకంపనలు సంభవించాయని, లాస్ ఏంజిల్స్‌లోని కూడా కొన్ని చోట్ల భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.  

Also Read: Delhi: అంతా 15 నిమిషాల్లో జరిగిపోయింది...ఢిల్లీ తొక్కిసలాటకు కారణం అదేనా?

Also Read: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట... రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

గత పది రోజులుగా ప్రపంచం మొత్తం టారీఫ్ ల వార్ తో దడదడలాడిపోతోంది. టారీఫ్ లతో దాదాపు అన్ని దేశాలనూ బెంబేలెత్తించారు. అయితే రెండు రోజు క్రితం ఈ సుంకాలకు 90 రోజుల బ్రేక్ ను కల్పిస్తూ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇందులో చైనాను మాత్రం కలపలేదు. దీంతో మిగతా దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నా చైనాతో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సుంకాల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది అమెరికా. 

ఫోన్లు, కంప్యూటర్ల మీద..

అమెరికా మీద చైనా 125 శాతం, అమెరికా 145 శాతం సుంకాలను విధించుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తుల మీద 145 ఉంటాయి కానీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మీద కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు సంబంధించి ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. 

యాపిల్ కంపెనీకి ఊరట..

సుంకాల పెంచడంతో స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు ధరలు పెరుగుతాయని వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అమెరికా వాసులు స్టోర్లకు కూడా పరుగెత్తారు. కానీ ఇప్పుడు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ప్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తుల మీద ప్రతీకార సుంకాలను పెంచాలంటే అవన్నీ అమెరికాలోనే తయారు చేయాలి. కానీ అక్కడ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి తయారీ కంపెనీలను పెట్టడం కూడా  కుదరదు.  దీనికి కొన్నేళ్ళు సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికా సుంకాల నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయిన యాపిల్ కంపెనీ...ఇప్పుడు తాజా నిర్ణయంతో హమ్మయ్య అనుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 today-latest-news-in-telugu | usa | china | trump tariffs | apple | i-phone

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

Advertisment
Advertisment
Advertisment