Trump-China: భారత్ స్నేహం కోరుతున్న చైనా..ట్రంప్ సుంకాల దెబ్బ ప్రభావం

ట్రంప్ దెబ్బ చైనాకు బాగా పడినట్టుంది. సుంకాల వాయింపుతో డీలా పడిన డ్రాగన్ దేశ ఇప్పుడు కొత్తగా భారతదేశం వైపు స్నేహ హస్తం చాస్తోంది. కలిసి ముందుకు సాగుదాం అంటూ భిన్న స్వరాన్ని వినిపిస్తోంది.

New Update
china

India-china

Trump-China: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముట్టించిన సుంకాల సెగ ప్రపంచ దేశాల్లో బాగా అగ్గి రాజుకుంది. దీనివలన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛైనాపై ఇప్పటికే 20 శాతం అధిక సుంకాలను బాదిన ట్రంప్...ఏప్రిల్ 2 నుంచి భారత్ మరికొన్ని ప్రతీకార సుంకాలను అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు.  ఈ క్రమంలో చైనా భారత స్నేహాన్ని కోరుతోంది. చైనా, భారతదేశం భాగస్వాములుగా ఉండి ఒకరి విజయానికి ఒకరు దోహదపడాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అన్నారు. రెండు దేశాలు కలవడమే సరైన ఎంపిక అని ఆయన అన్నారు. ఒకరి మార్గంలో మరొకరు అడ్డంకులు సృష్టించుకునే బదులు కలిసి ముందు సాగడం మంచిదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇలా చేయడం వలన రెండు దేశాలు మంచి ప్రయోజనాలు పొందవచ్చంటూ నీతి వాక్యాలు చెప్పారు. 

Also Read: Singer Kalpana: నా భర్తతో నాకేం గొడవలు లేవు..సింగర్ కల్పన వీడియో

Also Read: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!

రెండు దేశాలకూ మంచిది..

భారత్, చైనా చేతులు కలిపితే అంతర్జాతీయంగా ఎక్కువ ప్రభావం చూపించవచ్చని...గ్లోబల్ సౌత్ మరింత బలంగా మారే అవకాశం ఉంటుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అన్నారు. చర్చల ద్వారా పరిష్కరించలేని సమస్య ఏదీ లేదని, సహకారం లేకుండా ఏ లక్ష్యాన్ని సాధించలేమని ఆయన అన్నారు. రెండు దేశాలు కలిసి ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చగలవు అంటూ మాట్లాడారు. ఇంతకాలం ఇండియా మీద కాలు దువ్విన చైనా ట్రంప్ దెబ్బకు స్వరం మార్చింది. ఇప్పుడు అమెరికాను ఎదుర్కోవడానికి భారత్ అవసరం వచ్చిందని విమర్శకులు అంటున్నారు.  మరో వైపు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా యుద్ధం కోరుకుంటే...దానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అది వాణిజ్య యుద్ధం అయినా లేదా మరేదైనా యుద్ధం అయినా సరే అంటోంది. మేము చివరి వరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది.

Also Read: ఒరేయ్ ఇదేం పనిరా.. పెళ్లాం ముందే నిద్రిస్తున్న మరో యువకుడి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ.. ఛీ ఛీ!

Also Read: TS: ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపలికి 110 మంది సిబ్బంది

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Chat GPT: డాక్టర్లకు తెలియలేదు..కానీ చాట్ జీపీటీ గుర్తుపట్టింది..

డాక్టర్లకు సాధ్యం కానిది చాట్ జీపీటీ చేసి చూపించింది. అమెరికాలో అలెక్స్ అనే పిల్లాడికి ఎదురైన ఆరోగ్య సమస్యను చాట్ జీపీటీ అవలీలగా గుర్తుపట్టింది. పదిహేడు మంది డాక్టర్లు చేయలేని పనిని చాట్ జీపీటీ చేసింది. 

author-image
By Manogna alamuru
New Update
CHat gpt

ఏఐ ప్రపంచాన్ని ఆక్రమించేస్తుంది అంటే ఏంటో అనుకున్నారు. కానీ ఇప్పుడు అది నిజమని ప్రూవ్ అవుతోంది. తాజాగా చాట్ జీపీటీ చేసిన ఓ పని అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. డాక్టర్లకు అంతుపట్టని సమస్యను ఇట్టే పసిగట్టింది చాట్ జీపీటీ. అమెరికాలో అలెక్స్ అనే పిల్లాడికి ఓ వింత సమస్య వచ్చింది. బాబు పళ్ళు సరిగ్గా పెరగకపోవడం, ఉన్నట్టుండి శరీరం తూలటం వంటి లక్షణాలతో బాధపడతున్నాడు. అలెక్స్ ను అతని పేరెంట్స్ చాలా ఆసుపత్రులు తిప్పారు. పదిహేడు మంది డాక్టర్లు అతనికి అన్ని పరీక్షలూ చేశారు. కానీ జబ్బేమిటో ఎవరూ చెప్పలేకపోయారు. ఎంఆర్ఐ లాంటి పెద్ద పరీక్షలను కూడా చేయించారు. కానీ ఎవరికీ ఏమీ తెలియలేదు.

రిపోర్టులు చూసి చెప్పేసింది..

డాక్టర్లు చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన అలెక్స్ తల్లిదండ్రులకు చాట్ జీపీటీ గుర్తుకు చవ్చింది. అంతే దానికి ఎంఆర్ఐ రిపోర్టులు, లక్షణాలు అన్నీ వివరంగా చెప్పారు. ఒక్కొక్కటీ ఓపికగా వివరించారు. అన్నీ చెప్పగానే కొద్ది నిమిషాల్లో చాట్ జీపీటీ పిల్లాడికి ఉన్న జబ్బును గుర్తుపట్టింది. దాన్ని ‘టెథర్డ్‌ కార్డ్‌ సిండ్రోమ్‌’ సమస్యని నిర్ధరించింది. ఇదో అరుదైన నాడీ సమస్యని తేల్చి చెప్పింది. ఈ జబ్బు వెన్నెముకను ఎఫెక్ట్ చేస్తుంది. ఎదుగుదల, కదలికలు వంటి వాటిని ప్రభావితం చేసి దెబ్బతీస్తుంది. ఇవన్నీ చాట్ జీపీటీ తల్లిదండ్రులకు వివరంగా చెప్పింది. అంతేకాదు ఈ జబ్బు పేరుతో ఒక ఫేస్ బుక్ అకౌంట్ కూడా క్రియేట్ చేయమని చెప్పింది. ఇలాంటి పిల్లలున్న పేరెంట్స్ ను కలవమని కూడా సలహా ఇచ్చింది. 

చాట్ జీపీటీ సలహాతో అలెక్స్ తల్లిదండ్రులు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. అక్కడ అందిన సలహాలు, సూచనలతో ముందుకు వెళ్ళారు. న్యూరో సర్జన్ ను కలిశారు. చాట్ జీపీటీ చెప్పిన వివరాలు అన్నీ ఆయనకు కూడా తెలిపారు. అనంతరం డాక్టర్ సలహా మేరకు అలెక్స్ కు ఆపరేషన్ కూడా చేయించారు. ప్రస్తుతం పిల్లాడు కోలుకుంటున్నాడు. ఇవన్నీ అయిన తర్వాత అలెక్స్ తల్లి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. కొంతమంది ఏఐ గొప్పతనాన్ని మెచ్చుకుంటుంటే..మరి కొంత మంది అన్ని సార్లు అలా జరగదని అంటున్నారు. చాట్ జీపీటీ లాంటి టూల్స్ ఎప్పటికీ డాక్టర్లు ప్రత్యామ్నాయం కాలేవని హెచ్చరిస్తున్నారు. 

 today-latest-news-in-telugu | chat-gpt | doctors | kid

Also Read: USA: మీ అంతట మీరే వెళ్ళిపోండి..మేము ఖర్చులు భరిస్తాం..ట్రంప్ ఆఫర్

 

Advertisment
Advertisment
Advertisment