నడి సముద్రం నుంచి చైనా రాకెట్ ప్రయోగం

చైనా సముద్రంలో షిప్‌పై నుంచి రాకెట్ లాంచ్ చేసింది. తైయువాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి స్మార్ట్ డ్రాగన్ 3 అనే శాటిలైట్‌ను ఆఫ్ షోర్ జలాల నుంచి అంతరిక్షంలో పంపింది. ఈ స్మార్ట్ డ్రాగన్ 3ని చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెవలప్ చేసింది.

New Update
china rocket

china rocket Photograph: (china rocket)

చైనా అంతరిక్ష ప్రయోగాల్లో ఓ మైలురాయిని చేరింది. నడి సముద్రంలో షిప్‌పై నుంచి తక్కువ వంపు కక్ష్యలోకి రాకెట్‌ను ప్రయోగించిన దేశంగా రికార్డ్ సృష్టించింది. తైయువాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి స్మార్ట్ డ్రాగన్ 3 అనే శాటిలైట్‌ను ఆఫ్ షోర్ జలాల నుంచి అంతరిక్షంలో పంపింది. ఈ స్మార్ట్ డ్రాగన్ 3ని చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెవలప్ చేసింది. దీని పొడవు 31 మీటర్లు, 140 టన్నుల బరువు.

ఈ కమర్షియల్ క్యారియర్ రాకెట్‌ను జనవరి 13న షాన్‌డాండ్ ప్రావిన్స్ ‌లోని హైయాంగ్ సమీపంలోని సముద్ర నీటి మధ్య నుంచి కక్ష్యలోకి ప్రయోగించారు. ఈ శాటిలైట్ తీసుకెళ్లిన పేలోడ్ అంతరిక్ష పర్యావరణ డేటా సేకరణ, ఇంటర్ శాటిలైట్ లేజర్ నెట్ వర్కింగ్ టెస్టుల కోసం ఉపయోగించే ఉపగ్రహాలు ఉన్నాయి. 2019 నుంచి హయాంగ్ 15 రాకెట్లను సముద్రంలో నౌకలపై నుంచి విజయవంతంగా లాంచ్ చేసింది. వాటిలో 89 శాటిలైట్లు తీసుకెళ్లారు. స్మార్ట్ డ్రాగన్-3 డిప్యూటీ చీఫ్ డిజైనర్ లియు వీ, హైయాంగ్ సమీపంలోని నీటిపై నుంచి ఇది తక్కువ వంపు కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఫస్ట్ రాకెట్ అని చెప్పారు. 

Also Read: నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష.. బ్రాహ్మణ దంపతులకు బంపర్ ఆఫర్..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: మళ్లీ భారీ భూకంపం.. వివరాలివే!

ఇండోనేషియాలో పశ్చిమ ఆషే ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‎పై 5.9 తీవ్రవతో భూప్రకంపనలు వచ్చినట్లు ఆ దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. అర్థరాత్రి సమయంలో ప్రజలు గాఢ నిద్రలో ఉండగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

New Update
Earth Quake : లేహ్ లడఖ్ లో భూకంపం..కదిలిన కొండలు

Earth Quake

ఆగ్నేయాసియా దేశాల ప్రజలను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఇటీవల మయన్మార్, థాయ్‎లాండ్ దేశాల్లో భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారు జామున పశ్చిమ ఆషే ప్రావిన్స్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‎పై 5.9 తీవ్రవతో భూప్రకంపనలు వచ్చినట్లు ఆ దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది.

ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో..

సిమెయులు రీజెన్సీలోని సినాబాంగ్ నగరానికి ఆగ్నేయంగా 62 కి.మీ దూరం, సముద్ర మట్టానికి 30 కి.మీ లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అర్థరాత్రి సమయంలో ప్రజలు గాఢ నిద్రలో ఉండగా.. ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే మొదట ఈ భూకంపం 6.2 తీవ్రతతో నమోదైంది. ఆ తర్వాత 5.9గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

ఇది కూడా చూడండి: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

Advertisment
Advertisment
Advertisment